Mallikarjun Kharge: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఆయన కుటుంబంపై కేసు..!
- కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే.. ఆయన కుటుంబంపై కేసు
- అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ బీజేపీ నేత ఎన్ఆర్ రమేష్ లోకాయుక్తలో ఫిర్యాదు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ నేతలు చిక్కుల్లో పడుతున్నారు. మొదట కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.. ఇప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే న్యాయపరమైన సమస్యలతో సతమతం అవుతున్నారు. మల్లికార్జున్ ఖర్గేతో పాటు ఆయన కుటుంబ సభ్యులు అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ బీజేపీ నేత ఎన్ఆర్ రమేష్ కర్ణాటక లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. మోసం, పత్రాలను ఫోర్జరీ చేయడం, ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆక్రమించేందుకు కుట్ర పన్నడం, ప్రభుత్వ ఆస్తులను చట్టవిరుద్ధంగా స్వాధీనపరచుకోవడం వంటి ఆరోపణలు ఉన్నాయి.
Read Also: Pakistan: పాకిస్థాన్లో వారం రోజులుగా మతపరమైన అల్లర్లు.. 37 మంది మృతి
Also Read
- CM Revanth Reddy: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై రేవంత్ ఫైర్.. కేంద్రంపై తీవ్ర విమర్శలు
- Telangana Temples Revenue: ఆధ్యాత్మికతతో పాటు ఆర్థిక రికార్డులు.. 2025-26లో రూ.556 కోట్ల ఆదాయం
- Meta Smart Glasses: సరికొత్త టెక్నాలజీ ఫీచర్.. గాలిలో వేళ్లు ఊపితే చాలు వాట్సాప్లో మెసేజ్ పంపొచ్చు!
- Kakinada Accident: ఉపాధి కూలీలపైకి దూసుకెళ్లిన టిప్పర్.. అక్కడికక్కడే నలుగురు మహిళల మృతి
ఐదెకరాల భూమి కేసులో స్కామ్ ఆరోపణల్లో ఒకటి ప్రభుత్వ ఆస్తుల అక్రమ క్లియరెన్స్కు సంబంధించినది. అనుమానాస్పద పరిస్థితుల్లో సిద్ధార్థ్ విహార్ ట్రస్టుకు ఐదు ఎకరాల భూమిని కేటాయించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఖర్గే, మంత్రి ప్రియాంక్ ఎం. ఖర్గే, రాహుల్ ఎం. ఖర్గే, రాధాబాయి ఎం. ఖర్గే, రాధాకృష్ణ, మంత్రి ఎం.బి. పాటిల్, IAS అధికారి డాక్టర్ ఎస్. సెల్వకుమార్ పేర్లను ఫిర్యాదులో పేర్కొన్నారు.
Read Also: Rajasthan: పోలీసుల ఎస్కార్ట్తో రాజస్థాన్ డిప్యూటీ సీఎం కుమారుడి రీల్ షూట్..
బిజెపి నాయకుడు తన వాదనలకు మద్దతుగా 394 పేజీల పత్రాలను సాక్ష్యంగా సమర్పించారు. ఫిర్యాదు ప్రకారం.. రెండు వేర్వేరు ప్రభుత్వ సంస్థలు సిద్ధార్థ్ విహార్ ట్రస్ట్కు ఆస్తులను కేటాయించాయి. 2014లో బెంగళూరులోని BTM 4వ స్టేజ్లోని 8,002 చ.మీటర్ (86,133 చ.అ.) CA ప్లాట్, సైట్ నంబర్ 05, బెంగళూరు డెవలప్మెంట్ అథారిటీ (BDA) ద్వారా కేటాయించబడింది. అదనంగా 2024 మే 30న బగలూరులోని హైటెక్ డిఫెన్స్ మరియు ఏరోస్పేస్ పార్క్ యొక్క హార్డ్వేర్ సెక్టార్లోని ఐదు ఎకరాల భూమిని రాహుల్ ఎం ఖర్గేకు కర్ణాటక ఇండస్ట్రియల్ ఏరియాస్ డెవలప్మెంట్ బోర్డ్ (KIADB) కేటాయించింది. ఈ భూకేటాయింపులు సక్రమంగా ఆమోదించబడలేదని.. ఫిర్యాదులో పేర్కొన్న వారి చర్యలపై సమగ్ర విచారణ జరపాలని రమేష్ కోరారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై రేవంత్ ఫైర్.. కేంద్రంపై తీవ్ర విమర్శలు
-
Telangana Temples Revenue: ఆధ్యాత్మికతతో పాటు ఆర్థిక రికార్డులు.. 2025-26లో రూ.556 కోట్ల ఆదాయం
-
Meta Smart Glasses: సరికొత్త టెక్నాలజీ ఫీచర్.. గాలిలో వేళ్లు ఊపితే చాలు వాట్సాప్లో మెసేజ్ పంపొచ్చు!
-
Virat Kohli: “జట్టుకు పనికొస్తానో లేదో నా ముఖం మీద చెప్పేయండి”.. గంభీర్, అగార్కర్పై కోహ్లీ ఫైర్..
-
UIDAI New Aadhaar App: mAadhaar యాప్ త్వరలో నిలిపివేత.. కొత్త Aadhaar యాప్కు డేటా ఎలా బదిలీ చేయాలి? పూర్తి వివరాలు
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..