Ajit Agarkar: ఆ ఒక్కడి మాస్టర్ మైండ్.. భారత్ ఖాతాలో మూడు ఐసీసీ ట్రోఫీలు..!
Ajit Agarkar: టీ20 వరల్డ్కప్ ను భారత జట్టు ముచ్చటగా మూడోసారి గెలుచుకుంది. 2026 టీ20 వరల్డ్కప్ ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ను 96 పరుగుల తేడాతో ఓడించి భారత్ టైటిల్ను సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్ లో జస్ప్రీత్ బుమ్రా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకోగా, ఇక టోర్నమెంట్ ఆధ్యంతం అత్యుత్తమంగా ఆడిన సంజు శాంసన్ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా ఎంపికయ్యాడు. అయితే టీమిండియాకు ఈ విజయాన్ని అందించడంలో మరో కీలక వ్యక్తి కూడా ఉన్నడనంలో ఎటువంటి సందేహం లేదు.
Sanju Samson History: టీ20 ప్రపంచ కప్ హిస్టరీలో సంజు నయా చరిత్ర.. హేమాహేమీలకు కూడా సాధ్యం కాలే!
Also Read
- Telangana : పోలీస్ శాఖలో భారీ పదోన్నతులు.. సజ్జనార్, మహేష్ భగవత్ లకు డీజీపీ హోదా..!
- KTR: కాళేశ్వరంపై కాంగ్రెస్ అబద్ధాల కోటలు బద్దలయ్యాయి.. హైకోర్టు తీర్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
- LSG vs RR: టాస్ గెలిచిన లక్నో.. బ్యాటింగ్ ఎవరిదంటే?
- CM Revanth Reddy : పెద్దల చదువుకు పెద్ద పీట.. వయోజనుల్లో అక్షరాస్యత పెంపుపై ప్రత్యేక శ్రద్ధ..
అయితే అతను కోచ్ కాదు, ఆటగాడు కాదు, టీమ్ సపోర్ట్ స్టాఫ్ అసలే కాలేదు.. కానీ తన నిర్ణయాలతో భారత జట్టును విజయపథంలో నడిపించిన వ్యక్తి టీమిండియా చీఫ్ సెలెక్టర్ ‘అజిత్ అగర్కర్’. చీఫ్ సెలెక్టర్గా అజిత్ అగర్కర్ పదవీకాలం 2023 జూలై 4న మొదలయింది. అప్పటి నుంచి ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు భారత జట్టుకు వైట్ బాల్ ఫార్మాట్ లో ఎన్నో అద్భుత విజయాలను అందించాయి. ఆయన నేతృత్వంలో భారత జట్టు ఇప్పుడు మూడు ఐసీసీ టోర్నమెంట్లను గెలుచుకుంది.
ఇందులో 2024లో జరిగిన టీ20 వరల్డ్కప్ ఫైనల్ లో దక్షిణాఫ్రికాను ఓడించి భారత్ టైటిల్ గెలుచుకుంది. ఆ తర్వాత 2025 మార్చిలో న్యూజిలాండ్పై విజయం సాధించి చాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. తాజాగా 2026 మార్చి 8న న్యూజిలాండ్ను ఓడించి మరోసారి టీ20 వరల్డ్కప్ను గెలుచుకుంది. ఈ విజయాలు అజిత్ అగర్కర్ తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలు టీమిండియాకు ఎంతో ప్రయోజనం చేకూర్చాయి. టీ20 ఇంటర్నేషనల్ జట్టుకు సూర్యకుమార్ యాదవ్ను కెప్టెన్గా నియమించడం అప్పట్లో వివాదాస్పదంగా మారింది. చాలా మంది అభిమానులు, క్రికెట్ నిపుణులు హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ ఇవ్వాలని భావించినప్పటికీ.. ఆయన మాత్రం సూర్యకుమార్ పై పూర్తి నమ్మకం ఉంచారు. ఆ నిర్ణయం చివరకు మంచి ఫలితాలను ఇచ్చింది.
అదే విధంగా వన్డే జట్టు కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మను తప్పించి శుభ్మన్ గిల్ కు బాధ్యతలు అప్పగించడం కూడా ఆయన తీసుకున్న ఓ సాహసోపేత కీలక నిర్ణయం. రోహిత్ నాయకత్వంలో భారత్ చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన వెంటనే ఈ మార్పు జరగడం అప్పట్లో పెద్ద చర్చనీయాంశమైంది. ఇంకా టీ20 వరల్డ్కప్ 2026కు ముందు ఇషాన్ కిషన్ ను జట్టులోకి తీసుకోవడం కూడా అజిత్ అగర్కర్ చేసిన మాస్టర్ స్ట్రోక్ గా చెప్పవచ్చు. ఈ టోర్నమెంట్లో ఇషాన్ కిషన్ అద్భుత ప్రదర్శనతో తన ఎంపికను సార్థకం చేసుకున్నాడు.
అంతేకాదు అగర్కర్ పదవీకాలంలో భారత జట్టు 2023 వన్డే వరల్డ్కప్ ఫైనల్కు కూడా చేరింది. అయితే ఆ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైంది. అయినప్పటికీ ఆయన తీసుకున్న వ్యూహాత్మక, సంచలన నిర్ణయాలు భారత క్రికెట్కు కొత్త విజయాలను అందించాయి. ప్రస్తుతం టీమిండియా వరుస విజయాలతో ప్రపంచ క్రికెట్లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది అంటే చీఫ్ సెలెక్టర్ ‘అజిత్ అగర్కర్’ పాత్ర ఖచ్చితంగా ఉంది.
తాజావార్తలు
-
RTC Conductor Jobs: ఆర్టీసీ కండక్టర్, డ్రైవర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం..
-
Ukraine: ట్రంప్ను ప్రసన్నం చేసుకునేందుకు ఉక్రెయిన్ మాస్టర్ ప్లాన్!
-
Vaibhav Sooryavanshi: లక్నోపై చేసిన పరుగులు 8.. అయినా అరుదైన రికార్డు సాధించిన వైభవ్ సూర్యవంశీ..
-
Pune: పెళ్లి కోసం యువకుడి ఆరాటం.. ఏకంగా పోలీస్ శాఖలో ఉద్యోగం వచ్చినట్లు పోస్టర్లతో ప్రచారం..
-
LSG vs RR: పొదుపుగా బౌలింగ్ చేసిన లక్నో.. టార్గెట్ ఎతంటే?
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?