Delhi Pollution: ఢిల్లీలో తీవ్ర కాలుష్యం.. 12వ తరగతి వరకు అన్ని స్కూళ్లు బంద్
- రోజు రోజుకు దారుణంగా మారుతున్న ఢిల్లీ పరిస్థితి
- ఢిల్లీ ఎన్సిఆర్లో ఇకపై 10-12 తరగతులు కూడా ఆన్లైన్లోనే
- స్పష్టం చేసిన సుప్రీం కోర్టు
- ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో 1000 దాటిన AQI స్థాయి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీ పరిస్థితి రోజు రోజుకు దారుణంగా మారుతుంది. అధిక కాలుష్యంతో ఢిల్లీ ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇదిలా ఉంటే.. ఢిల్లీ- ఎన్సీఆర్ పరిధిలో కాలుష్యాన్ని నివారించేందుకు కఠిన చర్యలు అమలు చేయడంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నారంటూ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు.. విద్యార్థుల విషయంలో భారత అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీ ఎన్సిఆర్లో ఇకపై 10-12 తరగతులు కూడా ఆన్లైన్లో ఉండాలని కోర్టు ఆదేశించింది. ఇంతకుముందు మిగతా విద్యార్థుల పాఠశాలలు మూసివేసిన సంగతి తెలిసిందే.. తాజాగా 10, 12వ తరగతి స్కూళ్లు మూసివేయాలని కోర్టు ఆదేశించింది.
Read Also: TTD: శ్రీవాణి ట్రస్ట్ రద్దు.. టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు
Also Read
- Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
- APL-5లో కాకినాడ కింగ్స్ శుభారంభం.. 71 పరుగుల తేడాతో వైజాగ్ లయన్స్పై భారీ విజయం.!
- Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
- WWDCలో పొరపాటున 'ఫోల్డబుల్ ఐఫోన్' వివరాలు లీక్ చేసుకున్న Apple.!
ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై న్యాయమూర్తులు అభయ్ ఎస్ ఓకా, అగస్టిన్ జార్జ్ మసీహ్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఢిల్లీ, NCR పరిస్థితి చాలా దారుణంగా మారింది. అనేక ప్రాంతాల్లో AQI స్థాయి 1000 దాటింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని రాజధానిలో గ్రాప్-4ను అమలు చేయాలని ఉత్తర్వులు జారీ చేయగా.. ఇప్పుడు 10, 12వ తరగతి పాఠశాలల విద్యార్థుల తరగతులు కూడా ఆన్లైన్ లో నిర్వహించేలా ఉత్తర్వులు వచ్చాయి. అయితే ఈరోజు ఈ గ్రేప్-4 అమలుకు సంబంధించిన సమావేశం రద్దయింది.
Read Also: Crime News : ఐశ్వర్య అనే యువతి మిస్సింగ్.. చెట్ల పొదల్లో నిర్జన ప్రదేశంలో మృతదేహం లభ్యం
మరోవైపు.. ఢిల్లీ ప్రభుత్వం ఈరోజు (నవంబర్ 18) నుంచి గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ 4 కఠిన నిబంధనలను అమలు చేస్తోంది. ఢిల్లీలో ట్రక్కుల ప్రవేశాన్ని అధికారులు నిషేధించారు. కేవలం నిత్యవసర సరకులు తీసుకువచ్చే వాహనాలను మాత్రమే అనుమతిస్తారు. అలాగే ఢిల్లీ వెలుపల రిజిస్ట్రేషన్ అయిన లైట్ మోటర్ గూడ్స్ వెహికల్స్ను కూడా నిషేధించారు. బీఎస్ 4, డీజిల్ వాహనాలను కూడా అనుమతించడంలేదు. అలాగే.. నిర్మాణాలపై తాత్కాలిక నిషేధం విధించింది ప్రభుత్వం.
తాజావార్తలు
-
Health: రాత్రి 8 గంటలు నిద్రపోయినా అలసట ఎందుకు పోదు? చాలా మంది తెలుసుకోవాల్సిన నిజాలు!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ben Stokes: చిరకాల సలహాదారుడిని కలుస్తున్న బెన్ స్టోక్స్.. బయపడిపోతున్న ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు!
-
Peddi : భారీ నష్టాల దిశగా ‘పెద్ది’ నాన్ తెలుగు స్టేట్స్.. ఓవర్ సీస్ అంతకుమించి?
-
Petrol and Diesel Prices: పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా? వాహనదారులకు షాక్ తప్పదా?
ట్రెండింగ్
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!