ISIS: చదివింది ఇంజనీరింగ్.. చేస్తున్నది టెర్రరిజం.. ఐసిస్ కుట్రలో సంచలన విషయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ISIS: ఢిల్లీ పోలీసులు భారీ ఉగ్రకుట్రను భగ్నం చేశారు. మోస్ట్ వాంటెండ్ అనుమానిత ఐసిస్ ఉగ్రవాది షానవాజ్ని అరెస్ట్ చేసినట్లు ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ సోమవారం తెలిపింది. తెల్లవారుజామున జైత్పూర్ లో షానవాజ్ని అరెస్ట్ చేశారు. అతనితో పాటు మరో ఇద్దరు వ్యక్తుల్ని కూడా అరెస్ట్ చేశారు. ఇద్దరిని మహ్మద్ రిజ్వాన్ అష్రాఫ్, మహ్మద్ అర్షద్ వార్సిగా గుర్తించారు. అష్రాఫ్ ని లక్నోలో అరెస్ట్ చేయగా.. అర్షద్ ని మొరాదాబాద్ లో పట్టుకున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. పాకిస్తాన్ హ్యండర్ల నుంచి పంపిన ఉగ్రవాద సాహిత్యం, బాంబు తయారీ వివరాలు ఇతర నేరారోపణ పత్రాలను షానవాజ్ నివాసం నుంచి స్వాధీనం చేసుకున్నారు.
ఇదిలా ఉంటే పట్టుబడిన ఉగ్రవాది షానవాజ్ గురించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. షానవాజ్ అతని సన్నిహితులు ముగ్గురు కలిసి పశ్చిమ కనుమలు, కర్ణాటకలోని హుబ్బలి, ధార్వాడ్, గుజరాత్ లోని అహ్మదాబాద్ ప్రాంతాల్లో రహస్య స్థావరాలు ఏర్పాటు చేసుకోవడానికి రెక్కీ నిర్వహించినట్లు తేలింది.
Also Read
- Prajwal Revanna: జైల్లో ప్రజ్వల్ రేవణ్ణతో మొబైల్, పెన్డ్రైవ్.. ఆ ఫోన్లలోనూ అశ్లీల వీడియోలు..!
- Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
- Xi Jinping: భారత్లో అడుగు పెట్టిన చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్.. మోడీతో భేటీపై అందరి చూపు..
- Su-57, Super Sukhoi, S-500: ఎస్యు-57, సూపర్ సుఖోయ్, ఎస్-500... రష్యా రక్షణ ప్రతిపాదనల జాబితాలో ఏమున్నాయి?
Read Also: Vinayaka Temple : ఆ వినాయక గుడికి వెళితే.. పెళ్లిళ్లు జరుగుతాయట.. ఆ గుడి ఎక్కడుందంటే?
షానవాజ్ విశ్వేశ్వరయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మైనింగ్ ఇంజనీరింగ్ చదివాడు. అతని భార్య బసంతి పటేల్ ని ఇస్లాం మతంలోకి మార్చాడు. ప్రస్తుతం ఆమె పేరు మరియమ్ అని ఢిల్లీ పోలీస్ అధికారి హెచ్ఎస్ ధాలివాల్ తెలిపారు. ప్రస్తుతం పట్టుబడిన ముగ్గురిని కోర్టులో హజరు పరచగా..7 రోజుల పోలీస్ కస్టడీకి అప్పగించింది.
గత నెలలోనే ఐసిస్ మాడ్యుల్ పై ఎన్ఐఏ షానవాజ్ తో పాటు మరో నలుగురి చిత్రాలను విడుదల చేసింది. వీరిపై రూ. 3 లక్షల రివార్డు ప్రకటించింది. మహ్మద్ అర్షద్ అలీగఢ్ యూనివర్సిటీ నుంచి బీటెక్ పట్టా పొందాడు, జామియా మిలియాలో పీహెచ్డీ చేస్తున్నాడు. మహ్మద్ రిజ్వాన్ కంప్యూటర్ సైన్స్ లో బీటెక్ చేశాడు. ఇతను మత పండితుడిగా శిక్షణ తీసుకుంటున్నాడు. నిందితులు వీవీఐపీలను టార్గెట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దేశంలోని వివిధ ప్రదేశాల్లో బాంబు పేలుళ్లకు కుట్ర చేస్తున్నారు.
- Tags
- Delhi
- Delhi police
- ISIS
- terrorism
తాజావార్తలు
-
The Paradise: ప్యారడైజ్ సినిమా కోసం ఎన్ని టన్నుల రక్తం వాడారో తెలుసా.?
-
India Matches: రేపు భారత్కు డబుల్ ధమాకా.. అఫ్గాన్తో పురుషుల జట్టు.. శ్రీలంకతో మహిళల టైటిల్ పోరు.!
-
Breakup: బ్రేకప్ తర్వాత కొన్ని రోజులకే ప్రేమ పుడుతుందా?
-
Suriya vs SK : సూర్య, శివకార్తీకేయన్ మధ్య సైలెంట్ ట్వీట్ వార్
-
Sabita Indra Reddy: తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఉందా? మాక్ అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నల వర్షం..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!