Fastag Secrets : ఫాస్టాగ్ గురించి మీరు తెలుసుకోవలసిన కీలక అంశాలు
- ఫాస్టాగ్ వార్షిక పాస్ ధరల్లో మార్పులు
- ఫాస్టాగ్ సరిగ్గా అతికించకపోతే డబుల్ టోల్
- రోడ్డు పనుల సమయంలో టోల్పై 50% రాయితీ
- ప్రయాణికుల కోసం ఎన్హెచ్ఏఐ హెల్ప్లైన్, యాప్ సౌకర్యాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతదేశంలోని జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు ఫాస్టాగ్ ఇప్పుడు ఒక అనివార్యమైన భాగమైంది. టోల్ ప్లాజాల వద్ద నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిస్తూ ప్రయాణాన్ని సులభతరం చేయడమే దీని ప్రధాన ఉద్దేశం. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం , ఎన్హెచ్ఏఐ (NHAI) అమలు చేస్తున్న కొన్ని నిబంధనలు , వెసులుబాట్లు సామాన్య వాహనదారులకు పెద్దగా తెలియవు. ముఖ్యంగా ఫాస్టాగ్ వార్షిక పాస్ (Annual Pass) ధరల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను వార్షిక పాస్ ధర 75 రూపాయలు పెరిగి ప్రస్తుతం 3,075 రూపాయలకు చేరుకుంది. ఒకేసారి ఈ రుసుము చెల్లించడం ద్వారా ఏడాది పొడవునా లేదా 200 టోల్ క్రాసింగ్ల వరకు పదేపదే రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేకుండా ప్రయాణించవచ్చు. రాజ్మార్గ్ యాత్ర యాప్ లేదా అధికారిక వెబ్సైట్ ద్వారా ఈ పాస్ను సులభంగా పొందవచ్చు.
Also Read
- Kitchen Tips: పప్పు డబ్బాల్లో పురుగులు ఉన్నాయా..? అయితే ఈ 7 టిప్స్ మీ కోసం..
- Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
- Bathroom Tiles Cleaning Tips: రూ.10తో బాత్రూమ్ మెరుపు.. టైల్స్ శుభ్రం చేసే ఈజీ టిప్
- Bellam Rava Laddu: నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందే! 10 నిమిషాల్లో హెల్తీ ‘బెల్లం రవ్వ లడ్డు’.. వంటరాని వాళ్లు కూడా ఈజీగా చేయొచ్చు!
మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఫాస్టాగ్ను కేవలం కలిగి ఉండటమే సరిపోదు, దానిని వాహనం ముందు అద్దానికి (Windscreen) లోపలి వైపు సరిగ్గా అతికించాలి. అలా కాకుండా చేతితో పట్టుకుని చూపించినా లేదా విడిగా ఉంచినా, ఆ వాహనదారుడి నుండి రెట్టింపు టోల్ రుసుమును వసూలు చేస్తారు. టోల్ గేట్ల వద్ద అనవసరమైన జాప్యాన్ని నివారించేందుకు ఈ కఠిన నిబంధనను అమలు చేస్తున్నారు. అదేవిధంగా, జాతీయ రహదారులపై మరమ్మతులు లేదా విస్తరణ పనులు జరుగుతున్నప్పుడు వాహనదారులకు భారీ ఉపశమనం లభిస్తుంది. రోడ్డు నిర్మాణ పనులు సాగుతున్న సమయంలో, వినియోగదారులు పాత టోల్ ధరలో కేవలం 50 శాతం మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. ఉదాహరణకు 50 రూపాయల టోల్ ఉన్న చోట, పనులు పూర్తయ్యే వరకు 25 రూపాయలే వసూలు చేయాలని నిబంధనలు చెబుతున్నాయి.
ఫాస్టాగ్ లేని వాహనాలు టోల్ ప్లాజాలోకి ప్రవేశించినప్పుడు చెల్లింపు విధానాన్ని బట్టి జరిమానాలు మారుతుంటాయి. నగదు రూపంలో చెల్లిస్తే రెట్టింపు ధర చెల్లించాల్సి రాగా, ఒకవేళ యూపీఐ (UPI) ద్వారా చెల్లించాలని నిర్ణయించుకుంటే మాత్రం వర్తించే టోల్ ధరపై 1.25 రెట్లు మాత్రమే వసూలు చేస్తారు. ఇక ప్రయాణంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకోవడానికి ఎన్హెచ్ఏఐ 1033 హెల్ప్లైన్ నంబర్ను అందుబాటులోకి తెచ్చింది. రాజ్మార్గ్ యాత్ర యాప్ ద్వారా కేవలం టోల్ వివరాలే కాకుండా, సమీపంలోని పెట్రోల్ బంకులు, ఆసుపత్రులు, ఎలక్ట్రిక్ వాహన ఛార్జింగ్ పాయింట్లు , వాతావరణ సమాచారాన్ని కూడా తెలుసుకోవచ్చు. ఈ అంశాల పట్ల అవగాహన పెంచుకోవడం వల్ల జాతీయ రహదారులపై మీ ప్రయాణం మరింత సురక్షితంగా , పొదుపుగా సాగుతుంది.
తాజావార్తలు
-
Ram Mandir Donation Scam: రామ మందిర విరాళాల వ్యవహారంలో ట్విస్ట్.. 8 మందిపై ఎఫ్ఐఆర్
-
Pawan Kalyan :మీరు అడిగారు, మేము విన్నాం.. ఓజీ యూనివర్స్లోకి స్వాగతం
-
Pakistan Cricket Player: నా భార్య సపోర్ట్ ఇండియాకే.. పాక్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..
-
DOST : డిగ్రీ సీట్లకు డిమాండ్ డౌన్.. ప్రభుత్వ కాలేజీలకే క్రేజ్.!
-
Ketan Agarwal Case: సియా తండ్రికి గుండెపోటు.. కూతురిని ఉరితీయాలని ప్రకటన
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!