ఏలూరు జిల్లా పెదవేగి మండలం కవగుంటలో మరో విషాదం చోటు చేసుకుంది. కట్టుకున్న భర్త.. కన్న ఇద్దరు కుమారులు ఒకేసారి మృతిచెందడంతో.. రెండు రోజులు తీవ్ర మనస్థాపంతో ఉన్న భార్య దేవి.. చివరకు తాను కూడా ప్రాణాలు విడిచింది..
చదివింది తొమ్మిదో తరగతి.. కానీ మోసాలు చేయడంలో మాత్రం ఇస్రో శాస్త్రవేత్తల కంటే ఎక్కువ తెలివితేటలు చూపించి నాలుగు పెళ్లిళ్లు చేసుకుని మోసాలకు పాల్పడుతున్నాడొక నిత్య పెళ్ళికొడుకు. ఇస్రోలో హెచ్ఆర్ ఉద్యోగం అని చెబుతూ.. వందల ఎకరాల పొలాలు, విల్లాలు ఉన్నాయని ... పెళ్లికూతుళ్ల కుటుంబ సభ్యులకు ఇస్రోలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ బంపర్ ఆఫర్లు ఇచ్చి లక్షలకు లక్షలు దోచేస్తున్న ఆ ప్రబుద్ధుడి ఆట కట్టించారు ఏలూరు జిల్లా భీమడోలు పోలీసులు
ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో భక్తులకు పెను ప్రమాదం తప్పింది. నూజివీడు సమీపంలోని దేవరకొండ నుంచి ఆటోలో చిన్న వెంకన్న దర్శనానికి భక్తులు వచ్చారు. దర్శనం అనంతరం శివాలయం ఘాట్ రోడ్ నుంచి ఆటోలో కిందికు దిగుతున్న సమయంలో ఆటో బ్రేక్ ఫెయిల్ అయింది.
అన్నదమ్ములు ఒకేసారి ఆత్మహత్య చేసుకోవడంతో ఏలూరు జిల్లాలో విషాదం నెలకొంది.. జిల్లాలోని ఉంగుటూరు మండలం నారాయణపురం చెందిన అన్నదమ్ములు వారణాసిలో ఆత్మహత్య చేసుకున్నారు.. ఏప్రిల్ నెలలో ఇంటి వెళ్లిపోయారు అన్నదమ్ములు లక్ష్మీనారాయణ (34), వినోద్ (32).. తాజాగా వారణాసిలో ఆత్మహత్య చేసుకున్నారు..
ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలో దుర్గ గుడి వద్ద పెద్ద చెరువుకు గండి పడింది. పెద్ద చెరువు నీటితో 50 ఇళ్లు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పది మంది స్థానికులు ఇళ్లల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. గృహ నిర్మాణ, సమాచారం, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి , ఏలూరు జిల్లా ఎస్పీ సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
ఏలూరు జిల్లా ద్వారకాతిరుమలలో ఘరానా మోసానికి తెరలేపాడు ఓ కేటుగాడు. పోలీసునని చెప్పి డబ్బులు అవసరమని తనకు ఫోన్ పే చేస్తే కానిస్టేబుల్ ద్వారా క్యాష్ పంపిస్తానని వ్యాపారులను నమ్మబలికి బురిడీ కొట్టించాలనుకున్నాడు. అయితే వ్యాపారస్తులు చాకచక్యంగా ప్రవర్తించడంతో కేటుగాడి వలకు చిక్కలేదు.
ఏలూరు జిల్లా లింగపాలెం మండలం పాశ్చా నగరంలో దారుణం జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో మరదలి రెండు నెలల పసికందును హత్య చేశాడు సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ చల్లపాటి బాలాజీ అనే వ్యక్తి.
బెట్టింగ్ తప్పు అని తెలిసినా కొంత మంది అదే రూట్లో వెళ్తున్నారు. పరువు కోసం, ఆధిపత్యం కోసం.. కారణం ఏదైనా సరే పందెం కాసి ఆస్తులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఎన్నో కుటుంబాలకు తీరని శోకాన్ని మిగుల్చుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఏలూరు జిల్లాలోని నూజివీడు మండలం తూర్పుదిగవల్లిలో జరిగింది.