టాటా సన్స్ చైర్మన్ రతన్ నావల్ టాటా ఈ ప్రపంచానికి వీడ్కోలు పలికారు. రతన్ టాటా నిజాయితీపరుడు, నైతికత, పరోపకారం కలిగిన వ్యక్తి. జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురైనా.. విజయం సాధించారు. ఆయన పెళ్లి చేసుకోలేదు. కానీ పిల్లల పెంపకం విషయంలో తల్లిదండ్రులకు ఆయన గొప్ప సూచనలు చేశారు. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు అత్యుత్తమ విద్యను అందిస్తారు. డబ్బు సంపాదించి ధనవంతులు కావడమే దీని వెనుక లక్ష్యంగా పెట్టుకుంటారు. అలాంటి తల్లిదండ్రులలో మీరు కూడా ఉన్నట్లయితే..…
గంగాధర నెల్లూరు గ్రామానికి చెందిన నాగరాజా రెడ్డి కుటుంబం శుక్రవారం ఇంటిలో పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో కుమారుడు దినేష్ (22), భార్య జయంతి (45), కుమార్తె సునీత (26) నలుగురు కలిసి ఇంటిలో పురుగుల మందు సేవించాడు నాగరాజు రెడ్డి అనే వ్యక్తి.. కొద్దిసేపటి తర్వాత అరుపులు విన్న గ్రామస్తులు 108కు సమాచారం ఇవ్వడంతో వీరిని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు..
కాంగ్రెస్ నేతలు చిక్కుల్లో పడుతున్నారు. మొదట కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.. ఇప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే న్యాయపరమైన సమస్యలతో సతమతం అవుతున్నారు. మల్లికార్జున్ ఖర్గేతో పాటు ఆయన కుటుంబ సభ్యులు అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ బీజేపీ నేత ఎన్ఆర్ రమేష్ కర్ణాటక లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు.
రాంచీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తేనెటీగల దాడిలో ఒకే కుటుంబానికి చెందిన ఒక మహిళ, ముగ్గురు పిల్లలు మృతి చెందారు. మృతురాలు భర్త సునీల్ బార్లా తెలిపిన వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 21 (శనివారం) తన భార్య జ్యోతి గాడి తన తల్లి గారింటికి వెళ్లింది. ఈ క్రమంలో.. ఇంటికి సమీపంలోని ఓ బావిలో స్నానం చేస్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగిందని తెలిపాడు.
Chhattisgarh : ఛత్తీస్గఢ్లోని హోంమంత్రి జిల్లాలో మరో పెను ఘటన వెలుగు చూసింది. కవర్ధాలోని లోహార్దిహ్ గ్రామంలో హింసాత్మక గుంపు ఒక కుటుంబ సభ్యులను సజీవ దహనం చేయడానికి ప్రయత్నించింది.
విధి నిర్వహణలో మృతి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ చంద్రానాయక్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రకటించారు ఏపీ హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత.. సీఎం చంద్రబాబు నాయుడు బందోబస్తు విధులకోసం వచ్చిన.. ఏఆర్ కానిస్టేబుల్ చంద్రా నాయక్ గుండెపోటుతో మృతి చెందడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.. సహచరులు ఎంతో శ్రమించి సీపీఆర్ చేసి కాపాడాలని ప్రయత్నించినా ఏఆర్ కానిస్టేబుల్ చంద్రానాయక్ (పీసీ 3570) అకాలమరణం చెందడం అత్యంత విషాదకరం అన్నారు..
అమెరికాలో తెలంగాణకు చెందిన రాజేష్ అనే విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. రాజేష్ మృతికి కారణమేంటో తెలియలేదు. మృతదేహం స్వగ్రామానికి తరలించేలా ఏర్పాట్లు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను బాధిత కుటుంబం కోరుతోంది. అలాగే మరణానికి గల కారణాలు తెలుసుకోవాలని అభ్యర్థిస్తున్నారు.
10 మంది వ్యక్తులు ముఖానికి ముసుగులు ధరించుకుని వచ్చి ఓ కుటుంబంపై కర్రలు, రాడ్లతో దాడి చేసిన ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున న్యూ అశోక్ నగర్లో ఈ ఘటన జరిగింది. ఈ దాడిలో ఆరుగురు గాయపడ్డారు. కాగా.. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తన మామే తమపై దాడి చేశారని బాధితురాలు కాజల్ ఆరోపిస్తుంది. ఆస్తి తగాదా విషయంలో దాడికి పాల్పడినట్లు చెబుతుంది.
నంద్యాల జిల్లా, చాగలమర్రి మండలం చిన్నవంగలి గ్రామంలో అర్థరాత్రి సమయంలో మట్టి మిద్దె కూలి ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందిన ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు.. ఈ ఘటన తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందన్నారు.. బాలికకు అండగా ఉంటానని ప్రకటించారు..
నంద్యాల జిల్లాలో విషాదం నెలకొంది. చాగలమర్రి మండలం చిన్నవంగలిలో ఇల్లు కూలి ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందారు. ఆ కుటుంబం గాఢ నిద్రలో ఉన్న సమయంలో.. అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.. ఈ ప్రమాదంలో భార్య, భర్త, ఇద్దరు పిల్లలు మృతి చెందారు.