ఇందిరాపార్క్ దగ్గర సెకండ్ ఎఎన్ఎమ్ ల ధర్నాకు హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మద్దతు తెలిపారు. ధర్నాను ఉద్దేశించి ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రంలో కాంట్రాక్ట్ ఎఎన్ఎమ్ లను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నాలు చేస్తున్నారు..
రైతుల మీద జలగల్లాగా పట్టి పీడిస్తున్నారు.. 2023 డిసెంబర్ వరకే మీకు అధికారాన్ని ప్రజలు అప్పగించారు.. నీకేం 40 ఏళ్లకు ఇవ్వలేదు.. నువ్వేం నిజాం సర్కార్ వు కాదు అని ఈటల రాజేందర్ విమర్శించారు. కేసీఆర్ పోలీసులతో ఎన్నాళ్ళు రాజ్యం నడుపుతావు..
MP Laxman: మోడీ ముచ్చటగా మూడో సారి పీఎం అవుతారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. కేంద్రం ప్రకటించిన రైల్వే ప్రాజెక్టులపై తండ్రి కొడుకుల స్పందన ఏది? అని ప్రశ్నించారు.
ధరణి పేదల కోసం కాదు.. పెద్దల కోసం అని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న కలెక్టర్లకు టార్గెట్లు పెట్టారు అని ఆయన ఆరోపించారు. చట్ట సభలపై కేసీఆర్ కి నమ్మకం సన్నగిల్లింది.. బడ్జెట్ సమావేశాలు 11 రోజులు.. వర్షాకాల సమావేశాలు 3 రోజులు.. ఈ ఏడాది మొత్తం 14 రోజులు మాత్రమే అసెంబ్లీ సమావేశాలు జరిగాయని ఆయన అన్నారు.
మేడ్చల్ జిల్లాలోని శామీర్ పేట మండలం బొమ్మరాజుపేట రైతులకు మద్దతుగా శామీర్ పేట పోలీస్ స్టేషన్ కు బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ వెళ్లారు. 50 ఏళ్ల క్రితం కొనుక్కున్న 1,050 ఎకరాల భూమిని కబ్జా చేస్తున్నారని.. కేసీఆర్ బంధువుల పేరిట రిజిస్ట్రేషన్ చేస్తున్నారని రైతులు ఆందోళన చేస్తున్నారు.
వరంగల్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటన తర్వాత తెలంగాణ బీజేపీలో అంతర్గత విభేదాలు సద్దుమణిగినట్లు కనిపిస్తున్నాయి. దీంతో పాటు పార్టీ పటిష్టత కోసం కమలనాథులు తెలంగాణలో వరుస సమావేశాలు, పర్యటనలు చేస్తున్నారు. ఇక మాజీ మంత్రి ఎ. చంద్రశేఖర్ పార్టీ మారుతున్నారనే ప్రచారంతో బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ ఇవాళ (ఆదివారం) ఆయన నివాసానికి వెళ్లి ఇద్దరు కాసేపు చర్చించుకున్నారు.
Etala Rajender: బీఆర్ఎస్ను దించేది బీజేపీ నే అని, ఇప్పటికే ఆలస్యం జరిగిందని బీజేపీ నేత ఈటెల రాజేందర్ అన్నారు. కేసీఆర్ ను గద్దె దించేందుకు కేంద్ర పార్టీ సహకారం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు.
తెలంగాణ భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్కు వచ్చారు. ఈ క్రమంలో తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడిగా కిషన్రెడ్డి పదవీ బాధ్యతలను తీసుకున్నారు. ఈ సందర్బంగా తెలంగాణకు చెందిన పలువురు కమలం పార్టీ నేతలతో కిషన్ రెడ్డి సమావేశం అయ్యారు. గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్లో బీజేపీ రాష్ట్ర పదాధికారులు, అధికార ప్రతినిధులు, జాతీయ కార్యవర్గ సభ్యులు, ముఖ్య నేతలతో ఆయన అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ గా నియమితులైన ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ అభినందించారు.
తెలంగాణలో పాలిటిక్స్ హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. అయితే భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హాట్ కామెంట్స్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు కాంగ్రెస్, బీజేపీ పార్టీలలో కోవర్టులు ఉన్నారు అని ఆయన వ్యాఖ్యనించారు. ఈటల రాజేందర్ అనేటోడు పార్టీ మారడు.. అంగీ మార్చుకున్నంత ఈజీ కాదు పార్టీ మారడం అంటే అంటూ కామెంట్స్ చేశారు.