MK Stalin: తమిళనాడు సీఎం మరో సంచలన నిర్ణయం… బస్సుల్లో నిర్భయ స్కీం అమలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మరొక వినూత్న పథకానికి శ్రీకారం చుట్టారు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్. ఇటీవల ప్రభుత్వం బస్సులో ప్రయాణించిన ఆయన ప్రయాణికుల సమస్యల గురించి ఆరా తీశారు. ప్రజలు బస్సుల్లో తమకు ఎదురవుతున్న ఇబ్బందులను గురించి సీఎంకు విన్నవించారు. ఇదిలా ఉంటే తాజాగా ప్రభుత్వ బస్సుల్లో సీసీ కెమెరాలతో పాటు ఎమర్జెన్సీ బటన్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మహిళలు, పిల్లల రక్షణకు నిర్భయ స్కీం అమలు చేయనున్నారు. మొదటి దశగా ఐదువందల బస్సుల్లో… తరువాతి దశలో 2500 బస్సుల్లో ఏర్పాటుకు ఆదేశాలు ఇచ్చారు.
దేశంలో వినూత్న సీఎంగా ఎంకే స్టాలిన్ పేరు తెచ్చుకుంటున్నారు. సామాన్యుడిగా మారి సామాన్యుడి సమస్యలను తెలుసుకుంటున్నారు. తాజాగా ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి పబ్లిక్ బస్సులో ప్రయాణించడం ఇందుకు ఓ ఉదాహరణ. కరుణానిధి వారసుడిగా వచ్చి స్టాలిన్ గత ఎన్నికల్లో డీఎంకే పార్టీని ఒంటిచేత్తో అధికారంలోకి తీసుకువచ్చారు. అధికారంలోకి రావడంతోనే వినూత్న పాలనకు శ్రీకారం చుట్టారు. విద్యార్థులకు ఇచ్చే సంచులపై అంతకుముందు అన్నాడీఎంకే ప్రభుత్వానికి చెందిన గుర్తులు, జయలలిత, పళని స్వామి వంటి నాయకులు ఫోటోలు ఉన్నప్పటికీ… ప్రజాధనం దుర్వినియోగం కావద్దనే మంచి ఉద్దేశంతో ప్రత్యర్థి పార్టీకి సంబంధించి నాయకుల ఫోటోలు ఉన్నా కూడా ఆ బ్యాగులనే పంపిణీ చేసి శభాష్ అనిపించుకున్నారు. ప్రతీకార రాజకీయాలకు తమిళనాడు కేంద్ర బిందువుగా ఉండేది. స్టాలిన్ వచ్చిన తర్వాత వీటన్నింటికి చెక్ పెట్టినట్లే కనిపిస్తోంది.
Also Read
- Renu Dhariyal: అయ్ బాబోయ్ ఎంతపొడుగో.. జుట్టు పెంచుకుంటూ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొట్టేసిన మహిళ..
- PM Modi: భవిష్యత్ భారత్ నిర్మాతలు మీరే.. యువతకు ప్రధాని మోడీ స్ఫూర్తిదాయక సందేశం..
- Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
- HAPIDA SKYNeX Flying Vehicle: ట్రాఫిక్కు చెక్ పెట్టే ‘ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ కార్’.. యువకుడి అద్భుత ఆవిష్కరణ! (వీడియో)
తన కాన్వాయ్ లోని వాహనాల వల్ల ప్రజలకు ఇబ్బందులు ఏర్పడకుండా తగ్గించుకున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జయలలిత ప్రారంభించిన ‘అమ్మ’ క్యాంటిన్ లను అదే పేరుతో కొనసాగిస్తున్నారు. స్టాలిన్ తీసుకున్న మరోసాహసోపేత నిర్ణయం… ప్రభుత్వ పాఠశాలల్లో చదివే వారికి ఉన్నత చదువులు చదివే వారికి రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించారు. ఇది దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. గ్రామాల్లోంచి వచ్చే విద్యార్థులకు, పేద విద్యార్థులు 7.5 రిజర్వేషన్లు కల్పించారు. పొగడ్తలు మానకుంటే చర్యలు తప్పవని సొంత పార్టీ వారికే వార్నింగ్ ఇచ్చారు సీఎం స్టాలిన్.
ప్రోటోకాల్ ను పక్కన పెట్టి దార్లో ఉన్న మహిళ వద్దను నుంచి దరఖాస్తు తీసుకోవడమే కాకుండా ఆ దరఖాస్తుపై సంతకం చేయడంలో ఆయన పాలనాదక్షత కనిపిస్తోంది. మరోసారి ఇలాగే ఓ నిరుద్యోగి నుంచి దరఖాస్తు తీసుకుని ఔరా అనిపించింది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతన్న వేళ ఎమ్మెల్యేలంతా ఇంటి వద్ద నుంచే భోజనం తీసుకువచ్చేలా ఆదేశాలు జారీ చేసి తాను ప్రజల సీఎం అని అనిపంచుకున్నారు. దేశ వ్యాప్తంగా టోమాటో రేట్లు రూ.150 పెరిగిన వేళ తమిళనాడులోని ప్రజలకు టోమాటో అందుబాటు ధరలో లభించేలా ప్రభుత్వం తరుపున దుకాణాలు తెరిపించి కేవలం రూ. 79కే లభించేలా చర్యలు తీసుకున్నారు. చెన్నైలో భారీ వర్షాల కారణంగా వరదలు సంభవిస్తే స్వయంగా పలు కాలనీల్లో కాలినడకన తిరుగుతు ప్రజల కష్టాలను తెలుసుకుని ప్రజల ఆదరణ పొందుతున్నారు సీఎం స్టాలిన్.
తాజావార్తలు
-
Trivikram: త్రివిక్రమ్తో మా బంధం అలాంటిది.. ఎలాంటి అగ్రిమెంట్లు లేవు: నాగవంశీ
-
Avika Gor: 104 డిగ్రీల జ్వరంతోనూ షూటింగ్.. ఆసుపత్రి పాలైన అవికా గోర్..
-
Renu Dhariyal: అయ్ బాబోయ్ ఎంతపొడుగో.. జుట్టు పెంచుకుంటూ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొట్టేసిన మహిళ..
-
Cheyutha Pension: అలర్ట్.. నేటి నుంచి కొత్త పింఛన్ల దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే..
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
ట్రెండింగ్
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!