IND Vs BAN: నేటి నుంచి భారత్-బంగ్లాదేశ్ మధ్య రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. చిట్టగ్యాంగ్ వేదికగా తొలి టెస్ట్ జరగనుంది. ఇప్పటికే మూడు వన్డేల సిరీస్ను కోల్పోయిన టీమిండియా ఎలాగైనా టెస్టు సిరీస్లో గెలవాలని భావిస్తోంది. ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ చేరుకోవాలంటే ఈ సిరీస్లో విజయం సాధించడం భారత్కు ఎంతో ముఖ్యం. అయితే ఈ సిరీస్లో టీమిండియాను గాయాలు వేధిస్తున్నాయి. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వేలి గాయంతో తొలి టెస్టుకు…
డర్బన్ వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన తొలి టెస్టులో దక్షిణాఫ్రికా ఘనవిజయం సాధించింది. 274 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ కేశవ్ మహరాజ్ బౌలింగ్ ధాటికి 54 పరుగులకే ఆలౌటైంది. దీంతో తమ టెస్టు క్రికెట్ చరిత్రలో బంగ్లాదేశ్ రెండో అత్యల్ప స్కోరు నమోదు చేసింది. గతంలో 2018లో వెస్టిండీస్తో జరిగిన టెస్టులో 43 పరుగులకే ఆలౌటై బంగ్లాదేశ్ చెత్త రికార్డు మూటగట్టుకుంది. డర్బన్ వేదికగా జరిగిన టెస్టుల్లో అత్యల్ప స్కోరు ఇదే కావడం గమనార్హం. కాగా…
మొహాలీ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా పట్టు బిగిస్తోంది. రెండోరోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 4 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. టీమిండియా కంటే ఇంకా 466 పరుగులు వెనుకబడి ఉంది. భారత బౌలర్ల ధాటికి శ్రీలంక వెంట వెంటనే టాప్ ఆర్డర్ వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లలో అశ్విన్ రెండు వికెట్లు తీయగా… రవీంద్ర జడేజా, బుమ్రా తలో వికెట్ తీశారు. కరుణరత్నే, తిరుమన్నే, ఎంజెలో మాథ్యూస్,…
మొహాలీ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్ను 574/8 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా భారీ సెంచరీ చేశాడు. 175 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. అయితే డబుల్ సెంచరీకి జడేజా 25 పరుగుల దూరంలో ఉన్న సమయంలో ఇన్నింగ్స్ను కెప్టెన్ రోహిత్ శర్మ డిక్లేర్ చేయడంపై వివాదం చెలరేగింది. కెరీర్లో జడేజా తొలిసారి డబుల్ సెంచరీ చేసే అవకాశం ఉన్నప్పుడు రోహిత్ ఇన్నింగ్స్ ఎలా డిక్లేర్ చేస్తాడని…
మొహాలీ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో తొలి రోజు ఆటలో టీమిండియా అంచనాల మేరకు రాణించింది. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఇది 100వ టెస్టు కావడంతో అందరి దృష్టి ఈ మ్యాచ్పై పడింది. ఈ టెస్టులో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ తీసుకున్నాడు. తొలిరోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో భారత్ 357/6 స్కోరు చేసింది. వికెట్ కీపర్ రిషబ్ పంత్ (96) తృటిలో సెంచరీ మిస్సయ్యాడు. క్రీజులో…
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియాకు షాక్ తగిలింది. భారత స్టార్ పేసర్ బుమ్రాకు గాయమైంది. సఫారీల తొలి ఇన్నింగ్స్ సందర్భంగా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్న బుమ్రా గాయపడటం టీమిండియాను ఆందోళనకు గురిచేసింది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్ 11వ ఓవర్ ఐదో బంతి వేస్తున్న సమయంలో బుమ్రా పాదం మెలిపడింది. దీంతో కింద కూర్చుండిపోయిన అతడు తీవ్ర నొప్పితో విలవిల్లాడాడు. Read Also: రోహిత్ స్థానంలో వన్డేలకు కెప్టెన్గా కేఎల్ రాహుల్? అయితే బుమ్రా పరిస్థితిని గమనించిన టీమిండియా…
సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 327 పరుగులకు ఆలౌటైంది. రెండో రోజు ఆట వర్షార్పణం కాగా మూడో రోజు ఆటలో భారత్ తీవ్రంగా ఇబ్బందులు పడింది. తొలి సెషన్ ప్రారంభమైన కాసేపటికే… సెంచరీ హీరో కేఎల్ రాహుల్ 123 పరుగుల వద్ద కీపర్ డీకాక్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ వెంటనే రహానె కూడా 48 పరుగుల వద్ద వెనుతిరిగాడు. ఆ తర్వాత వెంట వెంటనే భారత్ వికెట్లు కోల్పోయింది.…
సెంచూరియన్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న తొలి టెస్టులో వరుణుడు తన ప్రతాపం చూపించాడు. రెండో రోజు ఆటను పూర్తిగా అడ్డుకున్నాడు. దీంతో రెండో రోజు ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్ రద్దయింది. వర్షం పలు మార్లు అంతరాయం కలిగించడంతో మైదానం మొత్తం చిత్తడిగా మారింది. ఈ నేపథ్యంలో రెండో రోజు ఆటను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. Read Also: టెస్టుల్లో విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు కాగా తొలి రోజు ఆటలో దక్షిణాఫ్రికాపై…
భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య సెంచూరియన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో రెండో రోజు ఆటకు వరుణుడు ఆటంకం సృష్టిస్తున్నాడు. తొలి రోజు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 90 ఓవర్లలో 272 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ సెంచరీతో సత్తా చాటాడు. 122 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. అతడికి తోడుగా ఆజింక్యా రహానె 40 పరుగులతో క్రీజులో నిలబడ్డాడు. అయితే రెండో రోజు తొలి సెషన్ మొత్తం వరుణుడి వల్ల…
దక్షిణాఫ్రికాతో సెంచూరియన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో తొలి రోజు ఆట ముగిసే సమయానికి 90 ఓవర్లలో భారత్ 3 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ సెంచరీతో కదం తొక్కాడు. కేఎల్ రాహుల్ 122 పరుగులతో క్రీజులో ఉన్నాడు. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (60) తో కలిసి తొలి వికెట్కు 117 పరుగుల భాగస్వామ్యం అందించాడు. కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్లో 17 ఫోర్లు, ఒక సిక్సర్ ఉంది. ఓపెనర్లు రాణించడంతో…