UP: సాక్షిగా వచ్చిన వ్యక్తి పోలీస్ స్టేషన్లో మృతి.. ఇద్దరు పోలీసులు సస్పెండ్
- సాక్షిగా వచ్చిన వ్యక్తి పోలీస్ స్టేషన్లో మృతి
- ఇద్దరు పోలీసులు సస్పెండ్
- యూపీలోని ఎటాలో ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూపీలోని ఎటాలో జరిగిన దాడిలో సాక్షిగా తీసుకొచ్చిన నడివయస్కుడ్ని రాత్రంతా పోలీస్ స్టేషన్లో ఉంచారు. సోమవారం తెల్లవారుజామున ఆరోగ్యం విషమించడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఈ ఘటన పోలీసు శాఖలో కలకలం రేపింది. ఈ క్రమంలో.. కొత్వాలి ఇన్చార్జి నిధౌలీ కలాన్, మున్షీలను ఎస్ఎస్పీ సస్పెండ్ చేశారు. విచారణకు కూడా ఆదేశించారు. ఎండ వేడిమి కారణంగా మృతి చెందినట్లు పోలీసు అధికారులు చెబుతున్నారు. ఈ సంఘటన నిధౌలి కలాన్ పోలీస్ స్టేషన్లోని జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. దేవేంద్ర అనే వ్యక్తి రెండు నెలల క్రితం హుస్సేన్ మహమ్మద్ వివామ వేడుకలో బ్యాండ్ వాయించాడు. అందుకుగాను రూ. 5 వేలు ఇవ్వాల్సి ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ డబ్బులు ఇవ్వకపోవడంతో షాపులో కూర్చున్న ఇద్దరు వ్యక్తులు గొడవపడ్డారు. ఒకరికొకరు తీవ్రంగా కొట్టుకున్నారు. అయితే.. అదే షాపులో పనిచేస్తున్న రాకేశ్ అనే 52 ఏళ్ల వ్యక్తి వారిద్దరినీ విడదశీడు. ఆ తర్వాత.. గొడవపై దేవేంద్ర పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని, ముగ్గురిని ఆదివారం రాత్రి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. రాత్రంతా ఆ ముగ్గురు పోలీస్ స్టేషన్ లోనే ఉన్నారు.
Also Read
- Hyderabad: భాగ్యనగరంలో ఘనంగా ఆషాఢ బోనాలు ప్రారంభం.. గోల్కొండలో సందడి షురూ..
- Rohit Sharma Retirement: నేటి మ్యాచ్కు రోహిత్ పేరెంట్స్.. హిట్మ్యాన్ రిటైర్మెంట్పై క్లారిటీ ఇదిగో..
- Hyderabad: రైతుల దీక్షా శిబిరం తొలగించిన హైడ్రా.. బహదూర్గూడాలో హైటెన్షన్
- Covid 19-AP: ఏపీలో అప్రమత్తం.. ప్రత్యేక కొవిడ్ వార్డు ఏర్పాటు!
Pankaja Munde: ఎక్కి ఎక్కి ఏడ్చిన పంకజా ముండే
అయితే.. ఉదయం తొమ్మిది గంటల సమయంలో పోలీస్ స్టేషన్లో కూర్చొని ఉండగా రాకేష్ కుప్పకూలిపోయాడని దేవేంద్ర తెలిపాడు. దీంతో పోలీసులు హుటాహుటిన సమీప ఆస్పత్రికి తరలించారు. వైద్యులు మెరుగైన చికిత్స నిమిత్తం నిధౌలి కలాన్ నుండి వైద్య కళాశాలకు పంపారు. అక్కడి చేరుకున్న తర్వాత.. చనిపోయినట్లు ప్రకటించారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న ఎస్ఎస్పీ రాజేష్ కుమార్ సింగ్, ఎస్హెచ్ఓ జేపీ అశోక్ను సస్పెండ్ చేశారు.
ఈ కేసులో.. దాడికి సంబంధించి ముగ్గురిని పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చినట్లు ఎస్ఎస్పి రాజేష్ కుమార్ సింగ్ తెలిపారు. ఇందులో సాక్షిగా రాకేష్ ను తీసుకొచ్చారు. ఈ మొత్తం వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఎస్హెచ్ఓ నిధౌలీ కలాన్, మున్షీని సస్పెండ్ చేశారు. రాత్రి పూట ఆహారం ఇవ్వకపోవడం, తెల్లవారుజామున ఎండవేడిమికి ఒక్కసారిగా పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు వెలుగులోకి వచ్చింది.
తాజావార్తలు
-
Upcoming IPO 2026: వచ్చే వారం 7 ఐపీఓలు ప్రారంభం.. ఏ కంపెనీ IPOలో పెట్టుబడి అవకాశాలు ఎక్కువ?
-
Siddhanth Kapoor: శ్రద్ధా కపూర్ సోదరుడికి ఊరట.. డ్రగ్స్ కేసులో FIR కొట్టేసిన హైకోర్టు!
-
Hyderabad: భాగ్యనగరంలో ఘనంగా ఆషాఢ బోనాలు ప్రారంభం.. గోల్కొండలో సందడి షురూ..
-
Rohit Sharma Retirement: నేటి మ్యాచ్కు రోహిత్ పేరెంట్స్.. హిట్మ్యాన్ రిటైర్మెంట్పై క్లారిటీ ఇదిగో..
-
Hyderabad: రైతుల దీక్షా శిబిరం తొలగించిన హైడ్రా.. బహదూర్గూడాలో హైటెన్షన్
ట్రెండింగ్
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!