Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Ahmedabad Plane Crash
  • Story Board
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Rajiv Gandhi Assassination Case

Rajiv Gandhi Assassination Case: రాజీవ్ గాంధీని ఎవరు, ఎందుకు చంపారు.? ఈ కేసు పూర్వాపరాలివే..

NTV Telugu Twitter
Published Date :November 11, 2022 , 7:45 pm
By venugopal reddy
Rajiv Gandhi Assassination Case: రాజీవ్ గాంధీని ఎవరు, ఎందుకు చంపారు.? ఈ కేసు పూర్వాపరాలివే..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Rajiv Gandhi assassination case: దేశ చరిత్రను, దేశ రాజకీయాలు ప్రభావితం చేసిన ఘటనల్లో ముఖ్యమైంది అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ హత్య ఉదంతం. తాజాగా శుక్రవారం ఈ కేసులో దోషులుగా ఉన్న ఆరుగురిని విడుదల చేస్తూ సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. శుక్రవారం రోజు ఆరుగురు దోషులు నళిని, పిఆర్ రవిచంద్రన్, రాబర్ట్ పియాస్, సుతేంద్రరాజా, జయకుమార్, శ్రీహరన్ విడుదలయ్యారు. ఈ ఏడాది మేలో ఈ కేసులో నిందితుడు ఏజీ పెరారివాలన్ ను విడుదల చేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. దీంతో మరోసారి రాజీవ్ గాంధీ హత్యోదంతం తెరపైకి వచ్చింది. ఇప్పటి జనరేషన్ కు పెద్దగా తెలియకున్నా..90ల్లో ఈ హత్య దేశ రాజకీయాలను మార్చింది. అయితే అసలు తమిళ టైగర్స్ రాజీవ్ గాంధీని ఎందుకు చంపాలనుకున్నారనే విషయాలను తెలుసుకుందాం.

Read Also: Uttar Pradesh: కిడ్నీలో రాళ్లు ఉన్నాయని వెళ్తే.. కిడ్నీనే మాయం చేశారు

రాజీవ్ గాంధీ హత్య:

1991 మే 21న తమిళనాడు చెన్నై సమీపంలోని శ్రీపెరంబుదూర్ ఎన్నికల కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన రాజీవ్ గాంధీని శ్రీలంక టైగర్స్ ఆత్మాహుతి దాడిలో హత్య చేశారు. రాజీవ్ గాంధీ పాదాలు తాకేందుకు దగ్గరగా వచ్చిన ఓ మహిళ తనను తాను పేల్చుకుంది. ఈ ఘటనలో రాజీవ్ గాంధీ అక్కడిక్కడే మరణించారు. ఈ దాడిలో మొత్తంగా 14 మంది మరణించగా… 40 మంది గాయపడ్డారు. ఈ కార్యక్రమాన్ని ఫోటోగ్రాఫ్ చేస్తున్న క్రమంలో బాధితుల్లో ఒకరైన హరిబాబు అనే ఫోటోగ్రాఫర్ ఆత్మాహుతి బాంబర్ శ్రీలంక జాఫ్నాకు చెందిన తేన్మోళి రాజరత్నం అలియాస్ ధనుని తన కెమెరాలో బంధించాడు.

శ్రీలంక సైన్యానికి సపోర్టుగా, వేర్పాటువాద సంస్థ లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం(ఎల్టీటీఈ) 1987లో అప్పటి ప్రధాని అయిన రాజీవ్ గాంధీ ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ ని పంపినందుకు, ఈ ఫోర్స్ శ్రీలంక తమిళులపై దారుణాలకు తెగబడిందనే కోపంతో ఎల్టీటీఈ రాజీవ్ గాంధీని హత్య చేసినట్లు చెబుతుంటారు.

Read Also: Bhart Jodo Yatra: భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో పాల్గొన్న ఆదిత్య ఠాక్రే.

విచారణ:

ఈ హత్యకు సంబంధించి దర్యాప్తును మే 22, 1991న సీబీఐకి అప్పగించారు. హత్యకు సంబంధించిన భద్రతాలోపాలను పరిశీలించేందుకు జస్టిస్ జేఎస్ వర్మ కమిషన్ కూడా ఏర్పాటు అయింది. ఈ కేసు విచారణలో టాడా కోర్టు 41 మంది నిందితులపై సిట్ ఛార్జిషీట్ దాఖలు చేసింది. జస్టిస్ మిలాప్ చంద్ జైన్ మధ్యంతర నివేదికి ఈ ఘటనపై పలు సంచలన విషయాలను బయటపెట్టింది. హత్య సమయంలో తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే పార్టీ, ఎల్టీటీఈతో కుమ్మక్కు అయిందని.. హత్య జరగడానికి ముందు చాలా మంది ఎల్టీటీఈ సభ్యులకు ఆశ్రయం ఇచ్చిందని ఆరోపించింది. ఈ హత్య కేసులో పథకాన్ని అమలు చేసిన శివరాసన్, తన ఆరుగురు సహచరులతో కలిసి ఆత్మహత్య చేసుకుని బెంగళూర్ లో మరణించాడు.

Read Also: Himachal Pradesh Elections: మెజారిటీ ఎమ్మెల్యే అభ్యర్థులంతా కోటీశ్వరులే.. ఫస్ట్ ప్లేస్ ఈ పార్టీదే

దవద

26 మందికి మరణశిక్ష:

ఈ హత్యతో సంబంధం ఉన్న 26 మందికి చెన్నైలోని టాడా కోర్టు 1998లో 26 మందికి మరణశిక్ష విధించింది. నిందితులు ఈ తీర్పును సవాల్ చేస్తూ 1999లో సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు. ఆ సమయంలో మురుగన్, సంతన్, పెరైవాలా, నళిని మరణశిక్షలను సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ కేసులో అదే ఏడాది అక్టోబర్ లో 19 మందిని విడుదల చేసింది. 2000లో నళిని శిక్షను తగ్గించాలని డీఎంకే ప్రభుత్వం గవర్నర్ ని కోరింది. అయితే ఆమె క్షమాభిక్ష పిటిషన్ ని రాష్ట్రప్రభుత్వం రాష్ట్రపతికి పంపగా, దానిని తిరస్కరించారు.

2000లో రాజీవ్ గాంధీ భార్య, మాజీ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ నళిని కోసం క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేశారు. ఆమె ఉరిశిక్షను జీవితఖైదుగా మార్చాలని కోరారు. 2014లో సుప్రీంకోర్టు నళిని శిక్షను ఉరిశిక్ష నుంచి యావజ్జీవ శిక్షగా మార్చింది. తాజాగా ప్రస్తుతం జైలులో ఉన్న ఆరుగురిని సుప్రీంకోర్టు విడుదల చేసింది. సుదీర్ఘమైన ఈ కేసు ఎట్టకేలకు ముగిసినట్లు అయింది.

Prabhakaran

ఎల్టీటీఈ క్షమాపణ:

2011లో ఎల్టీటీఈ ట్రెజరర్, కీలక నేత అయిన కుమరన్ పద్మనాథన్ రాజీవ్ గాంధీ హత్యపై క్షమాపణలు కోరారు. ఎల్టీటీఈ చీఫ్ వేలుపిళ్లై ప్రభాకరన్ రాజీవ్ గాంధీని చంపినందుకు భారతదేశాన్ని క్షమించాలని కోరారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • DMK
  • LTTE
  • Rajiv Gandhi assassination case
  • Supreme Court
  • tamil tigers

తాజావార్తలు

  • Gaddar Film Awards 2024 LIVE : గద్దర్‌ అవార్డ్స్‌ ప్రదానోత్సవం లైవ్ అప్డేట్స్

  • UPSC Recruitment 2025: యూపీఎస్సీలో 462 జాబ్స్.. ఈ జాబ్స్ కొడితే మీ లైఫ్ సెట్.. మీరూ ట్రై చేయండి

  • Plane Crash: ప్రమాదం నుంచి బయటపడిన వెంటనే వీడియో కాల్ చేసిన విశ్వాస్.. ఎవరికంటే?

  • Allu Arjun: రప్పా రప్పా నరుకుతా ఒక్కొక్కడినీ.. అల్లు అర్జున్ తగ్గేదేలే!

  • Gaddar Awards : బెస్ట్ యాక్టర్ గా అవార్డు అందుకున్న అల్లు అర్జున్

  • Ahmedabad Air Crash: విమాన ప్రమాదానికి ముందు పైలెట్‌ సుమిత్‌ లాస్ట్‌ మెసేజ్‌ లీక్..

ట్రెండింగ్‌

  • Prepaid and Postpaid Switching: ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ మార్పు ప్రక్రియ మరింత సులభతరం.. DoT కొత్త మార్గదర్శకాలు విడుదల..!

  • Samsung Galaxy A55: ఆఫర్ మిస్ చేసుకోవద్దు భయ్యా.. శాంసంగ్ ప్రీమియం మొబైల్ పై ఏకంగా రూ.11,000 తగ్గింపు..!

  • Lava Storm 5G: కేవలం రూ.7,999కే 6.75 అంగుళాల HD+ డిస్ప్లే, 50MP కెమెరాతో వచ్చేసిన లావా స్టోర్మ్ మొబైల్స్ ..!

  • Vivo T4 Ultra: 50MP డ్యూయల్ కెమెరా, 5500mAh బ్యాటరీలతో వివో ఫ్లాగ్‌షిప్‌ మొబైల్ లాంచ్.. ధర ఎంతంటే..?

  • Motorola edge 60: మిలిటరీ గ్రేడ్ మన్నిక, IP68 + IP69 రేటింగ్‌, 6.67 అంగుళాల డిస్ప్లేతో మోటరోలా ఎడ్జ్ 60 లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions