ఆంధ్ర రంజీ జట్టుకు భారత టెస్ట్ క్రికెటర్ హనుమ విహారి గుడ్ బై చెప్పారు. భవిష్యత్లో ఆంధ్ర క్రికెట్ జట్టుకు ఆడబోనని వెల్లడించాడు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పై ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లలో ఆవేదన వెళ్లగక్కాడు. క్రికెట్లో ఏపీ రాజకీయ నేత జోక్యం ఉందని మనస్తాపం వ్యక్తం చేస్తూ ఇన్స్టాలో విహారి పోస్టు చేశారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో క్రీడాకారుల కన్నా.. రాజకీయాలకే ప్రాధాన్యత ఎక్కువ ఉందని వెల్లడించారు.
ఏపీలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోడీకి గన్నవరం ఎయిర్పోర్ట్లో వీడ్కోలు పలికారు సీఎం వైఎస్ జగన్.. అదే సమయంలో తమ ప్రభుత్వ కోరికల చిట్టాను ఆయన చేతిలో పెట్టారు..
విద్యను బోధించే టీచర్లకు, విద్యార్థులకు మధ్య బాండింగ్ చాలా బాగా ఉంటుంది. కొంత మంది విద్యార్థులు టీచర్లతో కలిసిమెలిసి ఉంటారు. టీచర్లు కూడా విద్యార్థులతో స్నేహంగా మెలుగుతారు. అలాంటి టీచర్లకు స్కూల్లో గౌరవం అపారంగా ఉంటుంది. అలాంటి టీచర్లు రిటైర్ అయ్యే సమయంలో వారికి ఇచ్చే ఫేయిర్వెల్ పార్టీని అద్భుతంగా నిర్వహిస్తుంటారు. ఇలాంటి సంఘటన ఒకటి పశ్చిమ బెంగాల్లో జరిగింది. బెంగాల్లోని 24 పరగణాల ప్రాంతంలో కటియాహట్ బికేఏపీ బాలికల పాఠశాలలో సంపా అనే టీచర్ విధులు…
మనషులు, జంతువుల మధ్య బంధం గురించి స్పెషల్ గా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే ఈ అనుబంధం చాలా గొప్పది, విడదీయలేనిది. ఆ మూగ జీవాలు చూపించే ప్రేమ అమూల్యం. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. చనిపోయిన తన మావటిని కడసారి చూసేందుకు గజరాజు తరలివచ్చిన దృశ్యాలను ఆ వీడియోలో చూడొచ్చు. విగతజీవుడిలా పడివున్న ఆ మావటిని పిలుస్తున్నట్టుగా తొండం పైకెత్తి పలుమార్లు ఆ ఏనుగు ప్రదర్శించిన హావభావాలు ప్రతి ఒక్కరినీ కదిలిస్తున్నాయి.ఆ మావటి కుటుంబ…