Ajit Agarkar: ఆ ఒక్కడి మాస్టర్ మైండ్.. భారత్ ఖాతాలో మూడు ఐసీసీ ట్రోఫీలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ajit Agarkar: టీ20 వరల్డ్కప్ ను భారత జట్టు ముచ్చటగా మూడోసారి గెలుచుకుంది. 2026 టీ20 వరల్డ్కప్ ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ను 96 పరుగుల తేడాతో ఓడించి భారత్ టైటిల్ను సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్ లో జస్ప్రీత్ బుమ్రా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకోగా, ఇక టోర్నమెంట్ ఆధ్యంతం అత్యుత్తమంగా ఆడిన సంజు శాంసన్ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా ఎంపికయ్యాడు. అయితే టీమిండియాకు ఈ విజయాన్ని అందించడంలో మరో కీలక వ్యక్తి కూడా ఉన్నడనంలో ఎటువంటి సందేహం లేదు.
Sanju Samson History: టీ20 ప్రపంచ కప్ హిస్టరీలో సంజు నయా చరిత్ర.. హేమాహేమీలకు కూడా సాధ్యం కాలే!
Also Read
అయితే అతను కోచ్ కాదు, ఆటగాడు కాదు, టీమ్ సపోర్ట్ స్టాఫ్ అసలే కాలేదు.. కానీ తన నిర్ణయాలతో భారత జట్టును విజయపథంలో నడిపించిన వ్యక్తి టీమిండియా చీఫ్ సెలెక్టర్ ‘అజిత్ అగర్కర్’. చీఫ్ సెలెక్టర్గా అజిత్ అగర్కర్ పదవీకాలం 2023 జూలై 4న మొదలయింది. అప్పటి నుంచి ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు భారత జట్టుకు వైట్ బాల్ ఫార్మాట్ లో ఎన్నో అద్భుత విజయాలను అందించాయి. ఆయన నేతృత్వంలో భారత జట్టు ఇప్పుడు మూడు ఐసీసీ టోర్నమెంట్లను గెలుచుకుంది.
ఇందులో 2024లో జరిగిన టీ20 వరల్డ్కప్ ఫైనల్ లో దక్షిణాఫ్రికాను ఓడించి భారత్ టైటిల్ గెలుచుకుంది. ఆ తర్వాత 2025 మార్చిలో న్యూజిలాండ్పై విజయం సాధించి చాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. తాజాగా 2026 మార్చి 8న న్యూజిలాండ్ను ఓడించి మరోసారి టీ20 వరల్డ్కప్ను గెలుచుకుంది. ఈ విజయాలు అజిత్ అగర్కర్ తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలు టీమిండియాకు ఎంతో ప్రయోజనం చేకూర్చాయి. టీ20 ఇంటర్నేషనల్ జట్టుకు సూర్యకుమార్ యాదవ్ను కెప్టెన్గా నియమించడం అప్పట్లో వివాదాస్పదంగా మారింది. చాలా మంది అభిమానులు, క్రికెట్ నిపుణులు హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ ఇవ్వాలని భావించినప్పటికీ.. ఆయన మాత్రం సూర్యకుమార్ పై పూర్తి నమ్మకం ఉంచారు. ఆ నిర్ణయం చివరకు మంచి ఫలితాలను ఇచ్చింది.
అదే విధంగా వన్డే జట్టు కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మను తప్పించి శుభ్మన్ గిల్ కు బాధ్యతలు అప్పగించడం కూడా ఆయన తీసుకున్న ఓ సాహసోపేత కీలక నిర్ణయం. రోహిత్ నాయకత్వంలో భారత్ చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన వెంటనే ఈ మార్పు జరగడం అప్పట్లో పెద్ద చర్చనీయాంశమైంది. ఇంకా టీ20 వరల్డ్కప్ 2026కు ముందు ఇషాన్ కిషన్ ను జట్టులోకి తీసుకోవడం కూడా అజిత్ అగర్కర్ చేసిన మాస్టర్ స్ట్రోక్ గా చెప్పవచ్చు. ఈ టోర్నమెంట్లో ఇషాన్ కిషన్ అద్భుత ప్రదర్శనతో తన ఎంపికను సార్థకం చేసుకున్నాడు.
అంతేకాదు అగర్కర్ పదవీకాలంలో భారత జట్టు 2023 వన్డే వరల్డ్కప్ ఫైనల్కు కూడా చేరింది. అయితే ఆ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైంది. అయినప్పటికీ ఆయన తీసుకున్న వ్యూహాత్మక, సంచలన నిర్ణయాలు భారత క్రికెట్కు కొత్త విజయాలను అందించాయి. ప్రస్తుతం టీమిండియా వరుస విజయాలతో ప్రపంచ క్రికెట్లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది అంటే చీఫ్ సెలెక్టర్ ‘అజిత్ అగర్కర్’ పాత్ర ఖచ్చితంగా ఉంది.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!