సార్వత్రిక ఎన్నికల వేళ హర్యానాలో విషాదం చోటుచేసుకుంది. శనివారం ఆరో విడతలో భాగంగా హర్యానాలో పోలింగ్ జరుగుతోంది. అయితే ఆ రాష్ట్రానికి చెందిన బాద్షాపూర్ ఎమ్మెల్యే రాకేష్ దౌల్తాబాద్ (44) గుండెపోటుతో మరణించారు. రాకేష్ దౌల్తాబాద్ శనివారం ఉదయం గురుగ్రామ్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో గుండెపోటుతో మరణించారు. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బాద్షాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు. అనంతరం ఆయన బీజేపీకి మద్దతు తెలిపారు. నయాబ్ సైనీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి ఆయన మద్దతు ఇచ్చారు.
ఇది కూాడా చదవండి: R.S. Praveen Kumar: రాష్ట్రంలో శాంతిభద్రతలు రోజు రోజుకు అడుగంటి పోతున్నాయి..
రాకేష్కి భార్య, 21, 17 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు కుమారులు ఉన్నారు. రాకేష్ మృతి పట్ల హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. తొలిసారి ఎమ్మెల్యే అయిన దౌల్తాబాద్ శాసనసభలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి మద్దతు పలికారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మనీష్ యాదవ్పై 10,157 ఓట్ల తేడాతో విజయం సాధించారు. రాష్ట్ర అసెంబ్లీలో 87 మంది సభ్యులు ఉన్నారు. రాకేష్ మృతితో బీజేపీ మెజారిటీని ప్రభావితం చేయనుంది.
ఇది కూాడా చదవండి: Tollywood: సెట్స్ మీదకెళ్ళి మూడేళ్లు.. ఇంకెప్పుడు ఈ సినిమాలకు మోక్షం?