ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి అంటే కాంతి-వెలుగు అని సీఎం పేర్కొన్నారు.
Diwali Holidays: దీపావళి పండుగకు ఈ నెల 12 ఆదివారం సెలవు ఇస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అయితే 13 సోమవారం దీపావళి సెలవు ఇవ్వాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను కేంద్ర ఎన్నికల సంఘం తోసిపుచ్చింది.
దీపావళి సెలవులో కీలక మార్పు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. క్యాలెండర్లో గానీ, ప్రభుత్వం జారీ చేసిన పండగ సెలవుల జాబితాలో గానీ దీపావళి నవంబర్ 12వ తేదీ అని ఉంది. 12వ తేదీన ఉన్న సెలవును 13వ తేదీన సాధారణ సెలవుగా పేర్కొంటూ ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు విడుదల చేశారు.
రెండు దశాబ్దాల తర్వాత అరుదైన సూర్యగ్రహణం ఇవాళ ఏర్పడనుండగా.. కేతుగ్రస్త సూర్య గ్రహణం కావటం విశేషంగా చెబుతున్నారు.. అంటే సహజంగా రాహుకేతువుల ప్రభావంతో ఏర్పడే గ్రహణాలలో రాహు ప్రభావంతో ఏర్పడే దానిని రాహుగ్రస్తమని, కేతుగణ ప్రభావంతో ఏర్పడే దానిని కేతుగ్రస్తమని అంటారు. అయితే, కేతుగ్రస్త సూ ర్యగ్రహణం చాలా అరుదుగా ఏర్పడుతుంది. దాదాపు 22 సంవత్సరాల తర్వాత ఇటువంటి సూర్యగ్రహణం ఏర్పడుతుంది.. ఈసారి కేతుగ్రస్త సూర్యగ్రహణం స్వాతి నక్షత్రంలో ఏర్పడుతోన్న నేపథ్యంలో.. ఆ నక్షత్రంలో జన్మించిన వారు,…
ఖగోళంలో మరో అద్భుతం ఆవిష్కృతం కాబోతోంది.. 22 ఏళ్ల తర్వాత ఇవాళ అరుదైన దృశ్యం చూసే అవకాశం దక్కింది.. 2022వ సంవత్సరంలో రెండో సారి మరియు చివరి సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఈ సారి దీపావళి వేడుకలు జరుపుకుంటున్న నేపథ్యంలో గ్రహణం ఏర్పడటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సారి పాక్షిక సూర్యగ్రహణం ప్రభావం గంటా 45 నిమిషాల పాటు ఉంటుందని పండితులు చెబుతున్నమాట… ఇవాళ ఏర్పడే సూర్యగ్రహణం ఐరోపా, ఈశాన్య ఆఫ్రికా మరియు పశ్చిమాసియాలోని వివిధ ప్రాంతాల్లో దర్శనమిస్తుంది..…
రాష్ట్రవ్యాప్తంగా దీపావళి పండగను ప్రజలంతా ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రమిదల పండగ దీపావళి కోలాహలం నెలకొంది చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ప్రజలంతా సంతోషంతో పండుగను జరుపుకుంటున్నారు .
అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ అధికారిక నివాసంలో శుక్రవారం దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. కమలా హారిస్ తమ భర్తతో కలిసి వాషింగ్టన్లోని తమ నివాసంలో దీపావళి వేడుకలను జరుపుకున్నారు.
ఇటీవలే దీపావళి వేడుకలు ముగిశాయి. దీపావళి అంటే దీపాలు వెలిగించి టపాసులు కాలుస్తూ సంబరాలు చేసుకుంటారు. దీపావళి వేడుకలను దక్షిణ భారతదేశంలో మూడు రోజులు నిర్వహిస్తే, ఉత్తరాదిన ఐదు రోజులు జరుపుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో దీపావళి వేడుకలు చాలా విచిత్రంగా జరుగుతాయి. కర్ణాటక- తమిళనాడు బోర్డర్లో గమటిపురా అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో దీపావళి వేడుకలను చాలా విచిత్రంగా జరుపుకుంటారు. దీపావళి రోజున అందరిలాగే దీపాలు వెలిగించి టపాసులు కాలుస్తారు. అయితే, దీపావళి ముగింపు వేడుకలను…