Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Jangaon Mlc Pochampally Request Cm Kcr For Funds To Local Bodies

MLC Pochampally: సీఎం కేసీఆర్ చొరవతో స్థానికసంస్థలకు నిధులు

Published Date :February 24, 2022 , 7:16 pm
By NTV WebDesk
MLC Pochampally: సీఎం కేసీఆర్ చొరవతో స్థానికసంస్థలకు నిధులు
  • Follow Us :
  • google news
  • dailyhunt

తెలంగాణలోనే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు తగిన గుర్తింపు లభిస్తోందన్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి. దేశంలో ఎక్కడా లేని విధంగా నిధులు విధుల కేటాయింపు చేస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ చొరవతో స్థానిక సుపరిపాలన సాకారం అవుతోందన్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు మరింత గౌరవం గుర్తింపు కోసం పని చేస్తానన్నారు. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్ ఎర్రబెల్లి ల సహకారంతో జనగామ సమగ్ర అభివృద్ధికి కృషిచేయడం జరుగుతుందన్నారు.

జనగామ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. సమావేశం జడ్పీ చైర్మన్ భాగాల సంపత్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్ జెడ్పీ సీఈవో జెడ్పిటిసి పలువురు ప్రజాప్రతినిధులు హాజరైన ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గా ఎన్నికైన మొదటి రెండున్నర ఏళ్లలో నిధులు సాధించే వరకు సభలో పెట్టనని చేసిన ప్రమాణం మేరకు నిధులు సాధించాకే రెండవసారి శాసనమండలిలో అడుగు పెడుతున్నా అన్నారు.

Also Read

  • BRS 26th Foundation Day: 25 ఏళ్ల ప్రయాణం.. 26వ వసంతంలోకి బీఆర్ఎస్
  • CM Revanth Reddy : ఐఏఎస్‌ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ
  • GWMC : ఓరుగల్లు బల్దియాకు బాస్ ఎక్కడ.?
  • Telangana: సైబర్ నేరస్థుల వేటలో తెలంగాణ పోలీస్.. "ఆపరేషన్ క్రాక్‌డౌన్ 2.0" ప్రారంభం.!

ప్రజా ప్రతినిధులు నిధులు విధులు సరిగా లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో సీఎం కేసీఆర్, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకి తాను స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గా పలుమార్లు చేసిన విజ్ఞప్తుల మేరకు, వారు స్పందించి కేంద్రానికి పలుమార్లు లేఖలు రాసి 15వ ఆర్థిక సంఘం నిధులను రాష్ట్రానికి తెప్పించారన్నారు. ఆర్థిక సంఘం నిధులు సరిపోకపోవడంతో ఆ నిధులకు సమానంగా రాష్ట్రం నుంచి నిధులు జత చేసి స్థానిక సంస్థలకు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు.

గ్రామ పంచాయతీలకు 85 శాతం, మండల పరిషత్ లకు 10శాతం జిల్లా పరిషత్తులకు 5 శాతం నిధులను కేటాయించి ఆయా స్థాయిల్లో అభివృద్ధికి అనేక విధాలుగా సీఎం కేసీఆర్ బాటలు వేశారని ఎమ్మెల్సీ పోచంపల్లి కొనియాడారు. అలాగే స్థానిక సంస్థలకు అదనంగా బడ్జెట్ లో 500 కోట్లు కేటాయించిన ఘనత కూడా మన సీఎందే అన్నారు. ప్రస్తుతం బడ్జెట్లో కేటాయించిన నిధులు సరిపోవడం లేదని అందుకు తగ్గట్లుగా వచ్చే బడ్జెట్ లో మరిన్ని నిధులు కేటాయించాలని సీఎం కేసీఆర్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకి విజ్ఞాపన అందజేసినట్లు పోచంపల్లి తెలిపారు. ఎన్ఆర్ఈజీఎస్ పనులను జడ్పిటీసీ, ఎంపీటీసీ లకు కూడా కేటాయిస్తే మరింత అభివృద్ధికి అవకాశం వుంటుందన్నారు.

జిల్లా కమిటీలలో ఎంపీపీ లకు, జడ్సీటీసీలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన సూచించారు. కొత్తగా ఏర్పడిన జిల్లా పరిషత్తులు మండల పరిషత్తులు గ్రామ పంచాయతీలకు భవనాల నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామ స్థాయిలో సర్పంచి లాగే ఎంపీటీసీలకు కూడా తగిన గౌరవం దక్కేలా చూడాలని అధికారులకు ఎమ్మెల్సీ సూచించారు. స్థానిక ప్రజాప్రతినిధులకు హెల్త్ కార్డ్స్ ఇచ్చేలా, సూపర్ స్పెషాలిటీ వైద్యం అందే విధంగా చూస్తామని పోచంపల్లి హామీ ఇచ్చారు. జనగామలో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయడానికి మంచి అవకాశాలు ఉన్నాయని ఈ మేరకు సీఎం కేసీఆర్ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ లకు విజ్ఞప్తి చేశాం అని ఆయన వివరించారు.

https://ntvtelugu.com/bhatti-vikramarka-about-jaggareddy-resign/

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • cm kcr
  • Errabelli
  • funds
  • janagaon
  • local govts

తాజావార్తలు

  • Dhanush : వెంకీ అట్లూరితో ధనుష్ సినిమా.. ఓపెన్ ఆఫర్ ఇచ్చిన సార్

  • Stock Market: కోలుకున్న మార్కెట్.. భారీ లాభాల్లో సూచీలు

  • Dhanush: ఆ మాటలు అక్కర్లేదేమో!

  • BYD Unveils Denza Z: 2 సెకన్లలో 100 కి.మీ వేగం.. BYD Denza Z కన్వర్టిబుల్ ఆవిష్కరణ

  • Mojtaba Khamenei: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తాబా కన్నుమూత! కుడ్యచిత్రం ఆవిష్కరణ

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions