Mallikarjun Kharge: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఆయన కుటుంబంపై కేసు..!
- కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే.. ఆయన కుటుంబంపై కేసు
- అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ బీజేపీ నేత ఎన్ఆర్ రమేష్ లోకాయుక్తలో ఫిర్యాదు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ నేతలు చిక్కుల్లో పడుతున్నారు. మొదట కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.. ఇప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే న్యాయపరమైన సమస్యలతో సతమతం అవుతున్నారు. మల్లికార్జున్ ఖర్గేతో పాటు ఆయన కుటుంబ సభ్యులు అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ బీజేపీ నేత ఎన్ఆర్ రమేష్ కర్ణాటక లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. మోసం, పత్రాలను ఫోర్జరీ చేయడం, ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆక్రమించేందుకు కుట్ర పన్నడం, ప్రభుత్వ ఆస్తులను చట్టవిరుద్ధంగా స్వాధీనపరచుకోవడం వంటి ఆరోపణలు ఉన్నాయి.
Read Also: Pakistan: పాకిస్థాన్లో వారం రోజులుగా మతపరమైన అల్లర్లు.. 37 మంది మృతి
Also Read
- Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
- Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
- IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
- IAF Report: ఆపరేషన్ సిందూర్పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
ఐదెకరాల భూమి కేసులో స్కామ్ ఆరోపణల్లో ఒకటి ప్రభుత్వ ఆస్తుల అక్రమ క్లియరెన్స్కు సంబంధించినది. అనుమానాస్పద పరిస్థితుల్లో సిద్ధార్థ్ విహార్ ట్రస్టుకు ఐదు ఎకరాల భూమిని కేటాయించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఖర్గే, మంత్రి ప్రియాంక్ ఎం. ఖర్గే, రాహుల్ ఎం. ఖర్గే, రాధాబాయి ఎం. ఖర్గే, రాధాకృష్ణ, మంత్రి ఎం.బి. పాటిల్, IAS అధికారి డాక్టర్ ఎస్. సెల్వకుమార్ పేర్లను ఫిర్యాదులో పేర్కొన్నారు.
Read Also: Rajasthan: పోలీసుల ఎస్కార్ట్తో రాజస్థాన్ డిప్యూటీ సీఎం కుమారుడి రీల్ షూట్..
బిజెపి నాయకుడు తన వాదనలకు మద్దతుగా 394 పేజీల పత్రాలను సాక్ష్యంగా సమర్పించారు. ఫిర్యాదు ప్రకారం.. రెండు వేర్వేరు ప్రభుత్వ సంస్థలు సిద్ధార్థ్ విహార్ ట్రస్ట్కు ఆస్తులను కేటాయించాయి. 2014లో బెంగళూరులోని BTM 4వ స్టేజ్లోని 8,002 చ.మీటర్ (86,133 చ.అ.) CA ప్లాట్, సైట్ నంబర్ 05, బెంగళూరు డెవలప్మెంట్ అథారిటీ (BDA) ద్వారా కేటాయించబడింది. అదనంగా 2024 మే 30న బగలూరులోని హైటెక్ డిఫెన్స్ మరియు ఏరోస్పేస్ పార్క్ యొక్క హార్డ్వేర్ సెక్టార్లోని ఐదు ఎకరాల భూమిని రాహుల్ ఎం ఖర్గేకు కర్ణాటక ఇండస్ట్రియల్ ఏరియాస్ డెవలప్మెంట్ బోర్డ్ (KIADB) కేటాయించింది. ఈ భూకేటాయింపులు సక్రమంగా ఆమోదించబడలేదని.. ఫిర్యాదులో పేర్కొన్న వారి చర్యలపై సమగ్ర విచారణ జరపాలని రమేష్ కోరారు.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!