YS Jagan: ప్రధానికి వీడ్కోలు పలికిన ఏపీ సీఎం.. మోడీ చేతికి కోరికల చిట్టా…!
ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన భారత ప్రధాని నరేంద్ర మోడీకి వీడ్కోలు పలికిన సీఎం వైఎస్ జగన్.. అదే సమయంలో.. తమ ప్రభుత్వ కోరికల చిట్టాను ఆయన చేతిలో పెట్టారు.. గన్నవరం విమానాశ్రయంలో ప్రధాన మంత్రికి వీడ్కోలు పలికిన ఏపీ సీఎం.. అక్కడే మోడీకి విజ్ఞాపన పత్రం అందజేశారు.. ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు వంటి పలు కీలక అంశాలను ప్రధానికి అందజేసిన విజ్ఞాపన పత్రంలో ప్రస్తావించారు సీఎం జగన్.. రీసోర్సు గ్యాప్ గ్రాంటు అంశాన్ని విజ్ఞాపన పత్రంలో పేర్కొన్నారు.. రూ.34,125.5 కోట్ల రూపాయలను రీసోర్స్ గ్యాప్ కింద గ్రాంటుగా ఆంధ్రప్రదేశ్కు ఇవ్వాలని కోరారు సీఎం.. ఇక, తెలంగాణ డిస్కంలనుంచి ఏపీ జెన్కోకు రావాల్సిన రూ.6,627.28 కోట్లను ఇప్పించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.. పోలవరం ప్రాజెక్టుకు సవరించిన అంచనాల ప్రకారం రూ.55,548.87 కోట్లకు ఆమోదం తెలపాలని కోరారు ఆంధ్ర ముఖ్యమంత్రి.
Read Also: Viral: నడి సముద్రంలో రెండు ముక్కలైన ఓడ… రెస్క్యూ ఆపరేషన్ వైరల్..
Also Read
- Dwcra Group: డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. 22 లక్షల మంది అకౌంట్లోకి డబ్బులు..
- Vijayasai Reddy: మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన ప్రకటన.. మళ్లీ రాజకీయ ప్రవేశం..
- Off The Record : రెడ్డి సుబ్రహ్మణ్యం టీడీపీకి తలనొప్పిగా మారుతున్నారా?
- E Challan: ట్రాఫిక్ ఈ చలాన్లపై.. కీలక ఆదేశాలు జారీ చేసిన సుప్రీంకోర్టు..
జాతీయ ఆహార భద్రతా చట్టం కింద రాష్ట్రానికి ఇస్తున్న రేషన్ విషయంలో హేతు బద్ధత లేదని, దీనివల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతోందని, సవరించి రాష్ట్రానికి మేలు చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు సీఎం వైఎస్ జగన్.. ఇక, రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన వైద్య కళాశాలకు తగిన ఆర్థిక సహాయం చేయాలని విజ్ఞప్తి చేసిన ఆయన.. భోగాపురం ఎయిర్పోర్టుకు సంబంధించిన క్లియరెన్స్లు మంజూరుచేయాలని కోరారు.. ఏపీఎండీసీకి గనులు కేటాయించాలని విన్నవించారు.. విభజన వల్ల దెబ్బతిన్న రాష్ట్రం కోలుకునేందుకు ప్రత్యేక హోదా ఇవ్వాలని తన వినతిపత్రంలో పేర్కొన్నారు సీఎం వైఎస్ జగన్. కాగా, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఏపీలో పర్యటించారు.. భీమవరంలో అల్లూరి సీతారామరాజు 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం భీమవరానికి సమీపంలోని కాళ్ల మండలం పెద అమిరంలో నిర్వహించిన బహిరంగసభలో ప్రధాని మోడీ పాల్గొన్న విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Off The Record: కాళేశ్వరం కేసు దర్యాప్తు చుట్టూ పొలిటికల్ కలర్..
-
Salt : జాగ్రత్త..! ఉప్పు ఎక్కువగా తింటున్నారా.? ఈ ప్రమాదం గురించి తెలుసుకోండి..!
-
Infinix GT 50 Pro: 6,500mAh బ్యాటరీతో కొత్త గేమింగ్ బీస్ట్.. ఇన్ఫినిక్స్ GT 50 Pro విడుదల
-
Off The Record: నాగబాబు మంత్రి పదవి మీద ఆశలు వదులుకున్నట్టేనా..?
-
Dwcra Group: డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. 22 లక్షల మంది అకౌంట్లోకి డబ్బులు..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!