Haryana: ఒకే కుటుంబానికి చెందిన 7 గురు ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో ఏం రాశారంటే..!
- హర్యానాలోని పంచకులాలో హృదయ విదారక ఘటన
- ప్రవీణ్ మిట్టల్ అనే వ్యాపారవేత్త కుటుంబం ఆత్మహత్య
- విషం తాగి ఆత్మహత్య చేసుకున్న 7గురు కుటుంబీకులు
- అప్పుల కారణంగా బలవన్మరణానికి పాల్పడినట్లు వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హర్యానాలోని పంచకులాలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రవీణ్ మిట్టల్ అనే వ్యాపారవేత్త తన కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నాడు. అతని భార్య, తల్లిదండ్రులు, ముగ్గురు పిల్లలు సహా ఏడుగురు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అప్పుల కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. దాదాపు 20 కోట్ల రూపాయలు అప్పులు ఉన్నట్లు సంచలన విషయాలు రాసుకొచ్చారు.
READ MORE: Realme Buds Air 7 Pro: 48 గంటల ప్లేబ్యాక్ తో.. రియల్మీ కొత్త ఇయర్బడ్స్ విడుదల
Also Read
- Crude Oil Prices: ప్రభుత్వ చమురు సంస్థలకు రోజూ రూ.1,000 కోట్ల నష్టం!.. పెట్రోల్, డీజిల్ ధరల బాదుడు తప్పదా?
- Rangasamy: ఐదవసారి పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా రంగస్వామి ప్రమాణ స్వీకారం..!
- Gold Sales Decline: పడిపోయిన బంగారం అమ్మకాలు.. కళకళలాడాల్సిన సమయంలో వెలవెలబోతున్న షాపులు
- Prateek Yadav: అఖిలేష్ యాదవ్ తమ్మడు 'ప్రతీక్ యాదవ్' మృతి..!
స్థానిక పోలీసుల కథనం ప్రకారం..ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ కు చెందిన ఈ కుటుంబం బాగేశ్వర్ ధామ్ బాబా ధీరేంద్ర శాస్త్రి చేసిన మతపరమైన ఉపన్యాసంలో పాల్గొనేందుకు సోమవారం పంచకుల వెళ్లింది. సెక్టార్ 27లోని ఓ ఇంటి సమీపంలో ఈ కుటుంబం ప్రయాణిస్తున్న కారును నిలిపారు. అదే కారులో ప్రవీణ్ మిట్టల్ కుటుంబ సభ్యులు మొత్తం విషం తాగారు. కారులో అలాగే కూర్చున్నారు. కారు డోర్ కు టవల్ వేలాడుతూ ఉండటాన్ని స్థానిక యువకుడు గమనించాడు. దగ్గరికి వెళ్లి ఏమైందో అని చూశాడు. కారులో ఆరుగురు వ్యక్తులు వాంతులు చేసుకుని ఒకరిపై ఒకరు అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. ఏడో వ్యక్తి కష్టంగా శ్వాస తీసుకుంటూ కనిపించాడు. తమ కుటుంబం అప్పుల పాలైందని, అందుకే చనిపోతున్నామని చెప్పాడు. తాను కూడా మరో 5 నిమిషాల్లో చనిపోతానని ఆ వ్యక్తి యువకుడితో తెలిపాడు. ఆ యువకుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. కొన ఊపిరితో ఉన్న వ్యక్తిని ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గంమధ్యంలో మృతి చెందాడు.
READ MORE: Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు ప్రభాకర్ రావుకు నోటీసులు..
ఘటనా స్థలానికి చేరుకున్న పంచకుల డీసీపీ హిమాద్రి కౌశిక్, శాంతిభద్రతల డీసీపీ అమిత్ దహియా దర్యాప్తు చేపట్టారు. ఆరుగురిని ఓజాస్ ఆస్పత్రికి తీసుకువచ్చినట్లు తమకు సమాచారం అందిందని పంచకుల డిప్యూటీ పోలీస్ కమిషనర్ (డీసీపీ) హిమాద్రి కౌశిక్ తెలిపారు. అందరూ చనిపోయారని తెలిపారు. కారులో సూసైడ్ నోట్ దొరికి నట్లు వెల్లడించారు. కుటుంబం తీవ్ర ఆర్థిక ఒత్తిడి కారణంగా ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. అప్పుల బాధ, ఆర్థిక ఇబ్బందులతో ఆ కుటుంబం సామూహిక ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. రూ.20 కోట్ల వరకు అప్పు ఉందని.. రూ.20 కోట్ల వరకు అప్పు ఉందని తెలిసింది. ప్రవీణ్ మిట్టల్ వ్యాపారంలో భారీగా నష్టపోయినట్లు పేర్కొన్నారు. కొన్ని బ్యాంకుల నుంచి తప్పించుకుని తిరుగుతున్నట్లు రాసుకొచ్చారు.
తాజావార్తలు
-
Crude Oil Prices: ప్రభుత్వ చమురు సంస్థలకు రోజూ రూ.1,000 కోట్ల నష్టం!.. పెట్రోల్, డీజిల్ ధరల బాదుడు తప్పదా?
-
Jailer 2: ‘జైలర్ 2’ ఇప్పట్లో రానట్టేనా?
-
RCB vs KKR: మాపై కోహ్లీ దూకుడుగా ఆడాలని కోరుకుంటున్నా.. కేకేఆర్ కోచ్ వాట్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Rangasamy: ఐదవసారి పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా రంగస్వామి ప్రమాణ స్వీకారం..!
-
Gold Sales Decline: పడిపోయిన బంగారం అమ్మకాలు.. కళకళలాడాల్సిన సమయంలో వెలవెలబోతున్న షాపులు
ట్రెండింగ్
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!