Suicide Attempt: అప్పు ఇవ్వడం వరకే.. అప్పు ఇచ్చిన వారి చేతుల్లో ఉంటుంది. తిరిగి రాబట్టుకోవడం అంటే ఓ పెద్ద సవాల్గానే మారుతోంది. అప్పు ఇచ్చిన వారు.. తీసుకున్న వారికే భయపడే రోజులు కనిపిస్తున్నాయి. తాజాగా పల్నాడు జిల్లాలో అప్పు ఇచ్చిన వ్యక్తి ఇంట్లో.. అప్పు తీసుకున్న వాడి కారణంగా ఇద్దరు బలయ్యారు. అసలు ఆ అప్పు కథేంటి? అప్పు ఇచ్చిన వ్యక్తి ఇంట్లో విషాదం ఎలా జరిగింది? చూద్దాం. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇతని పేరు…
Family Suicide: ఉత్తరప్రదేశ్ లోని చిత్రకూట్ జిల్లాలో ఓ దారుణం చోటుచేసుకుంది. గుట్కా కొనడం కోసం భర్త డబ్బు ఇవ్వలేదని మనస్తాపానికి గురైన మహిళ విషం తాగి ఇద్దరు చిన్నారులతో కలసి ప్రాణాలు తీసుకుంది. మరో చిన్నారి ఈ విషప్రయోగం నుంచి తప్పించుకున్నప్పటికీ పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. 26 ఏళ్ల జ్యోతి యాదవ్ అనే మహిళా శనివారం ఉదయం భర్త బబ్బు యాదవ్ దగ్గర గుట్కా కొనేందుకు డబ్బు అడిగింది. కానీ, ఆయన నిరాకరించడంతో వారిద్దరి…
Madhya Pradesh: మధ్యప్రదేశ్లో దారుణం చోటుచేసుకుంది. ఒక మహిళ వివాహేతర సంబంధం కుటుంబాన్ని బలి తీసుకుంది. ఈ కేసులో మహిళలో పాటు ఆమె లవర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. సాగర్ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు, మనోహర్ లోధి (45), అతని తల్లి ఫూల్రాణి (70), కుమార్తె శివాని (18), అతని 16 ఏళ్ల కుమారుడు జూలై 25-26 రాత్రి ఆత్మహత్య చేసుకుని మరణించారు.
కన్నపిల్లలను వద్దనుకొని ప్రియుడి మోజులో పడి ఇల్లు వదిలి వెళ్లిపోయిన ఓ కుమార్తె తీరు నలుగురి ప్రాణాలు తీసింది. కన్నబిడ్డ ఇల్లు వదిలి వెళ్లిపోవడంతో అవమానంగా భావించిన ఆ తల్లి… తన కన్నతల్లికి చెప్పుకొని ఆవేదన చెందింది. ఇంత పరువు పోయాక ఇక బతకడం దేనికి అనుకొని ఆ తల్లి, అమ్మమ్మ ఇద్దరు మనవరాళ్లను చంపి ఆపైన తాము కూడా ఉరేసుకొన్న విషాద ఘటన తమిళనాడులోని దిండుక్కల్ జిల్లాలో జరిగింది. వివాహేతర సంబంధం నలుగురి ప్రాణాలు తీసింది……
హర్యానాలోని పంచకులాలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రవీణ్ మిట్టల్ అనే వ్యాపారవేత్త తన కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నాడు. అతని భార్య, తల్లిదండ్రులు, ముగ్గురు పిల్లలు సహా ఏడుగురు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అప్పుల కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. దాదాపు 20 కోట్ల రూపాయలు అప్పులు ఉన్నట్లు సంచలన విషయాలు రాసుకొచ్చారు.
Mysuru Suicide: కర్ణాటక రాష్ట్రం మైసూరు తీవ్ర విషాదకర సంఘటన చోటు చేసుకుంది. కూతురి ప్రేమ కుటుంబాన్నే బలి తీసుకుంది. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోయిందని కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడింది. తల్లిదండ్రులతో పాటు చిన్న కూతురు హెబ్బల్హా జలాశయంలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్లో విషాదం చోటుచేసుకుంది. తల్లి ముగ్గురు చిన్నారులను అన్నంలో విషం కలిపి తినిపించింది. తాను ఆహారం ద్వారా విషం తీసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ విషాద ఘటనలో ముగ్గురు చిన్నారులు పిల్లలు సాయి కృష్ణ (12), మధుప్రియా (10), గౌతమ్ (8) మృతిచెందారు. తల్లి రజిత తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
హబ్సిగూడ కుటుంబం మృతి సూసైడ్ నోట్లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. పిల్లల్ని ఇద్దరిని చంపి లెక్చరర్ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైడ్ లెటర్లో పేర్కొన్నారు.
అనంతపురం జిల్లా నార్పలలో విషాదం చోటుచేసుకుంది. నార్పల మండల కేంద్రంలోని మెయిన్ బజార్లో ఉన్న పెద్దమ్మ సామీ గుడి వద్ద ఉన్న ఓ ఇంటిలో ఆరునెలల బాలుడితో పాటు ఉరేసుకుని దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆ ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండడంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు.
చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరుకు చెందిన నాగరాజా రెడ్డి బెట్టింగ్లకు పాల్పడి అధిక మొత్తంలో డబ్బులను పోగొట్టుకున్నాడు. అప్పులు కూడా ఎక్కవయ్యాయి. దీంతో.. అప్పుల బాధ భరించలేక రెండ్రోజుల క్రితం (శుక్రవారం) తన కుటుంబంతో కలిసి ఇంట్లో పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు వారిని చిత్తూరు ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో శుక్రవారం భార్యాభర్తలిద్దరూ మృతి చెందగా.. నిన్న చికిత్స పొందుతూ కుమార్తె సునీత మృతి చెందింది. కొద్దిసేపటి క్రితం చికిత్స పొందుతూ…