డ్రగ్ అనేది ఒక్క సెలెబ్రెటీ ఇస్యు మాత్రమే కాదని, పొలిటికల్- బార్డర్- ఆర్థికపరమైన ఇష్యూ కూడా అని నటి పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘టాలీవుడ్ డ్రగ్ కేసు ఇష్యూపై త్వరలో మాట్లాడుతాను.. నా వ్యక్తిగత అనుభవం తెలియజేస్తాను’ అంటూ పూనమ్ కౌర్ తెలిపారు. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలకు కొందరి అభిమానులు మద్దతు తెలియపరుస్తున్నారు. వ్యవస్థలోని లోపం పూనమ్ ఎత్తిచూపిందంటున్నారు. సినీ సెలెబ్రెటీలను నాలుగు రోజులు విచారణ జరిగి ఆతరువాత ‘యథా రాజా.. తథా…
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో నటి ఛార్మి విచారణ ముగిసింది. ఉదయం 10.30 నుండి సాయంత్రం 6.30 వరకు ఛార్మి ఈడీ విచారణ ఎదుర్కొన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ఈడీ అధికారులు కోరిన బ్యాంక్ డ్యాక్యుమెంట్స్ సమర్పించాను.. దర్యాప్తుకు పూర్తిగా సహకరించాను. ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తిరిగి ఎప్పుడు పిలిచినా దర్యాప్తుకు సహకరిస్తాను’ అంటూ ఛార్మి తెలిపింది. కాగా విచారణ సందర్భంగా ఆమెకు సంబంధించిన రెండు బ్యాంక్ ఖాతాల లావాదేవీలను ఈడీ అధికారులు పరిశీలించారు. 2016లో కెల్విన్తో మాట్లాడిన…
200 కోట్ల దోపిడీ కేసులో బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ను ఈడీ ప్రశ్నించిన విషయం తెలిసిందే. అయితే ఈ విచారణలో ఆమె నుంచి పోలీసులు కీలక విషయాలు రాబట్టారు. కానీ ఈ కేసుతో ఆమెకు ఎలాంటి సంబంధం లేదని వారు వెల్లడించారు. నిందితుడు కన్హార్ సుకేశ్ చంద్రశేఖర్ తీహార్ జైలు నుండి కాలర్ ఐడి స్పూఫింగ్ ద్వారా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ను సంప్రదించారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) వర్గాలు మంగళవారం తెలిపాయి. సుకేష్ చంద్రశేఖర్పై నమోదైన మనీలాండరింగ్ కేసులో…
టాలీవుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధించి ఈడీ విచారణను వేగవంతం చేసిన సంగతి తెలిసిందే. ఈరోజు నుంచి 12 మంది సినీ ప్రముఖులను విచారించనుండగా, తొలిరోజున దర్శకుడు పూరీ జగన్నాథ్ ఈడీ విచారణకి హాజరయ్యారు. ఉదయం 10.17 గంటల నుంచి రాత్రి 7.45 వరకు ఈ విచారణ కొనసాగింది. పూరీని, అతని సీఏను విడివిడిగా ప్రశ్నించారు. పూరీ బ్యాంకు లావాదేవీలపై పూర్తిగా ఈడీ ఆరదీసింది. పూరీకి చెందిన 3 బ్యాంకు అకౌంట్ల నుంచి సమాచారం సేకరించింది. 2015 నుంచి…
టాలీవుడ్ లో డ్రగ్స్ కేసు ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రముఖ సెలెబ్రిటీల పేర్లు ఇందులో బయటకు వచ్చాయి. 2017 లోనే ఈ కేసుతో సంబంధం ఉన్న వ్యక్తులు రవితేజ, ఛార్మి, రకుల్, రానా, తరుణ్, పూరి జగన్నాథ్, నవదీప్, ముమైత్ ఖాన్, నందు, శ్రీనివాస్ తదితరుల నుంచి శాంపిల్స్ ను సేకరించి డ్రగ్స్ నిర్ధారణ పరీక్ష కోసం ల్యాబ్ కు పంపారు. ఆ తరువాత ఈ కేసులో వేగం తగ్గిపోయింది. తాజాగా ఈడీ సెలెబ్రెటీలకు…