ఏపీ అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెట్టారు మంత్రి కురసాల కన్నబాబు. మరో మంత్రి అప్పలరాజు శాసనమండలిలో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టారు. మార్కెటింగ్ యార్డుల్లో నాడు-నేడు. మార్కెటింగ్ శాఖ అభివృద్ధికి రూ. 614.23 కోట్లు. సహకార శాఖకు రూ.248.45 కోట్లు. ఆహార శుద్ధి విభాగానికి రూ.146.41 కోట్లు. ఉద్యానశాఖకు రూ.554 కోట్లు. పట్టు పరిశ్రమకు రూ. 98.99 కోట్లు. ఆచార్య ఎంజీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి రూ.421.15 కోట్లు. వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయానికి రూ.59.91 కోట్లు. వెంకటేశ్వర పశువైద్య…
తెలంగాణలో కేసీఆర్ ఉద్యోగాల ప్రకటనపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 91,142 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని.. వాటిలో 80,039 ఉద్యోగాలకు నేడే నోటిఫికేషన్ జారీ చేస్తున్నట్లు వెల్లడించారు. మిగిలిన 11,103 ఒప్పంద ఉద్యోగులకు క్రమబద్దీకరిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో 91,142 ఉద్యోగాలతోనే నిరుద్యోగ నిర్మూలన సాధ్యంకాదు. ఒకేసారి ఖాళీలన్నింటిని భర్తీ చేయాలని ఎస్.ఎఫ్.ఐ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. తక్షణమే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులకు ఒకేసారి నోటిఫికేషన్ ఇవ్వాలని ఎస్.ఎఫ్.ఐ. డిమాండ్ చేసింది. రాష్ట్ర…
తెలంగాణలో నిరుద్యోగం ఇప్పుడు పార్టీలో ఏజెండాగా మారనుందా? అంటే అవుననే అంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ సమస్యను ప్రధానంగా చర్చిస్తోంది. లక్షలాది ఉద్యోగాల నియామకం చేపట్టాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లు లేక నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. చాలీచాలని జీతాలతో ప్రయివేటు ఉద్యోగాలు చేస్తున్నామని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిగ్రీలు, పీజీలు చేసిన పలువురు నిరుద్యోగులు ఉద్యోగాలు రాక హమాలీ పనికి, టీ, టిఫిన్ సెంటర్లు నడుపుతూ, కూరగాయలు…
తెలంగాణలోనే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు తగిన గుర్తింపు లభిస్తోందన్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి. దేశంలో ఎక్కడా లేని విధంగా నిధులు విధుల కేటాయింపు చేస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ చొరవతో స్థానిక సుపరిపాలన సాకారం అవుతోందన్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు మరింత గౌరవం గుర్తింపు కోసం పని చేస్తానన్నారు. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్ ఎర్రబెల్లి ల సహకారంతో జనగామ సమగ్ర అభివృద్ధికి కృషిచేయడం జరుగుతుందన్నారు. జనగామ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ…
ఏపీలో జగన్ పాలనా తీరుపై తనదైన రీతిలో విమర్శలు చేశారు మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. ప్రభుత్వంతో పోరాడి గెలిచిన సర్పంచ్లే నిజమైన హీరోలు అన్నారు. జగన్ లాంటి సీఎంను నా జీవితంలో ఇప్పటి వరకూ చూడలేదు.గ్రామ పంచాయతీల పరిధిలో ఉండే మైనింగ్, ఇసుక క్వారీలపై పంచాయతీలదే అధికారం అన్నారు. నరేగా నిధులు కూడా పంచాయతీలకు రావాల్సిందే. పంచాయతీలకు రావాల్సిన డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం తీసేసుకుంటే దొపిడీ అనాలా..? ఇంకేమైనా అనాలా..? రాష్ట్రానికి రావాల్సిన డబ్బులను…
భారత ప్రభుత్వ రంగ భీమా సంస్థ ఎల్ఐసీ వద్ద రూ. 21,539 కోట్ల నిధులు ఉన్నట్టు ఆ సంస్థ తెలియజేసింది. ఇవి ఎవరూ క్లెయిం చేయని నిధులని పేర్కొన్నది. ఎల్ఐసీ సంస్థ పబ్లిక్ ఇష్యూకి వెళ్లబోతున్న సంగతి తెలిసిందే. దీనికోసం సెబీకి ధరఖాస్తు చేసుకున్నది. ఈ ధరఖాస్తులో పత్రాల్లో నిధుల కు సంబంధించిన వివరాలను పేర్కొన్నది. మార్చి 2020 నాటికి రూ. 16,052.65 కోట్ల అన్క్లెయిమ్ నిధులు ఉండగా, అవి 2021 మార్చినాటికి రూ. 18,495 కోట్లకు…
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన PM కేర్స్ నిధి కార్యక్రమం ఆశించిన ఫలితాలను రాబట్టడంలో విఫలమైంది. విరాళాల రూపం వచ్చిన మొత్తంలో సగం కూడా ఖర్చు చేయడం లేదు. అంతేకాదు… PM కేర్స్ కింద కొనుగోలు చేసిన మేడిన్ ఇండియా వెంటిలేటర్లు గొడ్లకు పరిమితం కావడం విమర్శలకు దారితీస్తోంది. కరోనా సమయంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు PM కేర్స్ ఫండ్ను ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోడీ. అన్ని రకాల అత్యవసర వైద్యలు అందించేందుకు నిధులు…
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ శ్రమ ఫలించింది. తన పార్లమెంట్ పరిధిలోని రోడ్లతోపాటు రాష్ట్రవ్యాప్తంగా రహదారుల నిర్మాణానికి నిధులు కేటాయించాలంటూ బండి సంజయ్ చేసిన విజ్ఝప్తి పట్ల కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. కేంద్ర రహదారుల మౌలిక సదుపాయాల నిధి (సీఆర్ఐఎఫ్) కింద 2021-22 సంవత్సరానికిగాను తెలంగాణకు రూ. 878.55 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు పరిపాలనా పరమైన అనుమతులు మంజూరు చేస్తూ ఆ శాఖ…
తెలంగాణలో పేదింటి ఆడపిల్లల కుటుంబాలకు ఆసరాగా ఉండాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన కళ్యాణలక్ష్మీ పథకంలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో 45 ఏళ్ల కిందట వివాహమైన ముగ్గురు వృద్ధులకు కళ్యాణలక్ష్మీ పథకం డబ్బులు వారి బ్యాంకు ఖాతాల్లో జమ కావడం ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయి. సిరికొండ మండలానికి చెందిన 67 ఏళ్ల శకుంతలబాయి అనే మహిళకు రెండుసార్లు, 65 ఏళ్ల సుమన్బాయి అనే మహిళకు మూడుసార్లు వారి బ్యాంకు ఖాతాలో కళ్యాణలక్ష్మీ ఆర్థిక సాయం…
ఇరాన్పై అమెరికా మరోసారి విరుచుకుపడింది. పరిమితికి మించి యూరేనియం నిల్వలను పెట్టుకుంటోందని చెప్పి ఇరాన్పై అమెరికా ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షల కారణంగా ఇరాన్ వేలకోట్ల రూపాయలను నష్టపోయింది. కాగా, ఆంక్షల కారణంగా నష్టపోయిన 10 బిలియన్ డాలర్లను అమెరికా వెంటనే చెల్లించాలని, ఆ తరువాతే అణు ఒప్పందంపై చర్చలు జరపాలని, అణు ఒప్పందంపై అమెరికానే ముందుకు రావాలని ఇరాన్ పేర్కొన్నది. 2018 నుంచి ఇరాన్పై ఆంక్షలు విధించారు. అయితే, బైడెన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత…