Supreme court: తమిళనాడు గవర్నర్ తీరుపై మండిపడ్డ ధర్మాసనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి తీరుపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. డీఎంకే నేత పొన్ముడిని మంత్రిగా ప్రమాణస్వీకారం చేయించడానికి అభ్యంతరం వ్యక్తం చేయడంపై గవర్నర్ ప్రవర్తనను ధర్మాసనం తప్పుపట్టింది. ఆస్తుల కేసులో పొన్ముడిని ఇటీవలే మద్రాస్ హైకోర్టు నిర్దోషిగా తేల్చింది. దీంతో స్టాలిన్ ప్రభుత్వం పొన్ముడిని మంత్రివర్గంలోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. కానీ గవర్నర్ మాత్రం అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో స్టాలిన్ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
గవర్నర్ రవి ప్రవర్తనను తప్పుబడుతూ భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరించడం సరైంది కాదని వ్యాఖ్యానించారు. చీఫ్ జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం.. గవర్నర్కు శుక్రవారం వరకు గడువు విధించింది. 24 గంటల్లో పొన్ముడితో ప్రమాణం చేయించాలని గవర్నర్కు కోర్టు ఆదేశించింది. లేకుంటే తాము జోక్యం చేసుకోవల్సి వస్తుందని న్యాయస్థానం హెచ్చరించింది. ధర్మాసనం మాట వినుకుంటే తదుపరి చర్యలకు ఉత్తర్వులు జారీ చేస్తామని పేర్కొంది. కళ్లు తెరిచి ఉన్నామని.. శుక్రవారం లోపు గవర్నర్ నిర్ణయం తీసుకోకపోతే న్యాయస్థానమే జోక్యం చేసుకోవల్సి వస్తుందని పేర్కొంది.
Also Read
- Notification Cancelled: నిరుద్యోగులకు అలర్ట్.. TGPSC నుంచి విడుదలైన ఆ నోటిఫికేషన్ రద్దు..
- Botsa Satyanarayana Emotional: మరోసారి బొత్స కన్నీళ్లు.. అమర్నాథ్ వ్యాఖ్యలతో కన్నీటి పర్యంతం
- Saudi Arabia Oil: హోర్ముజ్ తర్వాత మరో షాక్.. మూతపడ్డ సౌదీ చమురు పైప్లైన్.. భారత్కు పెరిగిన కష్టాలు!
- The Paradise: ప్యారడైజ్ సినిమా కోసం ఎన్ని టన్నుల రక్తం వాడారో తెలుసా.?
ఇటీవల ఆస్తుల కేసులో పొన్ముడిని మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం స్టే ఇచ్చింది. దీంతో ఆయన్ను స్టాలిన్ ప్రభుత్వం మంత్రివర్గంలోకి తీసుకునేందుకు ఏర్పాటు చేసుకున్నారు. కానీ అందుకు గవర్నర్ రవి నిరాకరించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం.. సుప్రీంను ఆశ్రయించింది. గురువారం విచారణ చేపట్టిన ధర్మాసనం.. గవర్నర్ తీరును తీవ్రంగా తప్పుపట్టింది. శుక్రవారంలోగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. లేదంటే తదుపరి చర్యలకు వెళ్లాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చింది.
గవర్నర్ రాజ్యాంగాన్ని గౌరవించాలని సూచించింది. ఎవరైనా సరే రాజ్యాంగానికి లోబడి ఉండాల్సిందేనని తెలిపింది. రాజ్యాంగాన్ని గౌరవించే మంత్రిగా ప్రమాణం చేయించాలని.. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో భాగంగా గవర్నర్ తన బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలని విచారణ సందర్భంగా న్యాయస్థానం వ్యాఖ్యానించింది.
తాజావార్తలు
-
Soori : అద్దం ముందు షర్ట్ విప్పేసి.. నా ఒంటిపై ఉన్న గాయాలకు నేనే ముద్దులు పెట్టుకున్నా.
-
Ganesh Utsav: ఇంటికే పరిమితమైన గణపతి గల్లీలోకి ఎలా వచ్చాడో తెలుసా? 1905 నాటి ఆ చరిత్ర ఇదిగో!
-
Notification Cancelled: నిరుద్యోగులకు అలర్ట్.. TGPSC నుంచి విడుదలైన ఆ నోటిఫికేషన్ రద్దు..
-
Irumudi Effect : అయ్యప్ప దీక్షలో గణపయ్య.. తలపై స్వయంగా ‘ఇరుముడి’ పెడుతున్న శివుడు!
-
Allu Arjun Fans : బాక్సాఫీస్ వద్దే కాదు సామాజిక సేవలోనూ ‘తగ్గేదే లే’
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!