Earthquake: ఆఫ్ఘనిస్తాన్లో భూకంపం.. తీవ్రత 5.7గా నమోదు, భారత్లోనూ ప్రకంపనలు
- ఆఫ్ఘనిస్తాన్ లో భూకంపం
- ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు
- భూకంపం కారణంగా పాకిస్తాన్.. ఉత్తర భారతదేశంలోని చాలా ప్రాంతాలలో ప్రకంపనలు
- ఉదయం 11:26 గంటలకు భూకంపం
- రిక్టర్ స్కేల్పై 5.7 గా నమోదు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. ఆఫ్ఘనిస్తాన్ లో భూకంపం కారణంగా.. పాకిస్తాన్, ఉత్తర భారతదేశంలోని చాలా ప్రాంతాలలో ప్రకంపనలు సంభవించాయి. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం.. ఈ భూకంపం ఉదయం 11:26 గంటలకు సంభవించింది. దాని తీవ్రత రిక్టర్ స్కేల్పై 5.7 గా నమోదైంది. ఈ భూకంప కేంద్రం ఆఫ్ఘనిస్థాన్లో కాకుండా.. భారత కొంచెం దగ్గరగా ఉంటే, భారీ నష్టం జరిగే అవకాశం ఉండేది.
Read Also: MLC Kavitha: తండ్రి కాళ్లు మొక్కి ఆశీర్వాదం.. కవితను చూసి కేసీఆర్ భావోద్వేగం..
Also Read
- Sangareddy: భార్య సంపాదన పుట్టింటికి ఇస్తోందని కసి.. సుపారీ ఇచ్చి హత్య చేయించిన భర్త!
- Cockroach Janta Party: మోడీ సర్కార్కు బొద్దింకల అల్టిమేటం..
- Trump-Iran: పశ్చిమాసియా రౌడీ చనిపోయాడు.. ఇరాన్పై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు
- Sunil Gavaskar: విమర్శించే వారే మళ్లీ బీసీసీఐ దగ్గరకు వస్తారు.. అంతా డబ్బు మహిమ: సునీల్ గావస్కర్
నేషనల్ సెంటర్ ఆఫ్ సిస్మోలజీ ప్రకారం.. ఈ భూకంపం యొక్క కేంద్రం భూమికి 255 కిలోమీటర్ల దిగువన ఉంది. భూకంప కేంద్రం ఆఫ్ఘనిస్తాన్లోని అష్కాషామ్కు 28 కిలోమీటర్ల దూరంలో ఉందని చెప్పారు. ఆ కారణంగా.. ఢిల్లీ-ఎన్సీఆర్లో కూడా తేలికపాటి ప్రకంపనలు వచ్చాయి. అయితే.. భారతదేశంలో తీవ్రత చాలా తక్కువగా ఉన్నందున కొంతమందికి భూకంపం గురించి తెలియదు. ఆఫ్ఘనిస్థాన్కు ఆనుకుని ఉన్న పాకిస్థాన్లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతంలో భూకంప తీవ్రత ఎక్కువగా కనిపించింది. అయితే భూకంపం కారణంగా.. ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు ఎలాంటి సమాచారం లేదు.
Read Also: రచయిత సాయి మాధవ్ బుర్రా సంచలనం.. తెలుగువారికి మినహాయించి వారందరికి పాదాభివందనం
భూకంప తీవ్రత ఎక్కువగా ఉందని.. అయితే ఉపరితలంపై అంతగా ప్రభావం చూపలేదని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. భూకంప కేంద్రం భూమికి 255 కిలోమీటర్ల దిగువన ఉండటమే ఇందుకు కారణం అని పేర్కొంది. సాధారణంగా రిక్టర్ స్కేలుపై 5.7 తీవ్రతతో వచ్చిన భూకంపం గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. అయితే ఈసారి ఎక్కువ లోతు కారణంగా ఎటువంటి నష్టం జరగలేదు. అలాగే.. భారతదేశంలో ఢిల్లీ-ఎన్సిఆర్లో చాలా చిన్న ప్రకంపనలు వచ్చాయి. జమ్మూకశ్మీర్లో తీవ్రత కాస్త ఎక్కువగా ఉంది. భూకంప కేంద్రం కాబూల్కు ఈశాన్యంగా 277 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ క్రమంలో.. పాకిస్తాన్, భారతదేశానికి భూకంపం ప్రభావం చాలా తక్కువగా ఉంది.
EQ of M: 5.7, On: 29/08/2024 11:26:38 IST, Lat: 36.51 N, Long: 71.12 E, Depth: 255 Km, Location: Afghanistan.
For more information Download the BhooKamp App https://t.co/5gCOtjdtw0 @DrJitendraSingh @OfficeOfDrJS @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia pic.twitter.com/6PsXboMuXc— National Center for Seismology (@NCS_Earthquake) August 29, 2024
తాజావార్తలు
-
Kitchen Hacks: వంటింట్లో ఇల్లాళ్లకు బ్రహ్మాస్త్రం.. ఈ చిట్కాలతో గంటల పని నిమిషాల్లో ముగుస్తాయి!
-
Peddi: హోంశాఖకు షాక్: ‘పెద్ది’ టికెట్ల పెంపుపై కోర్టు ధిక్కరణ నోటీసులు!
-
Sangareddy: భార్య సంపాదన పుట్టింటికి ఇస్తోందని కసి.. సుపారీ ఇచ్చి హత్య చేయించిన భర్త!
-
NBK 111 : బాలయ్య ఆన్ ట్రాక్.. ఇక థియేటర్లలో పూనకాలే!
-
Cockroach Janta Party: మోడీ సర్కార్కు బొద్దింకల అల్టిమేటం..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!