నేడు ఢిల్లీలో ప్రధాని నేతృత్వంలో కేబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో మంత్రి వర్గ పునర్వవ్యస్థీకరణపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. దీనిపై పూర్తిగా కసరత్తు చేసిన ప్రధాని మోడీ మంత్రివర్గ పునర్వవ్యస్థీకరణ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది
ఉత్తర భారతదేశంలో కుండపోత వర్షాలు కొనసాగుతుండటంతో భారీ వర్షాలు, వరద సంబంధిత సంఘటనలలో 100 మందికి పైగా మరణించారు. గత వారం వర్షం ప్రారంభమైనప్పటి నుంచి హిమాచల్ ప్రదేశ్లోనే దాదాపు 80 మంది మరణించారు.
ఉత్తరాది రాష్ట్రాలను గత మూడ్రోజులుగా భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో యమునా నది ఉప్పొంగుతోంది.
దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు యమునా నది ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో నీటిమట్టం హెచ్చరిక స్థాయికి చేరుకుంది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు పాత రైల్వే వంతెన వద్ద యమునా నీటిమట్టం 204.36 మీటర్లకు చేరుకుంది.
మహిళలకు సమాజంలో ఎక్కడ రక్షణ లేకుండా పోయింది.. ప్రభుత్వం ఎన్నో రకాల చట్టాలను అమలు చేస్తున్నా కూడా కామాంధుల ఆగడాలు ఆడవాళ్ల పై తగ్గడం లేదు.. పోలీసులు ఇలాంటి ఘటనల పై కఠినంగా వ్యవరిస్తున్న మృగాల్లో మార్పులు రావడం లేదు..ఇంట్లో, స్కూళ్లో, ఆఫీస్ లో ఎక్కడ ఆమెకు రక్షణ దొరకడం లేదు. ఆమెకు లైంగిక వేధింపులు సాధారణమైపోయాయి. ఇప్పుడు చిన్నారిని దారుణంగా అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది..తాజాగా ఓ పదేళ్ల బాలికపై ఓ ట్యూషన్ టీచర్…
దేశ రాజధాని ఢిల్లీకి వరద ముప్పు పొంచి ఉంది. 41 ఏళ్ల తరువాత రికార్డు స్థాయిలో వర్షం కురవడంతో వరద ముప్పు పొంచి ఉన్నట్టు సెంట్రల్ వాటర్ కమిషన్(సీడబ్ల్యూసీ) హెచ్చరించింది.
శ రాజధాని ఢిల్లీలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండడంతో అన్ని ప్రాంతాలు నీటితో నిండి ఉన్నాయి. మరోవైపు లోధి రోడ్డులోని పలువురు ఎంపీల ఇళ్లు కూడా జలమయమయ్యాయి. ఢిల్లీలోని లజ్పత్తో పాటు అన్ని ప్రధాన మార్కెట్లలో నీటి కారణంగా జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. ఈ పరిస్థితుల దృష్ట్యా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాతో మాట్లాడారు. ఢిల్లీలో వర్షం కారణంగా ఏర్పడిన అత్యవసర పరిస్థితిని VK సక్సేనా…
గత రెండు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలు, వాతావరణ శాఖ హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీలోని అన్ని పాఠశాలలను సోమవారం ఒక్కరోజు మూసివేస్తున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.
ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గత రెండు రోజుల్లో దాదాపు 12 మంది మరణించారు. రానున్న రెండు రోజుల్లో మరిన్ని వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఢిల్లీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్లలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.
Delhi Rains: ఉత్తరాదిని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా దేశరాజధాని ఢిల్లీలో గత రెండు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం ఢిల్లీలోని సప్దర్ జంగ్ ప్రాంతంలో 153 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 1982 జూలై 25 తర్వాత 41 ఏళ్లకు భారీ వర్షం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.