విద్యను బోధించే టీచర్లకు, విద్యార్థులకు మధ్య బాండింగ్ చాలా బాగా ఉంటుంది. కొంత మంది విద్యార్థులు టీచర్లతో కలిసిమెలిసి ఉంటారు. టీచర్లు కూడా విద్యార్థులతో స్నేహంగా మెలుగుతారు. అలాంటి టీచర్లకు స్కూల్లో గౌరవం అపారంగా ఉంటుంది. అలాంటి టీచర్లు రిటైర్ అయ్యే సమయంలో వారికి ఇచ్చే ఫేయిర్వెల్ పార్టీని అద్భుతంగా నిర్వహిస్తుంటారు. ఇలాంటి సంఘటన ఒకటి పశ్చిమ బెంగాల్లో జరిగింది. బెంగాల్లోని 24 పరగణాల ప్రాంతంలో కటియాహట్ బికేఏపీ బాలికల పాఠశాలలో సంపా అనే టీచర్ విధులు నిర్వహిస్తున్నది.
Read: Russia Ukraine Conflict: ముదురుతున్న వివాదం… దాడి అనివార్యం…
ఆమె ఆ స్కూల్ నుంచి బదిలీ కావాల్సి వచ్చింది. దీంతో అక్కడి విద్యార్థినులు ఆమెకు గుర్తిండిపోయేలా ఫెయిర్ వెల్ ను ఏర్పాటు చేశారు. టీచర్ కళ్లకు గంతలు కట్టి మైదానంలోకి తీసుకొచ్చారు. అక్కడ మైదానంలో విద్యార్థినులు అంతా మోకాళ్లపై కూర్చొని బాలివుడ్ సూపర్ హిట్ సినిమాలోని రబ్నే బనాదీ జోడీ సినిమాలోని పాటను పాడారు. దీంతో ఆ టీచర్ కన్నీటి పర్యంతం అయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
Students pouring out their love to Sampa mam, probably one of the best teachers in the world. @iamsrk pic.twitter.com/XEQg7MFTbk
— kishan kuliyal (@KishanlalK) February 19, 2022