Kavitha: తీహార్ జైలు నుంచి ఎమ్మెల్సీ కవిత విడుదల..
- తీహార్ జైలు నుంచి ఎమ్మెల్సీ కవిత విడుదల
- 18 ఏళ్లు నేను రాజకీయాల్లో ఉన్నాను- కవిత
- ఈ ఐదు నెలలు కుటుంబానికి దూరంగా ఉన్నాను- కవిత
- నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్లకు వడ్డీతో సహా చెల్లిస్తాను- కవిత
- కేసీఆర్ బిడ్డను.. మొండిదాన్ని.. తప్పుచేయకున్నా జైలుకు పంపారు..
- అనవసరంగా నన్ను జగమొండిగా మార్చారు- ఎమ్మెల్సీ కవిత.
తీహార్ జైలు నుంచి ఎమ్మెల్సీ కవిత విడుదల అయింది. సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి బయటకొచ్చారు. లిక్కర్ కేసులో కవితకు ట్రయల్ కోర్టు రిలీజ్ వారెంట్ ఇచ్చింది. కవిత భర్త అనిల్ కుమార్, బీఆర్ఎస్ ఎంపీ రవిచంద్ర రూ. 10 లక్షల ష్యూరిటీ బాండ్లను సమర్పించారు. కాగా.. కవిత విడుదలకు కొన్ని గంటల పాటు ప్రాసెస్ జరిగింది. మరోవైపు.. సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో కేటీఆర్, హరీష్ రావు సహా పలువురు ఎమ్మెల్యేలు ఉదయం నుంచి కవిత కోసం వేచి చూశారు. కాగా.. కవిత జైలు నుంచి విడుదల కాగానే, ఆమెకు ఘన స్వాగతం పలికారు.
Read Also: AV Ranganath: కుత్బుల్లాపూర్ జీహెచ్ఎంసీ పరిధిలో హైడ్రా కమిషనర్ సుడిగాలి పర్యటన..
Also Read
- వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు
- KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!
- Petrol Shortage: పెట్రోల్ బంకుల్లో నిబంధనలు.. ద్విచక్ర వాహనానికి రూ.200, కారుకు రూ.1000 మాత్రమే..
- CM Revanth Reddy : BRS ఒక చచ్చిపోయిన శవం.. దానికి భవిష్యత్తు లేదు
కవిత జైలులో నుంచి బయటకు రాగానే.. మొదటగా కొడుకు దగ్గరికి వెళ్లి ఆలింగనం చేసుకుని భావోద్వేగానికి గురైంది. తనను జైలులో వేసి ఐదున్నర నెలలు పిల్లలకు దూరం చేశారంటూ ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. అనంతరం.. అందరికీ అభివాదం చేసింది. ఈ సందర్భంగా.. కవిత మీడియాతో మాట్లాడింది. 18 ఏళ్లు తాను రాజకీయాల్లో ఉన్నానని.. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కున్నానని తెలిపింది. ఈ ఐదు నెలలు కుటుంబానికి దూరంగా ఉన్నానని.. తనను ఇబ్బంది పెట్టిన వాళ్లకు వడ్డీతో సహా చెల్లిస్తానని చెప్పింది. కేసీఆర్ బిడ్డను, మొండిదాన్ని, తప్పుచేయకున్నా జైలుకు పంపారు.. అనవసరంగా తనను జగమొండిగా మార్చారని ఎమ్మెల్సీ కవిత తెలిపింది.
Read Also: Hyderabad: రేపు సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపనకు భూమి పూజ..
కాగా.. జైలు నుంచి విడుదలైన కవిత.. ఈ రాత్రికి ఢిల్లీలోనే ఉండనున్నారు. ఆమెతో పాటు కేటీఆర్, హరీష్ రావు, పలువురు నేతలు అక్కడే బస చేయనున్నారు. తీహార్ జైలు నుంచి నేరుగా ఢిల్లీలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి వెళ్లారు. రేపు సీబీఐ ఛార్జీషీట్ పై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరుగనుంది. ఆ విచారణకు కవిత ఆన్ లైన్లో హాజరుకానున్నారు. అనంతరం.. హైదరాబాద్ కు రానున్నారు.
తాజావార్తలు
-
Sun Pharma: అమెరికా గడ్డపై భారత ఫార్మా జెండా.. లక్ష కోట్లతో దిగ్గజ కంపెనీని కొనుగోలు చేసిన సన్ ఫార్మా!
-
వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు
-
Fire Accident : అంబర్పేటలో భారీ అగ్నిప్రమాదం.. తగలబడిన షోరూం గోదాం..
-
KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!
-
Iranian Attack Indian Crew: ఒమన్ తీరంలో టెన్షన్ టెన్షన్.. భారతీయ సిబ్బంది ఉన్న కెమికల్ ట్యాంకర్పై ఇరాన్ దాడులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!