Delhi Police: దేశ రాజధానిలో ఢిల్లీ పోలీసు కానిస్టేబుల్ను ఓ కారు ఢీకొట్టిన సీసీటీవీ ఫుటేజీలు బయటపడ్డాయి. కన్నాట్ ప్లేస్ ఔటర్ సర్కిల్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఇక్కడ పోలీసులు పికెట్ ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేస్తున్నారు.
Swiss Woman Murder: ఢిల్లీలో ఇటీవల స్విట్జర్లాండ్ మహిళ దారుణ హత్యకు గురైంది. తిలక్ నగర్లో 30 ఏళ్ల నినా బెర్గర్ మృతదేహం శుక్రవారం లభ్యమైంది. గురుప్రత్ సింగ్ అనే వ్యక్తి సదరు మహిళతో రిలేషన కలిగి ఉన్నట్లు పోలీసులు వచ్చారు. స్విట్జర్లాండ్ లో ఉంటున్న మహిళను ప్లాన్ ప్రకారం ఇండియాకు వచ్చే విధంగా చేసి హత్య చేశాడు.
Delhi: ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. 55 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. ఆపై ఆమెను దారుణంగా హత్య చేశారు. ఈ కేసులో ఢిల్లీ పోలీసుల వింత విచారణ వెలుగులోకి వచ్చింది. ఈ మొత్తం కేసులో ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్ షీట్లో 'లైంగిక దోపిడీ' అనే పదం ఎక్కడా ప్రస్తావించబడలేదు.
Delhi: ఢిల్లీలో దారుణం జరిగింది. దొంగతనాన్ని అడ్డుకోబోయిన క్యాబ్ డ్రైవర్ని అత్యంత ఘోరంగా కారుతో ఈడ్చుకెళ్లిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియోలో వైరల్ అయ్యాయి. ఈ ఘటన ఢిల్లీలో మహిపాల్పూర్ ప్రాంతంలో జరిగింది. 43 ఏళ్ల క్యాబ్ డ్రైవర్ బిజేంద్ర ఈ ఘటనలో తీవ్రగాయాలపాలై మరణించారు.
Israel Hamas War: మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్ - పాలస్తీనా మధ్య భీకరంగా యుద్ధం కొనసాగుతోంది. ఈ యుద్ధాన్ని దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ పోలీసులు ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేశారు.
ఆన్లైన్ పోర్టల్ న్యూస్క్లిక్ చైనా నుంచి నిధులు తీసుకుని దానికి అనుకూలంగా వార్తలు రాస్తున్నారనే ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. ఆ ఎఫ్ఐఆర్లో నమోదు చేసిన కీలక విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.
న్యూస్క్లిక్ వ్యవస్థాపకుడు, ఎడిటర్-ఇన్-చీఫ్ ప్రబీర్ పుర్కాయస్థను మంగళవారం ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (UAPA) కింద నమోదు చేసిన కేసుకు సంబంధించి చైనా అనుకూల ప్రచారం కోసం డబ్బు అందుకున్నారనే ఆరోపణలతో ఆయనను అరెస్టు చేశారు.
చైనా నుంచి నిధులు తీసుకుని వారికి అనుకూలంగా వార్తలు రాస్తున్నారనే ఆరోపణలపై ఆన్లైన్ పోర్టల్ న్యూస్క్లిక్కు సంబంధించిన 30 ప్రాంగణాలపై ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం దాడి చేసింది. దీంతో పాటు న్యూస్క్లిక్కు సంబంధించిన జర్నలిస్టుల ఇళ్లలోనూ పోలీసులు సోదాలు చేశారు.
ISIS: ఢిల్లీ పోలీసులు భారీ ఉగ్రకుట్రను భగ్నం చేశారు. మోస్ట్ వాంటెండ్ అనుమానిత ఐసిస్ ఉగ్రవాది షానవాజ్ని అరెస్ట్ చేసినట్లు ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ సోమవారం తెలిపింది. తెల్లవారుజామున జైత్పూర్ లో షానవాజ్ని అరెస్ట్ చేశారు. అతనితో పాటు మరో ఇద్దరు వ్యక్తుల్ని కూడా అరెస్ట్ చేశారు. వీరిద్దరిపై ఎన్ఐఏ నగదును ప్రకటించింది. ఇద్దరిని మహ్మద్ రిజ్వాన్ అష్రాఫ్, మహ్మద్ అర్షద్ వార్సిగా గుర్తించారు. అష్రాఫ్ ని లక్నోలో అరెస్ట్ చేయగా.. అర్షద్ ని మొరాదాబాద్…