UP: సాక్షిగా వచ్చిన వ్యక్తి పోలీస్ స్టేషన్లో మృతి.. ఇద్దరు పోలీసులు సస్పెండ్
- సాక్షిగా వచ్చిన వ్యక్తి పోలీస్ స్టేషన్లో మృతి
- ఇద్దరు పోలీసులు సస్పెండ్
- యూపీలోని ఎటాలో ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూపీలోని ఎటాలో జరిగిన దాడిలో సాక్షిగా తీసుకొచ్చిన నడివయస్కుడ్ని రాత్రంతా పోలీస్ స్టేషన్లో ఉంచారు. సోమవారం తెల్లవారుజామున ఆరోగ్యం విషమించడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఈ ఘటన పోలీసు శాఖలో కలకలం రేపింది. ఈ క్రమంలో.. కొత్వాలి ఇన్చార్జి నిధౌలీ కలాన్, మున్షీలను ఎస్ఎస్పీ సస్పెండ్ చేశారు. విచారణకు కూడా ఆదేశించారు. ఎండ వేడిమి కారణంగా మృతి చెందినట్లు పోలీసు అధికారులు చెబుతున్నారు. ఈ సంఘటన నిధౌలి కలాన్ పోలీస్ స్టేషన్లోని జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. దేవేంద్ర అనే వ్యక్తి రెండు నెలల క్రితం హుస్సేన్ మహమ్మద్ వివామ వేడుకలో బ్యాండ్ వాయించాడు. అందుకుగాను రూ. 5 వేలు ఇవ్వాల్సి ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ డబ్బులు ఇవ్వకపోవడంతో షాపులో కూర్చున్న ఇద్దరు వ్యక్తులు గొడవపడ్డారు. ఒకరికొకరు తీవ్రంగా కొట్టుకున్నారు. అయితే.. అదే షాపులో పనిచేస్తున్న రాకేశ్ అనే 52 ఏళ్ల వ్యక్తి వారిద్దరినీ విడదశీడు. ఆ తర్వాత.. గొడవపై దేవేంద్ర పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని, ముగ్గురిని ఆదివారం రాత్రి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. రాత్రంతా ఆ ముగ్గురు పోలీస్ స్టేషన్ లోనే ఉన్నారు.
Also Read
- 10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
- AP Weather Alert: ఆంధ్రప్రదేశ్లో వర్షాలపై అలర్ట్.. పలు జిల్లాలకు పిడుగుల హెచ్చరిక
- Tuesday Astrology: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభాలే!
- IND vs AFG: సంజూ ఔట్.. వైభవ్ ఇన్.? నేడే రెండో టీ20 మ్యాచ్..! టీమిండియా ప్లేయింగ్ XI ఇలా..
Pankaja Munde: ఎక్కి ఎక్కి ఏడ్చిన పంకజా ముండే
అయితే.. ఉదయం తొమ్మిది గంటల సమయంలో పోలీస్ స్టేషన్లో కూర్చొని ఉండగా రాకేష్ కుప్పకూలిపోయాడని దేవేంద్ర తెలిపాడు. దీంతో పోలీసులు హుటాహుటిన సమీప ఆస్పత్రికి తరలించారు. వైద్యులు మెరుగైన చికిత్స నిమిత్తం నిధౌలి కలాన్ నుండి వైద్య కళాశాలకు పంపారు. అక్కడి చేరుకున్న తర్వాత.. చనిపోయినట్లు ప్రకటించారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న ఎస్ఎస్పీ రాజేష్ కుమార్ సింగ్, ఎస్హెచ్ఓ జేపీ అశోక్ను సస్పెండ్ చేశారు.
ఈ కేసులో.. దాడికి సంబంధించి ముగ్గురిని పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చినట్లు ఎస్ఎస్పి రాజేష్ కుమార్ సింగ్ తెలిపారు. ఇందులో సాక్షిగా రాకేష్ ను తీసుకొచ్చారు. ఈ మొత్తం వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఎస్హెచ్ఓ నిధౌలీ కలాన్, మున్షీని సస్పెండ్ చేశారు. రాత్రి పూట ఆహారం ఇవ్వకపోవడం, తెల్లవారుజామున ఎండవేడిమికి ఒక్కసారిగా పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు వెలుగులోకి వచ్చింది.
తాజావార్తలు
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
UPI Charges: రూ.2,000 వరకు యూపీఐ లావాదేవీలపై.. ఛార్జీల విషయంలో ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ
-
AP Weather Alert: ఆంధ్రప్రదేశ్లో వర్షాలపై అలర్ట్.. పలు జిల్లాలకు పిడుగుల హెచ్చరిక
-
Kangana vs Rakhi Sawant: రాఖీ సావంత్పై కంగనా రనౌత్ ఫైర్.. కనీసం స్వీపర్ ఉద్యోగం కూడా దక్కలేదంటూ షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!