Earthquake: ఆఫ్ఘనిస్తాన్లో భూకంపం.. తీవ్రత 5.7గా నమోదు, భారత్లోనూ ప్రకంపనలు
- ఆఫ్ఘనిస్తాన్ లో భూకంపం
- ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు
- భూకంపం కారణంగా పాకిస్తాన్.. ఉత్తర భారతదేశంలోని చాలా ప్రాంతాలలో ప్రకంపనలు
- ఉదయం 11:26 గంటలకు భూకంపం
- రిక్టర్ స్కేల్పై 5.7 గా నమోదు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. ఆఫ్ఘనిస్తాన్ లో భూకంపం కారణంగా.. పాకిస్తాన్, ఉత్తర భారతదేశంలోని చాలా ప్రాంతాలలో ప్రకంపనలు సంభవించాయి. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం.. ఈ భూకంపం ఉదయం 11:26 గంటలకు సంభవించింది. దాని తీవ్రత రిక్టర్ స్కేల్పై 5.7 గా నమోదైంది. ఈ భూకంప కేంద్రం ఆఫ్ఘనిస్థాన్లో కాకుండా.. భారత కొంచెం దగ్గరగా ఉంటే, భారీ నష్టం జరిగే అవకాశం ఉండేది.
Read Also: MLC Kavitha: తండ్రి కాళ్లు మొక్కి ఆశీర్వాదం.. కవితను చూసి కేసీఆర్ భావోద్వేగం..
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
నేషనల్ సెంటర్ ఆఫ్ సిస్మోలజీ ప్రకారం.. ఈ భూకంపం యొక్క కేంద్రం భూమికి 255 కిలోమీటర్ల దిగువన ఉంది. భూకంప కేంద్రం ఆఫ్ఘనిస్తాన్లోని అష్కాషామ్కు 28 కిలోమీటర్ల దూరంలో ఉందని చెప్పారు. ఆ కారణంగా.. ఢిల్లీ-ఎన్సీఆర్లో కూడా తేలికపాటి ప్రకంపనలు వచ్చాయి. అయితే.. భారతదేశంలో తీవ్రత చాలా తక్కువగా ఉన్నందున కొంతమందికి భూకంపం గురించి తెలియదు. ఆఫ్ఘనిస్థాన్కు ఆనుకుని ఉన్న పాకిస్థాన్లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతంలో భూకంప తీవ్రత ఎక్కువగా కనిపించింది. అయితే భూకంపం కారణంగా.. ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు ఎలాంటి సమాచారం లేదు.
Read Also: రచయిత సాయి మాధవ్ బుర్రా సంచలనం.. తెలుగువారికి మినహాయించి వారందరికి పాదాభివందనం
భూకంప తీవ్రత ఎక్కువగా ఉందని.. అయితే ఉపరితలంపై అంతగా ప్రభావం చూపలేదని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. భూకంప కేంద్రం భూమికి 255 కిలోమీటర్ల దిగువన ఉండటమే ఇందుకు కారణం అని పేర్కొంది. సాధారణంగా రిక్టర్ స్కేలుపై 5.7 తీవ్రతతో వచ్చిన భూకంపం గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. అయితే ఈసారి ఎక్కువ లోతు కారణంగా ఎటువంటి నష్టం జరగలేదు. అలాగే.. భారతదేశంలో ఢిల్లీ-ఎన్సిఆర్లో చాలా చిన్న ప్రకంపనలు వచ్చాయి. జమ్మూకశ్మీర్లో తీవ్రత కాస్త ఎక్కువగా ఉంది. భూకంప కేంద్రం కాబూల్కు ఈశాన్యంగా 277 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ క్రమంలో.. పాకిస్తాన్, భారతదేశానికి భూకంపం ప్రభావం చాలా తక్కువగా ఉంది.
EQ of M: 5.7, On: 29/08/2024 11:26:38 IST, Lat: 36.51 N, Long: 71.12 E, Depth: 255 Km, Location: Afghanistan.
For more information Download the BhooKamp App https://t.co/5gCOtjdtw0 @DrJitendraSingh @OfficeOfDrJS @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia pic.twitter.com/6PsXboMuXc— National Center for Seismology (@NCS_Earthquake) August 29, 2024
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!