Suicide Attempt: ఇచ్చిన అప్పు తిరిగి ఇవ్వకపోవడంతో కుటుంబం మొత్తం..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suicide Attempt: అప్పు ఇవ్వడం వరకే.. అప్పు ఇచ్చిన వారి చేతుల్లో ఉంటుంది. తిరిగి రాబట్టుకోవడం అంటే ఓ పెద్ద సవాల్గానే మారుతోంది. అప్పు ఇచ్చిన వారు.. తీసుకున్న వారికే భయపడే రోజులు కనిపిస్తున్నాయి. తాజాగా పల్నాడు జిల్లాలో అప్పు ఇచ్చిన వ్యక్తి ఇంట్లో.. అప్పు తీసుకున్న వాడి కారణంగా ఇద్దరు బలయ్యారు. అసలు ఆ అప్పు కథేంటి? అప్పు ఇచ్చిన వ్యక్తి ఇంట్లో విషాదం ఎలా జరిగింది? చూద్దాం. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇతని పేరు రామనాథం శీను. ఊరు పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ఫణిదం. శీను గ్రామంలో కిరాణాషాపు నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. గ్రామంలో రెండున్నర ఎకరాల పొలం కౌలుకు తీసుకుని వ్యవసాయం కూడా చేస్తున్నాడు.
అయితే రామనాథం శీను.. ఆస్పత్రిలో ఉండడానికి కారణం.. అతను ఇచ్చిన అప్పు అంటే నమ్మగలరా? కానీ అదే నిజం. అదే గ్రామానికి చెందిన దాసరి వెంకటేశ్వర్లుకు శీను 90 వేల రూపాయలు అప్పుగా ఇచ్చాడు. గడువు తీరినా ఇవ్వకపోవడంతో పెద్దమనుషుల వద్ద పంచాయితీ కూడా జరిగింది. దీంతో వెంకటేశ్వర్లు 25 వేల రూపాయలు తిరిగి ఇచ్చాడు. మిగతా బాకీ నెమ్మదిగా తీరుస్తానని చెప్పాడు. మళ్లీ బాకీ డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టడంతో వెంకటేశ్వర్లు ఇంటికి శీను కుటుంబ సభ్యులు వెళ్లారు. దీంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. డబ్బులు ఇవ్వాల్సిందేనని వెంకటేశ్వర్లును గట్టిగా అడిగి వెళ్లిపోయారు.
Also Read
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
- Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
Domestic Violence: మనిషివా..? మృగానివా..? నిన్ను ఏం చేసినా తప్పుకాదేమో!
అయితే బాకీ ఇవ్వాలని ఇంటికొచ్చి అడగడంతో మనస్తాపానికి గురై పురుగుల మందు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు వెంకటేశ్వర్లు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం గుంటూరు జీజీహెచ్ కు తరలించారు. బాకీ డబ్బులు ఇవ్వాలని అడగడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డానని చెబుతున్నాడు.
బాకీ డబ్బులు ఇవ్వాలని అడిగిన తర్వాత వెంకటేశ్వర్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంతో శీను కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. ఇదే విషయంపై కుటుంబ సభ్యుల మధ్య చర్చ జరిగింది. వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తారని భావించి ఆందోళనకు గురయ్యారు. భార్య పూర్ణ కుమారి, కొడుకు వెంకటేష్ పొలానికి వెళ్లిన తర్వాత ఇంట్లో గడ్డిమందు తాగాడు శీను.
తర్వాత పొలానికి వెళ్లి ఇదే విషయాన్ని భార్యకు చెప్పాడు. మీరు లేకుండా మేము మాత్రం బతకడం ఎందుకంటూ కొడుకు వెంకటేష్తో కలిసి పొలంలోని బావిలో దూకింది భార్య పూర్ణ కుమారి. వెంటనే శీను ఈ విషయాన్ని పాలడుగులో ఉంటున్న అల్లుడు చంద్రశేఖర్కు ఫోన్లో చెప్పాడు. వెంటనే అల్లుడు హుటాహుటిన పొలం వద్దకు చేరుకున్నాడు. అప్పటికే శీను పొలంలో పడి ఉన్నాడు. వెంటనే మామను సత్తెనపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. నాకు ఇవ్వాల్సిన డబ్బులు అడిగితే వెంకటేశ్వర్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంతో భయాందోళనలకు గురయ్యానంటున్నాడు శీను. తన కళ్లముందే భార్య, కొడుకు బావిలో దూకారని ఆవేదన వ్యక్తం చేశాడు.
Pakistan: ఛీ.. ఛీ.. ఆటే కాదు.. నిరసన చేయడం కూడా చేతకాదా? ఆసియా కప్ 2025లో హైడ్రామా!
కేసు భయంతో బావిలో దూకిన తల్లీకొడుకుల మృతదేహాలకోసం గజ ఈతగాళ్లు గాలించారు. తల్లి పూర్ణకుమారి మృతదేహం లభ్యమైనా కొడుకు వెంకటేష్ మృతదేహం లభించలేదు. దీంతో వెంకటేష్ మృతదేహాన్ని బయటకు తీసేందుకు మోటార్ల సాయంతో బావిలోని నీటిని బయటకు తోడే ఏర్పాట్లు చేశారు. ఇదే సమయంలో గజ ఈతగాళ్లు కూడా 6 గంటలపాటు గాలింపు చేసి వెంకటేష్ మృతదేహాన్ని గుర్తించి బావిలోనుంచి బయటకు తీశారు. వెంకటేష్ మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరయ్యారు. అప్పు ఇచ్చి కుటుంబంలో ఇద్దరు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Hamid Ansari row: ‘‘ దేశానికి హిందువులు ముప్పా.?’’.. హమీద్ అన్సారీ వ్యాఖ్యలపై దుమారం..
-
Vedant Madhavan: ప్రౌడ్ ఫాదర్ మూమెంట్.. ఏషియన్ గేమ్స్ బరిలో మాధవన్ కుమారుడు!
-
Garba Row: గర్బాలో ముస్లింల ఎంట్రీపై వివాదం.. నుదిటిపై తిలకం తప్పనిసరి!
-
CM Chandrababu: ఎల్నినో ఎఫెక్ట్.. నిత్యావసరాల ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక యాక్షన్ ప్లాన్..
-
Upcoming IPOs : వచ్చే వారం మార్కెట్లో ఐపీఓల జాతర.. ఏకంగా 19 కంపెనీల ఎంట్రీ! పూర్తి వివరాలు ఇవే..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!