Panchayat Elections : పంచాయితీ ఎన్నికలపై సర్కార్ కసరత్తు..!
- పంచాయితీ ఎన్నికల నిర్వహణపై తెలంగాణ సర్కార్ కసరత్తు
- డెడికేషన్ కమిషన్ నివేదిక వచ్చిన తర్వాతే తుది నిర్ణయం
- ఫిబ్రవరి 2 లోపు ఈ నివేదిక సమర్పించబడుతుందని కమిషన్ హామీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Panchayat Elections : తెలంగాణ ప్రభుత్వం పంచాయితీ ఎన్నికల నిర్వహణపై తర్జనభర్జనలో ఉంది. డెడికేషన్ కమిషన్ నివేదిక వచ్చిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. ఫిబ్రవరి 2 లోపు ఈ నివేదిక సమర్పించబడుతుందని కమిషన్ హామీ ఇచ్చింది. నివేదిక అందిన వెంటనే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ప్రభుత్వం ఫిబ్రవరిలోనే పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలనే యోచనలో ఉన్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే బుధవారం, ఇంటిగ్రేటెడ్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Venkatrami Reddy: గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులను తగ్గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
Also Read
- SUV Safety: ఎస్యూవీలతో పాదచారులకు ముప్పు.. 8 ఏళ్లలో 3,000కు పైగా మరణాలు!
- Hyderabad: షా గౌస్, మెహ్ఫిల్లలో దారుణంగా కిచెన్లు.. ఈగలు, మురికి కూపాలను చూసి షాకైన అధికారులు!
- Venezuela: ప్రాణమిచ్చి పాపను కాపాడిన తల్లి.. వెనిజులా భూకంప శిథిలాల మధ్య గుండెల్ని పిండేసే కథనం!
- Aman Sanger: నాలుగేళ్లలో ఐదున్నర లక్షల కోట్ల సంపాదన.. 25 ఏళ్ల భారతీయ కుర్రాడి సక్సెస్ స్టోరీ..
సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే గురించి చర్చించబడింది. ఇంటింటి సర్వే విజయవంతంగా పూర్తయిందని గుర్తించిన సీఎం, దీని నిర్వహణలో భాగమైన అధికారులను అభినందించారు. అయితే, పంచాయితీ ఎన్నికల నిర్వహణపై ఏదైనా స్పష్టమైన నిర్ణయం వస్తుందని అనుకున్నప్పటికీ, ప్రభుత్వం ఇంకా తర్జనభర్జనలోనే ఉంది. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో బీసీ రిజర్వేషన్ల పెంపు అవకాశాలను పరిశీలించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కానీ, ఈ రిజర్వేషన్లను అమలు చేయాలంటే న్యాయపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అందుకే, పాత విధానాన్ని కొనసాగించాలా లేదా కోర్టుల అనుమతి తీసుకుని రిజర్వేషన్ల శాతం పెంచాలా అనే అంశంపై ప్రభుత్వం చర్చిస్తోంది. న్యాయ నిపుణుల సలహాలను తీసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది.
2024 ఫిబ్రవరి 1 న పంచాయతీల్లో సర్పంచ్ల పదవీకాలం ముగియడంతో ప్రస్తుతం ప్రత్యేక అధికార పాలన కొనసాగుతోంది. ప్రభుత్వం త్వరగా రిజర్వేషన్లపై స్పష్టత తీసుకొస్తే, 15 రోజుల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సిద్ధంగా ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి.
మొత్తం మీద, పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునేందుకు డెడికేషన్ కమిషన్ నివేదిక వేచిచూస్తోంది. రిజర్వేషన్ల వ్యవహారం, న్యాయపరమైన సమస్యలతో ప్రభుత్వం తర్జనభర్జనకు గురవుతోంది. త్వరలోనే దీనిపై క్లారిటీ రావచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Central Cabinet Decisions: నేషనల్ క్రిటికల్ మిషన్కు కేబినెట్ ఆమోదం.. ఎన్ని కోట్లు కేటాయించారంటే..!
తాజావార్తలు
-
SUV Safety: ఎస్యూవీలతో పాదచారులకు ముప్పు.. 8 ఏళ్లలో 3,000కు పైగా మరణాలు!
-
Red Magic Tablet 5 Pro: రెడ్ మ్యాజిక్ టాబ్లెట్ 5 ప్రో వచ్చేస్తోంది.. 8300mAh బ్యాటరీ, 185Hz OLED డిస్ప్లే
-
Animation Universe: టాలీవుడ్లో కొత్త ట్రెండ్.. ‘ఆర్య’ కోసం యానిమేటెడ్ యూనివర్స్ సిద్ధం!
-
Back To Back Releases : మూడు నెలల్లో మూడు సినిమాలు రిలీజ్ చేస్తున్న స్టార్ హీరో
-
Siya Goyal: ప్రియుడి కోసం కాబోయే భర్త హ*త్య.. పూణే కోటలో నిందితులతో క్రైమ్ సీన్ రీక్రియేట్.. కుటుంబ సభ్యుల్లో ఆవేదన
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!