Supreme Court: EVM లోని డేటాని తొలగించొద్దు.. ఈసీకి సుప్రీం కీలక ఆదేశాలు..
- కౌంటింగ్ పూర్తయిన తర్వాత ఈవీఎం డేటాని తొలగించొద్దు..
- ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
Supreme Court: కౌంటింగ్ పూర్తయిన తర్వాత కూడా ఈవీఎం నుంచి డేటాను తొలగించవద్దని కోరూతూ దాఖలైన పిటిషన్పై, పోలింగ్ ముగిసిన తర్వాత ఎలక్ట్రానికి ఓటింగ్ యంత్రాల(EVM) స్టాండర్డ్ ఆపరేటింగ్ విధానం ఏమిటి అని, కేంద్ర ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ప్రస్తుతానికి ఈవీఎంల నుంచి ఎలాంటి డేటా తొలగించవద్దని, ఏ డేటాని రీలోడ్ చేయవద్దని కోరింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం కీలక ఆదేశాలను జారీ చేసింది.
Read Also: YV Subba Reddy: ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించింది..
Also Read
- Barrier Free Tolling: భారత్లో కొత్త రకం టోల్ విధానం.. వాహనాలు ఆపాల్సిన అవసరం లేకుండా...
- Mamata Banerjee: తలకిందులుగా వేలాడదీయడం ఏంటి.? అమిత్ షాపై దీదీ ఆగ్రహం..
- AAP Crisis: ‘‘పంజాబ్ ద్రోహి’’ అంటూ హర్భజన్ సింగ్ ఇంటిపై ఆప్ దాడి...
- LPG Crisis: గ్యాస్ టెన్షన్కు గుడ్బై.. 15 దేశాల నుంచి ఎల్పీజీ దిగుమతి!
ఈవీఎం నుంచి మెమోరీని చెక్ చేయడం, ధ్రువీకరించడాన్ని ప్రామాణిక ఆపరేటింగ్ విధానాల్లో చేర్చాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై 15 రోజుల్లో తన స్పందన దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఎన్నికల సంఘాన్ని కోరింది. ఈ పిటిషన్ని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) దాఖలు చేసింది. చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం ఈ విషయాన్ని విచారించింది.
ఇది వ్యతిరేకత కాదన, ఓడిపోయిన అభ్యర్థి స్పష్టత కోరుకుంటే, ఇంజనీర్ ఎటువంటి ట్యాంపరింగ్ జరగలేదని స్పష్టత ఇవ్వొచ్చు అని ప్రధాన న్యాయమూర్తి అన్నారు. ఈవీఎం ట్యాంపరింగ్ చేయబడలేదని నిరూపించడానికి ఈవీఎంలో కాల్చేసిన మెమోరీని, మైక్రోకంట్రోలర్ని ఇంజనీర్ ధ్రువీకరించాలని కూడా పిటిషన్ డిమాండ్ చేసింది. తదుపరి విచారణ మార్చి 3 నుంచి ప్రారంభమయ్యే వారంలో జరగనుంది.
ఏడీఆర్ తరుపున హాజరైన న్యాయవాది ప్రశాంత్ భూషణ్ విచారణ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎన్నికల సంఘం అవలంబించాల్సిన విధానం వారి ప్రామాణిక ఆపరేటింగ్ ప్రోటోకాల్కి అనుగుణంగా ఉండాలని మేము కోరుతున్నాము. సాఫ్ట్వేర్, హార్డ్వేర్ లో ఏదైనా అవకతవకలు ఉన్నాయో లేదో అని చూడాలనికి ఈవీఎంల సాఫ్ట్వేర్, హార్డ్వేర్లని పరిశీలించాని మేము కోరుతున్నాము’’ అని అన్నారు.
తాజావార్తలు
-
Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!
-
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
-
Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!
-
Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
-
TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!