Home
Dies
Dies News
-
Indian Labour: పొలంలో పనిచేస్తుండగా తెగిన చేయి.. ఇటలీలో భారతీయ కూలీ మృతి
ఇటలీలో ఓ భారతీయ వ్యవసాయ కూలీ మృతి విషాదంగా మారింది. అక్కడ భారతీయ కార్మికుల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సత్నామ్ సింగ్ (31) అనే వ్యక్తి బుధవారం రోమ్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. గ్రామీణ ప్రాంతమైన ఆగ్రో పాంటినోలోని పొలంలో పనిచేస్తుండగా గాయపడ్డాడు. రెండ్రోజుల పాటు ఆస్పత్రితో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృడుతు పంజాబ్ రాష్ట్రానికి చెందిన మోగా నివాసి. -
Viral video: విహార యాత్రలో విషాదం.. కారు లోయలోపడి యువతి మృతి
స్నేహితుడితో కలిసి ఆ యువతి విహార యాత్రకు వెళ్లింది. టూరిస్టు స్థలాలను మిత్రుడితో కలిసి సందర్శించింది. ఎంతో సంతోషంగా గడిపింది. మనసులో ఏం పుట్టిందో ఏమో.. కారు నడిపే అలవాటు ఉందో లేదో తెలియదు గానీ.. డ్రైవింగ్ సీటులో కూర్చుని వెనక్కి డ్రైవ్ చేస్తోంది. ఇంకోవైపు మిత్రుడు మొబైల్లో రికార్డ్ చేస్తు్న్నాడు. -
UP: సాక్షిగా వచ్చిన వ్యక్తి పోలీస్ స్టేషన్లో మృతి.. ఇద్దరు పోలీసులు సస్పెండ్
యూపీలోని ఎటాలో జరిగిన దాడిలో సాక్షిగా తీసుకొచ్చిన నడివయస్కుడ్ని రాత్రంతా పోలీస్ స్టేషన్లో ఉంచారు. సోమవారం తెల్లవారుజామున ఆరోగ్యం విషమించడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఈ ఘటన పోలీసు శాఖలో కలకలం రేపింది. ఈ క్రమంలో.. కొత్వాలి ఇన్చార్జి నిధౌలీ కలాన్, మున్షీలను ఎస్ఎస్పీ సస్పెండ్ చేశారు. విచారణకు కూడా ఆదేశించారు. ఎండ వేడిమి కారణంగా మృతి చెందినట్లు పోలీసు అధికారులు చెబుతున్నారు. ఈ సంఘటన నిధౌలి కలాన్ పోలీస్ స్టేషన్లోని జరిగింది. -
Hyderabad: మియాపూర్లో దారుణం.. ఆరేళ్ల బాలుడిని పీక్కుతిన్న కుక్కలు
హైదరాబాద్ నగరంలోని మియాపూర్ లో దారుణం చోటు చేసుకుంది. 6 ఏళ్ల బాలుడిని వీధి కుక్కలు పీక్కు తిన్న సంఘటన ఆలస్యం వెలుగులోకి వచ్చింది. -
Rajasthan: పోలీసు కస్టడీలో ఖైదీ మృతి.. 8 మంది పోలీసులపై కేసు నమోదు
రాజస్థాన్లోని జుంజును జిల్లాలో ఓ అత్యాచార నిందితుడు పోలీసుల కస్టడీలో మృతిచెందాడు. ఈ క్రమంలో.. ఎస్హెచ్ఓ సహా ఎనిమిది మంది పోలీసులపై కేసు నమోదు చేసినట్లు అధికారులు సోమవారం తెలిపారు. మే 29న మాండ్రేల పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. దీంతో పోలీసులపై వేటు పడింది. వివరాల్లోకి వెళ్తే.. ఓ అత్యాచారం కేసులో కోట్పుట్లీకి చెందిన గౌరవ్ శర్మ (30) అనే నిందితుడిని జైపూర్లో మే 24న అరెస్టు చేశారు. కాగా.. మరుసటి రోజు… -
Heart Attack: క్రికెట్ బ్యాటింగ్ చేస్తూ గుండెపోటుతో ఓ వ్యక్తి మృతి..
ముంబైలో విషాదం చోటు చేసుకుంది. ఆదివారం క్రికెట్ మ్యాచ్ ఆడుతూ ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. ఆదివారం కశ్మీరా ప్రాంతంలోని ఓ ఫామ్హౌస్లో ఓ కంపెనీ తమ ఉద్యోగులకు క్రికెట్ మ్యాచ్ను నిర్వహించింది. అందులో పాల్గొన్న ఓ వ్యక్తి బంతిని గట్టిగా కొట్టాడు. అనంతరం ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే.. అతన్ని సమీప ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడికి చేరుకునేలోపే అతను చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. మృతుడు రామ్ గణేష్ తేవార్గా గుర్తించారు. -
Netherlands Aircraft: విమాన ఇంజిన్లో ఇరుక్కుని ఒకరు మృతి
ఆమ్స్టర్డామ్ విమానాశ్రయంలో ప్రమాదం జరిగింది. రన్నింగ్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్లోకి ప్రవేశించిన వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. షిపోల్ దగ్గర ఈ సంఘటన జరిగింది. -
Haryana: ఎన్నికల వేళ విషాదం.. గుండెపోటుతో యువ ఎమ్మెల్యే మృతి
సార్వత్రిక ఎన్నికల వేళ హర్యానాలో విషాదం చోటుచేసుకుంది. శనివారం ఆరో విడతలో భాగంగా హర్యానాలో పోలింగ్ జరుగుతోంది. అయితే ఆ రాష్ట్రానికి చెందిన బాద్షాపూర్ ఎమ్మెల్యే రాకేష్ దౌల్తాబాద్ (44) గుండెపోటుతో మరణించారు -
Phone Use: ఫోన్ ఎక్కువగా వాడుతుందని కూతురిని రాడ్తో కొట్టి చంపిన తల్లి
రాజస్థాన్లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఫోన్ ఎక్కువగా వాడుతుందని కూతురిని తల్లి రాడ్తో కొట్టి చంపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే.. 22 ఏళ్ల నికితా సింగ్, బిందాయక ప్రాంతంలో నివాసం ఉంటోంది. అయితే.. ఆమె పోటీ పరీక్షలకు సిద్ధమవుతుంది. అయితే చదువుకోవడం మానేసి నికితా ఎక్కువ సమయం ఫోన్లో గడిపేదని, అందుకే ఆమె ఫోన్ ను రెండున్నర నెలల క్రితం తీసుకున్నట్లు ఆమె తండ్రి తెలిపారు. -
Ebrahim raisi: హెలికాప్టర్ ప్రమాదంలో రైసీ దుర్మరణం.. ఒకరోజు సంతాప దినం ప్రకటించిన భారత్
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (Ebrahim Raisi) ఆదివారం హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందాడు. ఈ ఘటనపై ప్రధాని మోడీతో సహా.. ప్రపంచ దేశాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. ఈ క్రమంలోనే రైసీకి నివాళిగా భారత్లో (రేపు) మే 21న ఒక రోజు సంతాప దినం పాటించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశవ్యాప్తంగా జాతీయజెండాను అవనతం చేయడంతో పాటు అధికారిక వేడుకలకు దూరంగా ఉండాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. 1989లో ఇరాన్ తొలి సుప్రీం…
తాజావార్తలు
-
BJP: ‘‘మనుస్మృతి’’పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు.. ‘‘హిజాబ్’’ వీడియోతో బీజేపీ కౌంటర్..
-
Tollywood Debut: బిగ్ బాస్ బ్యూటీకి బిగ్ ఛాన్స్.. హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ!
-
Earthquake: 7 రోజుల్లో 187 భూకంపాలు.. “రింగ్ ఆఫ్ ఫైర్”లో ఏం జరుగుతోంది?
-
Modi Cabinet: కేంద్ర మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధం.. కొత్త ముఖాలకు చోటు!
-
Telangana Congress : కాంగ్రెస్లో బిగ్ షాక్.. కొండా సురేఖ, చిన్నారెడ్డికి ఎసరు.?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!