Family Suicide: ‘గుట్కా’ కొనడానికి డబ్బులు ఇవ్వలేదని దారుణానికి పాల్పడ్డ మహిళ.. చిన్నారులతో కలసి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Family Suicide: ఉత్తరప్రదేశ్ లోని చిత్రకూట్ జిల్లాలో ఓ దారుణం చోటుచేసుకుంది. గుట్కా కొనడం కోసం భర్త డబ్బు ఇవ్వలేదని మనస్తాపానికి గురైన మహిళ విషం తాగి ఇద్దరు చిన్నారులతో కలసి ప్రాణాలు తీసుకుంది. మరో చిన్నారి ఈ విషప్రయోగం నుంచి తప్పించుకున్నప్పటికీ పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. 26 ఏళ్ల జ్యోతి యాదవ్ అనే మహిళా శనివారం ఉదయం భర్త బబ్బు యాదవ్ దగ్గర గుట్కా కొనేందుకు డబ్బు అడిగింది. కానీ, ఆయన నిరాకరించడంతో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అదే రోజున సాయంత్రం జ్యోతి ఈ దారుణానికి పాల్పడింది. ఈ ఘటనలో ఆమె మాత్రమే విషం తాగడమే కాకుండా తన ముగ్గురు పిల్లలకు కూడా ఇచ్చింది.
Minister Ramprasad Reddy: మంత్రి రాసలీలల ఆరోపణలు హాస్యాస్పదం.. వైసీపీపై మండిపల్లి ఫైర్!
Also Read
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
సాయంత్రం పని ముగించుకొని ఇంటికి వచ్చిన భర్త బబ్బు, నలుగురేళ్ల కుమారుడు నొప్పితో విలవిల్లాడుతూ “అమ్మ ఏదో చేదుగా ఉన్నది ఇచ్చింది” అంటూ ఏడుస్తూ కనిపించాడు. అప్పటికే చిన్న కుమార్తె, ఏడాది వయసున్న బుల్బుల్ ఊపిరి ఆడక మృతి చెందారు. జ్యోతి గది లోపలే స్పృహ తప్పి పడి ఉండగా మరో కుమార్తె చంద్రమా (4) పరిస్థితి కూడా విషమంగా ఉంది. వెంటనే వారిని మజ్గావాన్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించగా వైద్యులు బుల్బుల్ మృతి చెందినట్లు ధృవీకరించారు. పరిస్థితి విషమించడంతో మిగిలిన వారిని సత్నా జిల్లా ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గమధ్యలో జ్యోతి, చంద్రమా మృతిచెందారు. ఐదేళ్ల దీప్ చాంద్ ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. కానీ అతని ఆరోగ్య పరిస్థితి కూడా ఆందోళన కలిగిస్తోందని సమాచారం.
Asia Cup 2025: రషీద్ ఖాన్ కెప్టెన్గా ఆసియా కప్ బరిలోకి ఆఫ్ఘనిస్తాన్.. జట్టు ప్రకటన!
గ్రామస్థులు, బంధువుల ప్రకారం జ్యోతి గుట్కా అలవాటు కారణంగానే తరచూ దంపతుల మధ్య గొడవలు జరిగేవని తెలిపారు. పిల్లల భవిష్యత్తుపై ప్రభావం పడుతుందని భర్త పలు మార్లు అడ్డుకున్నా, ఆమె అలవాటు మానలేదని చెప్పారు. ఈ ఘటనపై వైద్యులు, పోలీసులు సమగ్ర విచారణ చేపట్టారు. మజ్గావాన్ మెడికల్ ఆఫీసర్ రూపేష్ సోని ప్రకారం, బాధితులను ఆసుపత్రికి తీసుకొచ్చినప్పుడే విషప్రయోగం లక్షణాలు స్పష్టంగా కనిపించాయని తెలిపారు.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!