మరొక వినూత్న పథకానికి శ్రీకారం చుట్టారు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్. ఇటీవల ప్రభుత్వం బస్సులో ప్రయాణించిన ఆయన ప్రయాణికుల సమస్యల గురించి ఆరా తీశారు. ప్రజలు బస్సుల్లో తమకు ఎదురవుతున్న ఇబ్బందులను గురించి సీఎంకు విన్నవించారు. ఇదిలా ఉంటే తాజాగా ప్రభుత్వ బస్సుల్లో సీసీ కెమెరాలతో పాటు ఎమర్జెన్సీ బటన్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మహిళలు, పిల్లల రక్షణకు నిర్భయ స్కీం అమలు చేయనున్నారు. మొదటి దశగా ఐదువందల బస్సుల్లో… తరువాతి దశలో 2500 బస్సుల్లో…
తమిళనాడులో ఎన్నికల వాతావరణం నెలకొంది. పదేళ్ల తర్వాత జరుగుతున్న మున్సిపల్ పోరు జరుగుతోంది. తమిళనాట మున్సిపల్ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. అయితే పోలింగ్ మందకొడిగా సాగుతోంది. మొత్తం 21 కార్పొరేషన్లు, 130 మునిసిపాలిటీలు, 490 నగర పంచాయతీలకు ఒకే దశలో ఇవాళ పోలింగ్ జరుగుతోంది. బరిలో ఏఐఎడీఎంకే, డీఎమ్కే, నటుడు విజయ్ సంబంధించిన మక్కల్ ఇయాక్కం పార్టీలు తలపడుతున్నాయి. సాలిగ్రామం పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. నీలాంగరి పోలింగ్ బూత్…
తమ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్న ఓ వ్యక్తి.. బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు చేశారు.. దాని కోసం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కూడా కలిశారు.. దీంతో.. పార్టీ అతనపై వేటు వేయగా.. సొంత నియోజకవర్గంలో నిరసన సెగలు తగిలాయి.. దీంతో.. కొంత కాలం సైలెంట్గా ఉన్న ఆ నేత.. ఇప్పుడు మళ్లీ సొంత గూటికి చేరారు.. అయితే.. థౌజండ్ లైట్స్ మాజీ ఎమ్మెల్యే సెల్వం.. గతంలో డీఎంకే ఎమ్మెల్యేగా వ్యవహరించిన ఆయన.. 2020 ఆగస్టు 4వ…
తమిళనాడు రాజకీయాల్లో మళ్లీ చక్రం తిప్పేందుకు సిద్ధం అవుతున్నారు దివంగత సీఎం జయలలిత (అమ్మ) ఇష్టసఖి శశికళ (చిన్నమ్మ).. దానికి ముహూర్తం కూడా ఇప్పటికే ఖరారు చేసుకున్నట్టుగా తెలుస్తోంది.. అక్టోబర్ 17వ తేదీన అన్నాడీఎంకే ఆవిర్భావ దినోత్సవం జరగనుంది.. అదే రోజు పొలిటికల్ రీ ఎంట్రీకి శశికళ రంగం సిద్ధం చేసుకున్నట్టు పొలిటికల్ సర్కిల్లో చర్చ సాగుతోంది.. ఆ రోజు మెరీనా బీచ్లోని జయలలిత సమాధిని సందర్శించేందుకు పోలీసు భద్రత కావాలని శశికళ అనుచరులు కోరారట.. దీంతో..…
డీఎంకే పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు ఇవాళ మంత్రి కేటీఆర్ ను కలిశారు. తమిళనాడు సీఎం స్టాలిన్ రాసిన లేఖను ఈ సందర్భంగా కేటీఆర్ కు అందచేశారు డీఎంకే పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు. నీట్ ప్రవేశ పరీక్షను వ్యతిరేకిస్తూ 12 మంది సీఎం లకు లేఖ రాశారు స్టాలిన్. ఆ లేఖనే ఇవాళ మంత్రి కేటీఆర్ కు అందజేశారు. ఈ సందర్భంగా DMK ఎంపీ ఇలన్ గోవన్ మాట్లడుతూ.. నీటి పరీక్ష రద్దు అంశం పై…
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఓ వైపు అప్పుడప్పుడు సైకిల్ నగరంలో ప్రయాణం చేస్తూ సమస్యలు తెలుసుకుంటున్న స్టాలిన్ ఇప్పుడు మరో కొత్త ట్రెండ్కు తెరతీశారు. పోలీస్ స్టేషన్లో పనితీరును తెలుసుకుకేందుకు అర్థరాత్రి సమయంలో అధ్యామాన్కోటై పోలీస్ స్టేషన్కు వెళ్లి తనిఖీలు నిర్వహించారు. సేలం నుంచి ధర్మపురికి వెళ్తుండగా ఆయన మధ్యలో అద్యామాన్కోటై పోలీస్ స్టేషన్కు వెళ్లి అక్కడ స్టేషన్ పనితీరును రికార్డులను పరిశీలించారు. సీఎం ఇలా పోలీస్ స్టేషన్కు వచ్చి తనిఖీలు చేయడంతో…
నిన్నటి రోజున దేశవ్యాప్తంగా నీట్ పరీక్షలు జరిగాయి. దేశంలోని 202 నగరాలు, పట్టణాల్లో ఈ పరీక్షలు జరిగాయి. మొత్తం 16 లక్షల మంది ఈ పరీక్షలకు ధరఖాస్తు చేసుకున్నారు. ఇక ఇదిలా ఉంటే, నీట్ పరీక్షలకు వ్యతిరేకంగా తమిళనాడులో విద్యార్థులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు. కొంత మంది విద్యార్థులు ఇప్పటికే ఆత్మహత్యలకు పాల్పడ్డారు. దీంతో తమిళనాడు ప్రభుత్వం ఈరోజు కీలక నిర్ణయం తీసుకున్నది. నీట్ నుంచి తమిళనాడుకు శాశ్వత మినహాయింపు ఇవ్వాలని కోరుతూ అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టింది.…
తమిళనాడులో చిన్నమ్మగా ప్రసిద్ధి చెందిన దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత నిచ్చెలి శశికళ రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు పావులు కదుపుతున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అన్నా డీఎంకే పార్టీ ఓటమిపాలైంది. ఈ ఎన్నికలకు ముందు తాను రాజకీయాల్లోకి రావడం లేదని, ఎన్నికల్లో పోటీ చేయడం లేదని తెలిపారు. జైలునుంచి రిలీజ్ అయ్యాక అన్నాడీఎంకేలో చక్రం తిప్పేందుకు ప్రయత్నించగా కుదరలేదు. అనుకూల వర్గం కూడా ఆమెకు దూరంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఇటీవలే తమిళనాడు…
కేంద్రం ప్రభుత్వ ఆస్తులను విక్రయించడం లేదా లీజుకు ఇవ్వడం వంటివి చేయడం మంచిది కాదని దీనిపై ప్రధాని మోడికీ లేఖ రాస్తానని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పేర్కొన్నారు. కేంద్రం అనుసరిస్తున్న నేషనల్ మానిటైజేషన్ పైపులైన్ విధానంపై ఆయన ఈరోజు విమర్శలు చేశారు. దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలు ప్రజా ఆస్తులని, అవి దేశ భవిష్యత్తుకు, ఆర్థిక వృద్ధికి, ఉద్యోగాల కల్పన కోసం ఏర్పాటు చేశారని, వాటిని అమ్మడం లేదా లీజుకు ఇవ్వడం వంటిది దేశప్రయోజనాలకు మంచిది కాదని…
ఎక్కడైనా ముఖ్యమంత్రిపై మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రశంసలు కురిపించడం సర్వసాధారణం.. సీఎంను ప్రసన్నం చేసుకోవడానికి ఎక్కడబడితే అక్కడ మన నేతలు మాట్లాడడం చూస్తుంటాం.. ఇక, అసెంబ్లీలో సీఎం ఎదుటే.. పొగడ్తలు ఎన్నోసార్లు లైవ్లో చూసిఉంటారు.. కానీ, తమిళనాడు సీఎం స్టైలే వేరు.. శాసనసభలో మైకు దొరికిందే తడవుగా తనను పొగడ్తలతో ముంచెత్తుతున్న ఎమ్మెల్యేలను సున్నితంగా వార్నింగ్ ఇచ్చారు. శనివారం ఓ ఎమ్మెల్యే తనను పొగుడుతూ ప్రసంగిస్తుండగా మధ్యలో జోక్యం చేసుకున్న ముఖ్యమంత్రి స్టాలిన్.. తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.…