PM Cares Fund: ఆశించిన ఫలితాలేవి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన PM కేర్స్ నిధి కార్యక్రమం ఆశించిన ఫలితాలను రాబట్టడంలో విఫలమైంది. విరాళాల రూపం వచ్చిన మొత్తంలో సగం కూడా ఖర్చు చేయడం లేదు. అంతేకాదు… PM కేర్స్ కింద కొనుగోలు చేసిన మేడిన్ ఇండియా వెంటిలేటర్లు గొడ్లకు పరిమితం కావడం విమర్శలకు దారితీస్తోంది.
కరోనా సమయంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు PM కేర్స్ ఫండ్ను ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోడీ. అన్ని రకాల అత్యవసర వైద్యలు అందించేందుకు నిధులు సమకూర్చేందుకు ఇది ఏర్పాటయ్యింది. తొలి ఏడాది PM కేర్స్ ఫండ్కు 7 వేల 14 కోట్ల రూపాయల విరాళంగా వచ్చాయి. అందులో 3 వేల 976 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చయ్యాయి. 2020 మార్చి నుంచి 2021 మార్చి మధ్య కాలంలో PM కేర్స్ ఫండ్కు 7 వేల 676 కోట్ల రూపాయలు విరాళంగా అందాయి. ఈ మొత్తంలో 495 కోట్ల రూపాయలు విదేశాల నుంచి వచ్చాయి. కాగా, అంతకు ముందు సంవత్సరం ఖర్చు కాని 3 వేల 77 కోట్లతో పాటు వడ్డీ రూపంలో సమకూరిన 235 కోట్ల రూపాయలతో PM కేర్స్ నిధి 10 వేల 990 కోట్ల రూపాయలకు చేరింది. అయితే… ఇందులో 64 శాతం నిధులు ఖర్చే కాలేదు.
Also Read
- Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
- NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
- Maharashtra: ఘోర విషాదం.. ఆలయ గోడ కూలి ఆరుగురు మృతి
- UP: భర్త కోసం టవరెక్కిన మహిళ.. గంట తర్వాత ఏం జరిగిందంటే..!
గత ఏడాది మార్చిలో PM కేర్స్ నుంచి 3 వేల 976 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. అందులో 6 కోట్ల 60 లక్షల డోసుల కరోనా వ్యాక్సీన్ కోసం 13 వందల 92 కోట్ల రూపాయలు చెల్లించారు. అలాగే, 50 వేల మేడ్ ఇన్ ఇండియా వెంటిలేటర్ల కొనుగోలుకు మరో 13 వేల 11 కోట్ల రూపాయలు వెచ్చించారు. అయితే, పలు PM కేర్స్ ఫండ్స్తో కొన్న వెంటిలేటర్లలో చాలా వరకు నిరుపయోగంగా మిగిలిపోయాయి. లోపాల కారణంగా కొన్ని మూలకు చేరితే… శిక్షణ పొందిన వైద్య సిబ్బంది లేకపోవడం వల్ల ఇంకొన్నింటిని పక్కన పెట్టారు. గత ఏడాది నవబంర్లో జమ్మూ-కాశ్మీర్లో నిర్వహించిన ట్రయల్ రన్లో వంద వెంటిలేటర్లు పనిచేయలేదు. అలాగే, మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్ ఆస్పత్రుల్లో కూడా ఉపయోగించే సిబ్బంది లేకపోవడం వల్ల వెంటిలేటర్లను పక్కనపెట్టేసిన విషయం గత మే నెలలో వెలుగు చూసింది.
ఇదిలా ఉంటే, 2020 లాక్డౌన్ సమయంలో తీవ్ర ఇబ్బందులు పడ్డ వలస కూలీల కోసం వెయ్యి కోట్ల రూపాయలు పక్కన పెట్టారు. అలాగే, సెకండ్ వేవ్ సమయంలో నెలకొన్ని తీవ్ర ఆక్సిజన్ కొరతను అధిగమించేందుకు 162 ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు చేశారు. దీని కోసం 201 కోట్ల రూపాయలు వెచ్చించారు. అలాగే, ప్రభుత్వ ఆధ్వర్యంలోని ల్యాబ్లో కరోనా టీకాలను పరీక్షించి విడుదల చేసేందుకు 20 కోట్ల రూపాయలు వెచ్చించారు. బీహార్లోని పాట్నా, ముజాఫర్పూర్లలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెండు కరోనా ఆస్పత్రులతో పాటు వివిధ రాష్ట్రాల్లో 16 RT-PCR టెస్ట్ ల్యాబ్ల కోసం 50 కోట్ల రూపాయల ఖర్చయ్యింది. మొత్తానికి PM కేర్స్ ఫండ్కు భారీగా విరాళాలు వస్తున్నా… వాటిని వినియోగానికి మాత్రం ప్రభుత్వం సరైన శ్రద్ధ చూపడం లేదు.
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!