Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Pm Cares Funds Not Utilised In India

PM Cares Fund: ఆశించిన ఫలితాలేవి?

Published Date :February 10, 2022 , 9:34 pm
By NTV WebDesk
PM Cares Fund: ఆశించిన ఫలితాలేవి?
  • Follow Us :
  • google news
  • dailyhunt

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన PM కేర్స్‌ నిధి కార్యక్రమం ఆశించిన ఫలితాలను రాబట్టడంలో విఫలమైంది. విరాళాల రూపం వచ్చిన మొత్తంలో సగం కూడా ఖర్చు చేయడం లేదు. అంతేకాదు… PM కేర్స్‌ కింద కొనుగోలు చేసిన మేడిన్‌ ఇండియా వెంటిలేటర్లు గొడ్లకు పరిమితం కావడం విమర్శలకు దారితీస్తోంది.

కరోనా సమయంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు PM కేర్స్‌ ఫండ్‌ను ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోడీ. అన్ని రకాల అత్యవసర వైద్యలు అందించేందుకు నిధులు సమకూర్చేందుకు ఇది ఏర్పాటయ్యింది. తొలి ఏడాది PM కేర్స్‌ ఫండ్‌కు 7 వేల 14 కోట్ల రూపాయల విరాళంగా వచ్చాయి. అందులో 3 వేల 976 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చయ్యాయి. 2020 మార్చి నుంచి 2021 మార్చి మధ్య కాలంలో PM కేర్స్‌ ఫండ్‌కు 7 వేల 676 కోట్ల రూపాయలు విరాళంగా అందాయి. ఈ మొత్తంలో 495 కోట్ల రూపాయలు విదేశాల నుంచి వచ్చాయి. కాగా, అంతకు ముందు సంవత్సరం ఖర్చు కాని 3 వేల 77 కోట్లతో పాటు వడ్డీ రూపంలో సమకూరిన 235 కోట్ల రూపాయలతో PM కేర్స్‌ నిధి 10 వేల 990 కోట్ల రూపాయలకు చేరింది. అయితే… ఇందులో 64 శాతం నిధులు ఖర్చే కాలేదు.

Also Read

  • India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్‌ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
  • SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
  • Producing States in India: భారత్‌లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
  • Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు..
https://ntvtelugu.com/first-case-of-monkey-fever-was-reported-in-kerala-this-year/

గత ఏడాది మార్చిలో PM కేర్స్‌ నుంచి 3 వేల 976 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. అందులో 6 కోట్ల 60 లక్షల డోసుల కరోనా వ్యాక్సీన్‌ కోసం 13 వందల 92 కోట్ల రూపాయలు చెల్లించారు. అలాగే, 50 వేల మేడ్‌ ఇన్‌ ఇండియా వెంటిలేటర్ల కొనుగోలుకు మరో 13 వేల 11 కోట్ల రూపాయలు వెచ్చించారు. అయితే, పలు PM కేర్స్‌ ఫండ్స్‌తో కొన్న వెంటిలేటర్లలో చాలా వరకు నిరుపయోగంగా మిగిలిపోయాయి. లోపాల కారణంగా కొన్ని మూలకు చేరితే… శిక్షణ పొందిన వైద్య సిబ్బంది లేకపోవడం వల్ల ఇంకొన్నింటిని పక్కన పెట్టారు. గత ఏడాది నవబంర్‌లో జమ్మూ-కాశ్మీర్లో నిర్వహించిన ట్రయల్‌ రన్‌లో వంద వెంటిలేటర్లు పనిచేయలేదు. అలాగే, మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌ ఆస్పత్రుల్లో కూడా ఉపయోగించే సిబ్బంది లేకపోవడం వల్ల వెంటిలేటర్లను పక్కనపెట్టేసిన విషయం గత మే నెలలో వెలుగు చూసింది.

ఇదిలా ఉంటే, 2020 లాక్‌డౌన్‌ సమయంలో తీవ్ర ఇబ్బందులు పడ్డ వలస కూలీల కోసం వెయ్యి కోట్ల రూపాయలు పక్కన పెట్టారు. అలాగే, సెకండ్‌ వేవ్‌ సమయంలో నెలకొన్ని తీవ్ర ఆక్సిజన్‌ కొరతను అధిగమించేందుకు 162 ఆక్సిజన్‌ ప్లాంట్ల ఏర్పాటు చేశారు. దీని కోసం 201 కోట్ల రూపాయలు వెచ్చించారు. అలాగే, ప్రభుత్వ ఆధ్వర్యంలోని ల్యాబ్‌లో కరోనా టీకాలను పరీక్షించి విడుదల చేసేందుకు 20 కోట్ల రూపాయలు వెచ్చించారు. బీహార్లోని పాట్నా, ముజాఫర్‌పూర్‌లలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెండు కరోనా ఆస్పత్రులతో పాటు వివిధ రాష్ట్రాల్లో 16 RT-PCR టెస్ట్‌ ల్యాబ్‌ల కోసం 50 కోట్ల రూపాయల ఖర్చయ్యింది. మొత్తానికి PM కేర్స్‌ ఫండ్‌కు భారీగా విరాళాలు వస్తున్నా… వాటిని వినియోగానికి మాత్రం ప్రభుత్వం సరైన శ్రద్ధ చూపడం లేదు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • corona effect
  • covid fight
  • Covid Patients
  • funds
  • india

తాజావార్తలు

  • Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?

  • Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..

  • Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్‌లో వలస నేతల డామినేషన్

  • Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..

  • RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!

ట్రెండింగ్‌

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions