Election Commission: బీజేపీ, కాంగ్రెస్ పార్టీల స్టార్ క్యాంపెయినర్లు అయిన అమిత్ షా, రాహుల్ గాంధీలు చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఎన్నికల సంఘం శనివారం నోటీసులు జారీ చేసింది. ఇద్దరు చేసిన వ్యాఖ్యలు ఎన్నికల కోడ్ని ఉల్లంఘిస్తున్నాయని ఆరోపించింది. బీజేపీ, కాంగ్రెస్ జాతీయాధ్యక్షులు జేపీ నడ్డా, మల్లికార్జున ఖర్గే మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలకు రెండు రోజుల ముందు, సోమవారం లోగా తమ రెస్పాన్స్ తెలియజేయాలని ఆదేశించింది.
Rahul Gandhi: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మరో రెండు రోజుల్లో ముగియబోతోంది. ఇదిలా ఉంటే, ఆ రాష్ట్రంలో ప్రధాన నాయకుల బ్యాగుల్ని ఎన్నికల అధికారులు తనిఖీ చేస్తున్నారు. ప్రచారం నిర్వహించే సమయంలో బీజేపీ, కాంగ్రెస్ ఇతర ప్రధాన పార్టీల కీలక నేతల లగేజీ చెక్ చేస్తున్నారు. తాజాగా శనివారం, మహారాష్ట్రలోని అమరావతికి వచ్చిన కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బ్యాగుల్ని ఎన్నికల సంఘం తనిఖీ చేసింది. ఇండియా కూటమి నేతల్ని మాత్రమే ఈసీ టార్గెట్ చేస్తుందనే…
ఎన్నికల సంఘం అధికారులు కేంద్ర హోం మంత్రి అమిత్షా హెలికాప్టర్ను, బ్యాగును తనిఖీ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను హోంమంత్రి అమిత్ షా హెలికాప్టర్ స్వయంగా సోషల్ మీడియా ప్లాట్ఫాం ఎక్స్లో పంచుకున్నారు. ఎన్నికల ర్యాలీలో ప్రసంగించేందుకు ఆయన ఈరోజు హింగోలి చేరుకున్నారు. అక్కడ ఉన్న ఎన్నికల సంఘం అధికారులు ఆయన హెలికాప్టర్ను తనిఖీ చేశారు. ఈ వీడియో క్యాప్షన్లో ఇలా రాశారు. "ఈ రోజు మహారాష్ట్రలోని హింగోలి అసెంబ్లీలో ఎన్నికల ప్రచారంలో నా హెలికాప్టర్ను ఎన్నికల…
విజయనగరం స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు రద్దు అయ్యాయి.. ఇప్పటికే జారీ చేసిన విజయనగరం స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ను కేంద్ర ఎన్నికల సంఘం రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది..
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో మహిళా రాజకీయ నేతలపై అనుచిత పదజాలం వాడడాన్ని ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ ఖండించారు. అభ్యర్థులు ఎవరైనా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే వారిపై సత్వర, నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ అధికారులను ఆదేశించారు. ఎన్నికల, చట్టాన్ని అమలు చేసే అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన మహిళల గౌరవాన్ని కించ పరిచే భాషపై తీవ్ర అసంతృప్తి, ఆందోళన వ్యక్తం చేశారు. READ MORE: CM Chandrababu: ఏలూరు పోలీసులను…
ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి-పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో ఉపఎన్నికకు రంగం సిద్ధమైంది. కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం మధ్యాహ్నం షెడ్యూల్ విడుదల చేసింది. ఎమ్మెల్సీగా ఉన్న షేక్ సాబ్జీ మృతితో తూర్పుగోదావరి-పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయింది.
ఎన్నికల సంఘం ఉప ఎన్నికలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 13న కేరళ, పంజాబ్, యూపీలో జరగాల్సిన ఉప ఎన్నికలను ఈనె 20వ తేదీకి వాయిదావేసింది. ఇప్పుడు నవంబర్ 20న జరగనున్నాయి. వివిధ పండుగల కారణంగా ఓటింగ్ను వారం రోజులు వాయిదా వేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. నవంబర్ 13న జరగాల్సిన ఓటింగ్ను వాయిదా వేయాలని కాంగ్రెస్, బీజేపీ సహా పలు పార్టీలు ఎన్నికల కమిషన్కు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే.
Srilanka : శ్రీలంకలో నవంబర్ 14న జరగనున్న పార్లమెంట్ ఎన్నికలకు సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎన్నికల ప్రక్రియను సజావుగా, సురక్షితంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సర్వశక్తులు ఒడ్డింది.
Maharashtra: నవంబర్ 20వ తేదీన జరగనున్న మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ఇటీవల ముగిసింది. కాగా 288 అసెంబ్లీ స్థానాల్లో పోటీ పడేందుకు మొత్తం 7,994 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో దిగినట్లుగా ఎన్నికల సంఘం తెలిపింది.