ఆదివారం మధ్యాహ్న సమయంలో దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ఓ షాకింగ్ సంఘటన జరిగింది. ద్వారక సెక్టార్ 9 లోని ఆర్డి రాజ్పాల్ పబ్లిక్ స్కూల్ లో స్కూల్ ఆవరణలో వారు పార్క్ చేసిన రెండు స్కూల్ బస్సుల్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో రెండు స్కూల్ బస్సులు అక్కడే పూర్తిగా దగ్దమయ్యాయి. స్కూల్ ఆవరణలోనే ఇలా జరగడంతో స్కూల్ యాజమాన్యం ఈ విషయంపై అసలు ఏం జరిగిందో అన్న విషయంపై ఆరా తీస్తున్నారు.…
నంద్యాల హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్సర్య్కూట్ కారణంగా బ్యాంక్లో మంటలు చెలరేగాయి. రెండు ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు.
ఉత్తరఖండ్లోని రాంనగర్ సమీపంలోప ఉండే గర్జియా మాత ఆలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పదుల సంఖ్యలో దుకాణాలు దగ్ధమయ్యాయి. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. కాగా.. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఆలయం కోసి నది ఒడ్డున ఉంది.
ఆదివారం మెక్సికోలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సముద్రంలోని ఆయిల్ రిగ్ లో మంటలు చెలరేగడంతో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో 11 మంది సజీవ దహనమయ్యారు. మరో 9 మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి.
సంగారెడ్డి జిల్లాలో బుధవారం నాడు సాయంత్రం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. హత్నూర మండలం చందాపూర్ దగ్గర ఉన్న ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమలో రియాక్టర్ పేలి మంటలు చేలరేగడంతో అక్కడే పని చేస్తున్న పలువురు కార్మికులు ఎగిరి పడ్డారు. ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చందాపూర్ గ్రామ శివారులో గల కెమికల్ పరిశ్రమలో రియాక్టర్ పేలి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఎస్బీ కెమికల్స్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలడంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు ఎగిరిపడ్డారు.
మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్లో ఈరోజు జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ఏడుగురు మరణించారు. ఈ మంటల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు, ఇద్దరు చిన్నారులు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. తెల్లవారుజామున 4 గంటలకు టైలరింగ్ షాపులో మంటలు చెలరేగడంతో చుట్టుపక్కల వారు భయాందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేయడంలో విజయం సాధించగా., అయితే అప్పటికి మంటల్లో ఏడుగురు మరణించారు. Also read: Harirama Jogaiah: టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి…
Istanbul: టర్కీ ఆర్థిక రాజధాని ఇస్తాంబుల్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. మంగళవారం జరిగిన ఈ ప్రమాదంలో 15 మంది మరణించగా.. 8 మంది గాయపడినట్లు నగర గవర్నర్ తెలిపారు.
ఉత్తర్ప్రదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది. సోమవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఇస్లాంగర్ పట్టణంలోని బాణాసంచా గోదాములో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఓ ఇల్లు చెల్లాచెదురైంది. ప్రమాదం జరిగిన బాణసంచా గోదాము బిల్సీ రోడ్డులో ఉంది. అయితే.. ఈ ప్రమాదంలో చాలా మంది శిథిలాల కింద చిక్కుకుపోయి ఉంటారని అందరు భావిస్తున్నారు.
ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. లైవ్ విద్యుత్ తీగలను తాకడంతో ఓ ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో దాదాపు ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది గాయపడ్డారు.