Delhi Liquor Policy Case: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ని ఈడీ అరెస్ట్ చేసింది. ఈ కేసులో అరెస్టైన నాలుగో ఆప్ నేత కేజ్రీవాల్, ఆయన కన్నా ముందు ఆ పార్టీకి చెందిన సత్యేందర్ జైన్, మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ అరెస్ట్ అయ్యారు.
Read Also: Arvind Kejriwal: ఈడీ అరవింద్ కేజ్రీవాల్ని ఎందుకు అరెస్ట్ చేసిందంటే..? వివరాలు..
ఈ కేసులో కీలక పరిణామాలు:
* నవంబర్ 2021: ఢిల్లీ ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ పాలసీని అమలులోకి తెచ్చింది.
* జూలై 8 2022: ఢిల్లీ చీఫ్ సెక్రటరీ పాలసీలోని ఉల్లంఘనలను లెఫ్టినెంట్ గవర్నర్కి నివేదించారు.
* జూలై 22, 2022: ఈ పాలసీపై సీబీఐ విచారణకు లెఫ్టినెంట్ గవర్నర్ సిఫారసు.
* ఆగస్టు 19, 2022: అప్పటి డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో పాటు ముగ్గురిపై సీబీఐ దాడులు.
* ఆగస్ట్ 22, 2022: లిక్కర్ పాలసీపై ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు.
* సెప్టెంబర్, 2022: ఆప్ కమ్యూనికేషన్ హెడ్ విజయ్ నాయర్ని అరెస్ట్ చేసిన సీబీఐ.
* మార్చి 2023: డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసిన ఈడీ.
* అక్టోబర్ 2023: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కి ఈడీ తొలి సమన్లు.
* మార్చి 16, 2024: బీఆర్ఎస్ నేత కవితని అరెస్ట్ చేసిన ఈడీ.
* మార్చి 21, 2024: ఢిల్లీ మద్యం కేసులో 9 సార్లు ఈడీ సమన్లకు హాజరుకానీ సీఎం కేజ్రీవాల్. రక్షణ కల్పించేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరణ. కేజ్రీవాల్ ఇంటిలో ఈడీ సోదాలు, అరెస్ట్.