Bombay High Court: ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం.. బిడ్డను తన తల్లి నుంచి వేరు చేయడం ‘‘క్రూరత్వం’’గా పరిగణించబడుతుందని బాంబే హైకోర్టు పేర్కొంది. జల్నాకు చెందిన మహిళ తన అత్తామామలపై నమోదు చేసిన కేసును కొట్టేసేందుకు నిరాకరించింది. ఔరంగాబాద్లోని న్యాయమూర్తుల విభా కంకన్వాడీ, రోహిత్ జోషిలతో కూడా ధర్మాసనం డిసెంబర్ 11న తన ఉత్తర్వుల్లో.. దిగువ కోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ మహిళకు, తన నాలుగేళ్ల కూతురని దూరంగా ఉంచుతున్నట్లు గమనించింది.
Section 498A: బెంగళూర్ టెక్కీ అతుల్ సుభాష్ ఆత్మహత్య వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. భార్యతో పాటు ఆమె కుటుంబం వేధింపులు భరించలేక సూసైడ్ చేసుకున్నారు. తాను నిర్దోషినని అయినా కూడా న్యాయవ్యవస్థ ఆమెకే అనుకూలంగా ఉందని చెబుతూ 20 పేజీల లేఖ రాయడంతో పాటు 80 నిమిషాల వీడియోలో తాను అనుభవించిన వేధింపులను చెప్పారు. ఈ వీడియో ప్రస్తుతం దేశవ్యాప్తంగా వైరల్ అయింది.
వరకట్నం కోసం వేధించేవారు మాత్రం మారటం లేదు. ప్రతిరోజూ ఎక్కడో ఓ చోట వరకట్న వేధింపులకు ఆడబిడ్డలు బలవుతూనే ఉన్నారు. తాజాగా విశాఖలో వరకట్న వేధింపులకు మరొక వివాహిత బలి అయింది. విశాఖలోని 4వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
Allahabad HC: ఒక వ్యక్తిపై భార్య దాఖలు చేసిన వరకట్న వేధింపుల ఆరోపణల్ని అలహాబాద్ హైకోర్టు తప్పుపబ్టింది. వ్యక్తిగత వివాదాల కారణంగా ఆమె ఆరోపణలు చేసిందని కోర్టు భావించింది. మహిళ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్కి తగిన సాక్ష్యాధారాలు లేకపోవడంతో హైకోర్టు మహిళ ఆరోపణల్ని కొట్టిపారేసింది. వరకట్న వేధింపులతో పాటు తన భర్త అసహజ సెక్స్కి బలవంతంగా చేస్తున్నాడని మహిళ ఆరోపించింది. ఈ ఆరోపణలు అన్నింటి కోర్టు కొట్టివేసింది.
MP Horror: మధ్యప్రదేశ్ ఉమారియా జిల్లాలో దారుణం జరిగింది. వరకట్నం కోసం 7 నెలల గర్భిణిని ఆమె భర్త, అత్తామామలు దారుణంగా చంపేశారు. శుక్రవారం రోజు ఈ ఘటన జరిగింది. నిందితులు బాధితురాలిని కట్నం కోసం గత కొంతకాలంగా వేధిస్తున్నారు. ఆమె భర్తతో పాటు అత్తామామలు, ఇద్దరు ఆడపడచులపై కేసు నమోదు చేశారు.
Dowry harassment: అన్యోన్యంగా సాగాల్సిన సంసారంలో భర్త కట్న పిచాశిగా మారాడు. ఉత్తర్ ప్రదేశ్ లక్నోకి చెందిన 40 ఏళ్ల మహిళను దారుణంగా వేధించాడు. చైనాలో ఉద్యోగం చేసే భర్త, ఆ దేశంలో ఉన్న సమయంలో ఆఫ్రికా వ్యక్తితో లైంగిక సంబంధం పెట్టుకోవాలని, అశ్లీల చిత్రాలను చూడాలని ఒత్తిడి చేసేవాడని ఆమె ఆరోపించింది.
Marriage On Video Call: రాజస్థాన్కి చెందిన ఓ వ్యక్తి, పాకిస్తాన్కి చెందిన మహిళలో ప్రేమలో పడ్డాడు. అంతేకాకుండా వీరిద్దరు వీడియో కాల్లో పెళ్లి కూడా చేసుకున్నారు. దీనిపై సదరు వ్యక్తి మొదటి భార్య కేసు నమోదు చేసింది.
ఓ ప్రబుద్ధుడు తాను ఐఏఎస్ ఆఫీసర్ని అంటూ యువతిని బురిడీ కొట్టించి పెళ్లి చేసుకోవడంతో పాటు.. ఆమె వద్ద నుంచి రూ.2 కోట్లు వసూలు చేశాడు. మళ్లీ అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడితో పాటు అతడి తల్లిదండ్రులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా జీడిమెట్లలోని బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
వరకట్న వేధింపుల చట్టం దుర్వినియోగంపై కర్ణాటక హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. వరకట్న వేధింపుల కేసుల్లో తమ భర్త బంధువులపై ఎలాంటి సాక్ష్యాధారాలు లేకపోయినా చాలాసార్లు మహిళలు ఇరికిస్తున్నారని కోర్టు తన తీర్పులో పేర్కొంది.
వరకట్న వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. హైదరాబాద్లోని గాజులరామారంకి చెందిన అభిలాష్, అమరావతి దంపతులకు 2019లో వివాహం జరిగింది. వివాహ సమయంలో రూ.4 కోట్లు కట్నం ఇచ్చి పెళ్లి చేశారు. అర కేజీ బంగారం, 2 కేజీల వెండి వస్తువులు, రూ. 10 లక్షల నగదు, హయత్ నగర్లో రూ. 3 కోట్ల విలువ చేసే ఫ్లాటు కట్నం కింద ఇచ్చారు.