Richest Woman: ఢిల్లీలో అత్యంత సంపన్న మహిళ ఎవరు.. ఎన్ని కోట్లు ఉన్నాయో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో ఎక్కువ ధనవంతులైన భారతీయ మహిళలు ఢిల్లీలో ఉన్నారని మీకు తెలుసా.. అవును ఢిల్లీ అలాంటి మహిళలకు నిలయంగా మారింది. దేశంలో ఉన్న ఇతర నగరాలకంటే ఢిల్లీలోనే రిచెస్ట్ విమెన్స్ ముగ్గురు ఉన్నారు. ఢిల్లీలో అత్యంత సంపన్న భారతీయ మహిళగా టాప్ ర్యాంక్ సాధించిన మహిళగా హెచ్సిఎల్ టెక్నాలజీస్ చైర్పర్సన్, రోష్నీ నాడార్ మల్హోత్రా నిలిచారు. ఆమె నికర విలువ 2022 నాటికి రూ. 84,330 కోట్లు ఉన్నాయి.
Ms Dhoni: ధోనీ క్రికెట్ అకాడమీలో స్కూల్ ప్రీమియర్ లీగ్.. రిజిస్ట్రేషన్స్ షూరు..!
Also Read
- Nara Lokesh: ఇప్పుడు 'మావిగన్'.. రేపు బెంగళూరు, తాడేపల్లి, హైదరాబాద్ కలిపి ‘బెన్తాహై’ అంటారేమో..!
- Simhachalam Temple Land: సింహాచలం భూముల వివాదంపై హైకోర్టు సీరియస్.. ప్రభుత్వానికి నోటీసులు
- Astrology: జూలై 2 గురువారం దినఫలాలు.. ఈ రాశివారికి ఊహించని గుడ్ న్యూస్..
- Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ 'నో ఛాన్స్'.!
భారతదేశంలోని అత్యంత ధనవంతులలో ఒకరైన వ్యాపార దిగ్గజం,హెచ్సీఎల్ ఫౌండర్ శివ్ నాడార్ ఏకైక కుమార్తె రోష్నీ. దాదాపు రూ. 3,00,000 కోట్ల మార్కెట్ క్యాప్తో ఐటీ రంగంలో మూడవ అతిపెద్ద కంపెనీ హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఈమె నాయకత్వంలో ఉంటుంది. కంపెనీకి సంబంధించి అన్ని నిర్ణయాలకు ఆమె బాధ్యత వహిస్తుంది. రోష్నీ నాయకత్వంలోనే హెచ్సిఎల్ కంపెనీ రూ.13,740 కోట్ల విలువైన ఏడు ఐబీఎం ఉత్పత్తులను కొనుగోలు చేసింది. ఇది కంపెనీ చరిత్రలోనే అతిపెద్దది. దీంతో ఆమె సంపద సంవత్సరానికి 54 శాతం పెరిగింది.
Amit Shah: ఏపీజే అబ్దుల్ కలాం ఇంటికి అమిత్ షా.. పుస్తకాన్ని ఆవిష్కరించిన కేంద్ర మంత్రి
రోష్నీ నాడార్ మల్హోత్రా ఢిల్లీలో పుట్టి పెరిగారు. వసంత్ వ్యాలీ స్కూల్లో విధ్యనభ్యసించారు. రేడియో/టీవీ/ఫిల్మ్పై దృష్టి సారించిన రోష్నీ.. నార్త్వెస్ట్రన్ విశ్వవిద్యాలయం నుండి కమ్యూనికేషన్లో గ్రాడ్యుయేషన్ చేశారు. అంతేకాకుండా 1976లో ఆమె తండ్రి శివ్ నాడార్ స్థాపించిన్ హెచ్సీసీఎల్ అభివృద్ధికి ఆమే ప్రధాన పాత్ర పోషించారు. జూలై 2020లో తన తండ్రి వారసత్వంగా హెచ్సిఎల్ చైర్పర్సన్ బాధ్యతను తీసుకున్నారు. 2017-2018, 2019 సంవత్సరాల్లో ఫోర్బ్స్ జాబితాలో ప్రపంచంలోని 100 మంది అత్యంత శక్తివంతమైన మహిళగా రోష్నీ చోటు సంపాదించుకున్నారు.
రోష్నీ కేవలం వ్యాపారవేత్తగానే కాదు.. రోష్ని నాడార్ శివ నాడార్ ఫౌండేషన్ ట్రస్ట్ కూడా ఉంది. అంతేకాకుండా ఇండియాలోని కొన్ని ఉన్నత కళాశాలలు, పాఠశాలలను స్థాపించారు. అటు సినిమా రంగం వైపు కూడా వెళ్లారు. మల్హోత్రా వన్యప్రాణుల సంరక్షకురాలు. 2018లో బాలల చిత్రం ‘హల్కా’ ను నిర్మించారు. 2019లో “ఆన్ ది బ్రింక్” అనే టీవీ సిరీస్ని రూపొందించారు. దేశంలోని అత్యంత ప్రమాదకరమైన జాతుల దుస్థితిపై తీసిన సిరీస్ 2022లో ఉత్తమ భారతీయ జాతీయ చలనచిత్ర అవార్డును కూడా గెలుచుకుంది. మరోవైపు తన భర్త శిఖర్ మల్హోత్రా హెచ్సీఎల్ కంపెనీలు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నారు. ఈ దంపతులకు ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు.
- Tags
- business news
- Delhi
- HCL
- Richest
- Woman
తాజావార్తలు
-
GST Collection June 2026: జూన్లో జీఎస్టీ వసూళ్ల జోరు.. రూ.1.95 లక్షల కోట్లకు చేరిన ఆదాయం
-
Nara Lokesh: ఇప్పుడు ‘మావిగన్’.. రేపు బెంగళూరు, తాడేపల్లి, హైదరాబాద్ కలిపి ‘బెన్తాహై’ అంటారేమో..!
-
Donald Trump: డియర్ ట్రంప్.. నీకంత సీన్ లేదంటగా..! ప్యూ రీసెర్చ్ సెంటర్ నివేదికలో బయటపడ్డ ప్రెసిడెంట్ గారి బండారం
-
Malayalam movie updates: మోహన్లాల్తో ప్రియదర్శన్ 100వ సినిమా వాయిదా.. కారణం ఇదేనా?
-
Syria New Parliament: సిరియాలో ‘కొత్త శకం’.. అసద్ పతనం తర్వాత తొలి పార్లమెంట్ ఇదే!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!