Sangareddy: సంగారెడ్డి కెమికల్ ఫ్యాక్టరీ ప్రమాదం.. 6కి చేరిన మృతుల సంఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంగారెడ్డి జిల్లాలో బుధవారం నాడు సాయంత్రం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. హత్నూర మండలం చందాపూర్ దగ్గర ఉన్న ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమలో రియాక్టర్ పేలి మంటలు చేలరేగడంతో అక్కడే పని చేస్తున్న పలువురు కార్మికులు ఎగిరి పడ్డారు. ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఇక, ఘటనా స్థలంలో మరో మృతదేహం లభ్యం అవుతుంది. శిథిలాల కిందపడి మొహం పూర్తిగా నిజ్జు నుజ్జు అయింది. ఇతర కార్మికుల ద్వారా మృతుని ఆచూకీని పోలీసులు తెలుసుకుంటున్నారు. ఇంకా, రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. అయితే, ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో 15 మంది కార్మికులు చికిత్స పొందుతున్నారు. పలువురి పరిస్థితి విషమం.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
Read Also: Sruthi Haasan : శృతిహాసన్ రేంజ్ పెరిగింది గురూ..
Also Read
- Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ఇక, ఎస్బీ ఆర్గానిక్స్ యూనిట్-1లో కాలంచెల్లిన రియాక్టర్లను ఉపయోగించడం వల్లే ప్రమాదం సంభవించినట్లు పోలీసులు ప్రాథమిక అంచనా వేస్తున్నారు. దశాబ్దాల క్రితం నిర్మించిన భవనంతో పాటు బాయిలర్ కూడా పూర్తిగా శిథిలావస్థకు చేరినట్లు గుర్తించారు. ఇటీవలే బాయిలర్ వద్ద నామమాత్రపు మరమ్మతులు చేసినా.. సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడమే ప్రమాదానికి ప్రధాన కారణమని కార్మికులు అంటున్నారు. కేవలం నెల రోజుల వ్యవధిలో 9 మంది మృతి చెందినట్లు తెలిపారు. జిల్లాలో ఉన్న 24 పారిశ్రామిక వాడల్లో గత రెండేళ్ల వ్యవధిలో 40 ప్రమాదాలు జరిగాయని పోలీసులు చెప్పారు. రెండేళ్లలో 72 మంది కార్మికులు మృతి చెందగా.. 225 మందికి గాయాలు అయ్యాయి. ఇక, మృతులు SB ఆర్గానిక్స్ డైరెక్టర్ రవికుమార్ (హైదరాబాద్), ప్రొడక్షన్ ఆఫీసర్ సుబ్రహ్మణ్యం(ఏపీ), దయానంద్ (తమిళనాడు), సురేష్పాల్ (ఉత్తర ప్రదేశ్), కార్మికుడు విష్ణుతో పాడు ఆరో మృతుడి వివరాలు ఇంకా లభ్యం కాలేదు అని పోలీసులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!