IND Vs SL: రెండో రోజు ముగిసిన ఆట.. కష్టాల్లో శ్రీలంక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మొహాలీ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా పట్టు బిగిస్తోంది. రెండోరోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 4 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. టీమిండియా కంటే ఇంకా 466 పరుగులు వెనుకబడి ఉంది. భారత బౌలర్ల ధాటికి శ్రీలంక వెంట వెంటనే టాప్ ఆర్డర్ వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లలో అశ్విన్ రెండు వికెట్లు తీయగా… రవీంద్ర జడేజా, బుమ్రా తలో వికెట్ తీశారు. కరుణరత్నే, తిరుమన్నే, ఎంజెలో మాథ్యూస్, ధనుంజయ డిసిల్వా తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. ప్రస్తుతం నిస్సాంక, అసలంక క్రీజులో ఉన్నారు. మూడోరోజు ఉదయం సెషన్లో టీమిండియా బౌలర్లు మంచి ప్రదర్శన చేస్తే శ్రీలంకకు ఈ టెస్టులో ఓటమి తప్పకపోవచ్చు.
అటు రెండో రోజు ఉదయం సెషన్లో భారత బ్యాటింగ్ జోరుగా సాగింది. రవీంద్ర జడేజా సూపర్ ఇన్నింగ్స్ కారణంగా టీమిండియా భారీస్కోర్ సాధించింది. ఏడో స్థానంలో వచ్చిన రవీంద్ర జడేజాకు లోయర్ ఆర్డర్ నుంచి పూర్తి సహకారం లభించింది. దీంతో అతడు 228 బంతుల్లో 3 సిక్సులు, 17 ఫోర్లతో 175 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. భారత ఇన్నింగ్స్లో హనుమ విహారి 58, విరాట్ కోహ్లీ 45, రిషబ్ పంత్ 96, అశ్విన్ 61 పరుగులు చేశారు. తొలి ఇన్నింగ్స్లో భారత్ 574/8 స్కోరు వద్ద డిక్లేర్ చేసిన విషయం తెలిసిందే.
Also Read
తాజావార్తలు
-
Cricket Player: తీవ్ర విషాదం.. అరుదైన వ్యాధితో మరణించిన క్రికెటర్..
-
Extra Marital Affair : మియాపూర్ లో దారుణం.. భర్తను హత్య చేసి పూడ్చిపెట్టిన భార్య.!
-
Syria: సిరియా పర్యటనలో మాక్రాన్కు తప్పిన ప్రమాదం.. హోటల్ సమీపంలో భారీ పేలుళ్లు
-
Kriti Sanon: అమ్మతనం కోసం కృతి సనన్ సంచలన నిర్ణయం.. ఆ సినిమా టైమ్లోనే అలా!
-
Antarctica: రక్త జలపాత రహస్యం.. 100ఏళ్ల మిస్టరీ వీడింది!
ట్రెండింగ్
-
టూరిస్టులకు గుడ్ న్యూస్.. ఒక్క రోజులో 5 అద్భుత గమ్యస్థానాలు.! TSTDC అదిరిపోయే టూర్ ప్యాకేజీ.!
-
7,200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Vivo నుంచి కొత్త G5i, G5z స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
Black Jamun Jam: ప్రిజర్వేటివ్స్ అవసరం లేకుండానే.. 6 నెలలు నిల్వ ఉండే ‘నేరేడు జామ్’ ఇంట్లోనే చేయండి ఇలా.!
-
TGPSC Recruitment: ఉద్యోగార్థులకు గుడ్న్యూస్.. టీజీపీఎస్సీ నుంచి రెండు నోటిఫికేషన్లు విడుదల.!
-
Telangana Drought Alert: వాన జాడే లేదు.. కరువు కోరల్లోకి తెలంగాణ.. రైతుల్లో పెరుగుతున్న ఆందోళన!