Kavitha: తీహార్ జైలు నుంచి ఎమ్మెల్సీ కవిత విడుదల..
- తీహార్ జైలు నుంచి ఎమ్మెల్సీ కవిత విడుదల
- 18 ఏళ్లు నేను రాజకీయాల్లో ఉన్నాను- కవిత
- ఈ ఐదు నెలలు కుటుంబానికి దూరంగా ఉన్నాను- కవిత
- నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్లకు వడ్డీతో సహా చెల్లిస్తాను- కవిత
- కేసీఆర్ బిడ్డను.. మొండిదాన్ని.. తప్పుచేయకున్నా జైలుకు పంపారు..
- అనవసరంగా నన్ను జగమొండిగా మార్చారు- ఎమ్మెల్సీ కవిత.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తీహార్ జైలు నుంచి ఎమ్మెల్సీ కవిత విడుదల అయింది. సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి బయటకొచ్చారు. లిక్కర్ కేసులో కవితకు ట్రయల్ కోర్టు రిలీజ్ వారెంట్ ఇచ్చింది. కవిత భర్త అనిల్ కుమార్, బీఆర్ఎస్ ఎంపీ రవిచంద్ర రూ. 10 లక్షల ష్యూరిటీ బాండ్లను సమర్పించారు. కాగా.. కవిత విడుదలకు కొన్ని గంటల పాటు ప్రాసెస్ జరిగింది. మరోవైపు.. సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో కేటీఆర్, హరీష్ రావు సహా పలువురు ఎమ్మెల్యేలు ఉదయం నుంచి కవిత కోసం వేచి చూశారు. కాగా.. కవిత జైలు నుంచి విడుదల కాగానే, ఆమెకు ఘన స్వాగతం పలికారు.
Read Also: AV Ranganath: కుత్బుల్లాపూర్ జీహెచ్ఎంసీ పరిధిలో హైడ్రా కమిషనర్ సుడిగాలి పర్యటన..
Also Read
- Gudivada Amarnath: మహిళా కమిషన్ ఎదుట నేడు విచారణకు మాజీ మంత్రి.. 'నా వ్యాఖ్యల్లో తప్పు లేదు'..!
- Pakistan Minister: "చేతులు నరికేస్తాం".. సింధు జలాల విషయంలో భారత్కు పాక్ మంత్రి వార్నింగ్!
- Astrology: జూన్ 30 సోమవారం దినఫలాలు.. ఏ రాశివారు ఏ పరిహారం చెల్లించాలంటే..?
- OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
కవిత జైలులో నుంచి బయటకు రాగానే.. మొదటగా కొడుకు దగ్గరికి వెళ్లి ఆలింగనం చేసుకుని భావోద్వేగానికి గురైంది. తనను జైలులో వేసి ఐదున్నర నెలలు పిల్లలకు దూరం చేశారంటూ ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. అనంతరం.. అందరికీ అభివాదం చేసింది. ఈ సందర్భంగా.. కవిత మీడియాతో మాట్లాడింది. 18 ఏళ్లు తాను రాజకీయాల్లో ఉన్నానని.. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కున్నానని తెలిపింది. ఈ ఐదు నెలలు కుటుంబానికి దూరంగా ఉన్నానని.. తనను ఇబ్బంది పెట్టిన వాళ్లకు వడ్డీతో సహా చెల్లిస్తానని చెప్పింది. కేసీఆర్ బిడ్డను, మొండిదాన్ని, తప్పుచేయకున్నా జైలుకు పంపారు.. అనవసరంగా తనను జగమొండిగా మార్చారని ఎమ్మెల్సీ కవిత తెలిపింది.
Read Also: Hyderabad: రేపు సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపనకు భూమి పూజ..
కాగా.. జైలు నుంచి విడుదలైన కవిత.. ఈ రాత్రికి ఢిల్లీలోనే ఉండనున్నారు. ఆమెతో పాటు కేటీఆర్, హరీష్ రావు, పలువురు నేతలు అక్కడే బస చేయనున్నారు. తీహార్ జైలు నుంచి నేరుగా ఢిల్లీలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి వెళ్లారు. రేపు సీబీఐ ఛార్జీషీట్ పై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరుగనుంది. ఆ విచారణకు కవిత ఆన్ లైన్లో హాజరుకానున్నారు. అనంతరం.. హైదరాబాద్ కు రానున్నారు.
తాజావార్తలు
-
Super Subbu: బోల్డ్ సబ్జెక్టే.. కానీ ఫ్యామిలీతో చూడొచ్చు.. ‘సూపర్ సుబ్బు’పై సందీప్ కిషన్ హామీ
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Aarogya Setu 2.0: ఆరోగ్య సేతు 2.0 వచ్చేసింది!.. నిమిషాల్లో OPD బుకింగ్, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్..!
-
Gudivada Amarnath: మహిళా కమిషన్ ఎదుట నేడు విచారణకు మాజీ మంత్రి.. ‘నా వ్యాఖ్యల్లో తప్పు లేదు’..!
-
Pakistan Minister: “చేతులు నరికేస్తాం”.. సింధు జలాల విషయంలో భారత్కు పాక్ మంత్రి వార్నింగ్!
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!