ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ ఓటమి పాలైంది. 208 పరుగుల లక్ష్యంతో ఛేదనకు దిగిన హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి కేవలం 186 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 21 పరుగుల తేడాతో ఓడిపోయింది. నికోలస్ పూరన్(62), మార్క్రమ్(42) రాణించినా రన్రేట్ పెరిగిపోవడంతో సన్రైజర్స్కు మరో ఓటమి తప్పలేదు. ఢిల్లీ బౌలర్లలో ఖలీల్ అహ్మద్ 3 వికెట్లు, శార్దూల్ ఠాకూర్ 2 వికెట్లు…
ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియం వేదికగా ఈరోజు ఐపీఎల్లో 50వ మ్యాచ్ జరిగింది. సన్రైజర్స్తో జరుగుతున్న మ్యాచ్లో టాస్ ఓడి ముందు బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. అందరూ అనుకున్నట్లే ఢిల్లీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తన పాత టీమ్ సన్రైజర్స్పై చెలరేగి ఆడాడు. మరో ఓపెనర్ మన్దీప్ సింగ్ డకౌట్గా వెనుతిరిగినా వార్నర్ మాత్రం కళ్లు చెదిరేలా బ్యాటింగ్ చేశాడు. 58 బంతుల్లో 12…
ఐపీఎల్లో ఈరోజు ఆసక్తికర సమరం జరగనుంది. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తలపడనుంది. అయితే గతంలో 9 ఏళ్ల పాటు సన్రైజర్స్ జట్టులో ఆడిన డేవిడ్ వార్నర్ ఈ ఏడాది ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్నాడు. 9 ఏళ్ల పాటు సన్రైజర్స్ జట్టుతో ఆడటం వల్ల ఆ జట్టుతో వార్నర్కు మంచి అనుభవం ఉంది. కానీ గత ఏడాది అవమానకర రీతిలో వార్నర్కు తుదిజట్టులో కూడా చోటు దక్కలేదు. మేనేజ్మెంట్తో తారాస్థాయికి చేరిన విభేదాల…
గురువారం రాత్రి కోల్కతా నైట్రైడర్స్పై జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ఆటగాడు డేవిడ్ వార్నర్ అరుదైన ఘనతను నమోదు చేశాడు. ఈ మ్యాచ్లో కోల్కతాపై వార్నర్ 26 బంతుల్లో 8 ఫోర్లు సహాయంతో 42 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో కోల్కతా జట్టుపై అతడు వెయ్యి పరుగుల మార్కును అందుకున్నాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో రెండు జట్లపై వెయ్యి పరుగులు పూర్తి చేసిన తొలి ఆలగాడిగా వార్నర్ రికార్డు సృష్టించాడు. గతంలో పంజాబ్పై ఓవరాల్ ఐపీఎల్లో…
ఐపీఎల్లో వరుస పరాజయాలతో డీలా పడిపోయిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు గుడ్న్యూస్ అందింది. ఆ జట్టు స్టార్ బౌలర్, ఆల్రౌండర్ దీపక్ చాహర్ జట్టుతో చేరినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దీపక్ చాహర్ నెట్ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. ఆదివారం పంజాబ్తో జరిగే మూడో మ్యాచ్లో అతడు బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వేలంలో ఏకంగా రూ.14 కోట్లు పెట్టి చాహర్ను చెన్నై జట్టు తిరిగి దక్కించుకుంది. దీంతో అతడి సేవలు రవీంద్ర జడేజా నేతృత్వంలోని టీమ్కు…
ఆరెంజ్ ఆర్మీ ముద్దుగా వార్నర్ భాయ్ అని పిలుచుకునే సన్ రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ గత ఐపీఎల్ సీజన్ లో పేలవ ఆటతీరుకు తోడు నాయకత్వ వైఫల్యాలతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో స్థానం కోల్పోవడం తెలిసిందే. టోర్నీ మధ్యలో అవమానకర పరిస్థితుల్లో వార్నర్ ను తప్పించారంటూ అప్పట్లో వ్యాఖ్యలు వినిపించాయి. అయితే ఆర్సీబీలో చేరడానికి ఆసక్తి చూపిస్తున్నాడని, రానున్న సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు డేవిడ్ భాయ్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడన్నట్లు…
కరోనా కారణంగా కొన్ని రోజులు ప్రపంచ మొత్తం స్తంభించిన విషయ తెలిసిందే. అయితే ఆ సమయంలో టిక్ టాక్ ద్వారా తెలుగు అభిమానులకు చాలా దగ్గర అయ్యాడు మాజీ సన్ రైజర్స్ కెప్టెన్ దేవి వార్నర్. మొదట్లో మహేష్ బాబు డైలాగులు పాటలతో వచ్చిన వార్నర్ ఆ తర్వాత అల్లు అర్జున్ బుట్టబొమ్మ సాంగ్ ద్వారా ఇంకా పాపులర్ అయ్యాడు. కానీ ఆయా తర్వాత ఇండియాలో టిక్ టాక్ బ్యాన్ చేయడంతో ఇంస్టాగ్రామ్ ద్వారా ఆప్పుడప్పుడు అభిమానుల…
బుట్టబొమ్మ … బుట్టబొమ్మ అంటూ ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ సోషల్ మీడియాలో రచ్చ చేసిన సంగతి తెలిసిందే. వీలు చిక్కినప్పుడల్లా వార్నర్ తన భార్యాపిల్లలతో అల్లు అర్జున్ పాటలకు డాన్స్ వేస్తూ కనిపిస్తాడు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం , బన్నీ ఫ్యాన్స్ వార్నర్ ని పొగడ్తలతో ముంచేయడం జరుగుతూనే ఉన్నాయి. ఇక ఇటీవల కొద్దిరోజులు గ్యాప్ ఇచ్చిన వార్నర్ తాజాగా పుష్ప ఏయ్ బిడ్డా సాంగ్ తో ప్రత్యక్షమైపోయాడు. బన్నీ ఫేస్ని…
టీ20 ప్రపంచకప్ ముగిసింది. అయినా ఈ టోర్నీ గురించే చర్చ నడుస్తోంది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్పై ఆస్ట్రేలియా ఘన విజయం సాధించి ప్రపంచకప్పును ఎగరేసుకుపోయింది. మ్యాన్ ఆఫ్ సిరీస్గా నిర్వాహకులు డేవిడ్ వార్నర్ను ఎంపికచేశారు. వార్నర్ ఈ వరల్డ్ కప్లో ఏడు మ్యాచ్లు ఆడి 289 పరుగులు చేశాడు. వార్నర్ సగటు 48.16 కాగా, స్ట్రయిక్ రేటు 140కి పైగా ఉంది. అయితే అతడి కంటే పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ సగటు, స్ట్రయిక్…
టీ20 ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా గెలుపులో ఓపెనర్ డేవిడ్ వార్నర్ కీలకపాత్ర వహించాడు. 38 బంతుల్లో 53 పరుగులు చేసి ఆస్ట్రేలియాను గెలుపు వైపు తీసుకువెళ్లాడు. దీంతో డేవిడ్ వార్నర్ను అందరూ ప్రశంసిస్తున్నారు. ఈ జాబితాలో టాలీవుడ్ హీరో మహేష్బాబు కూడా ఉన్నాడు. నిజానికి వార్నర్పై ఈ ప్రపంచకప్లో ఎలాంటి అంచనాలు లేవు. ఎందుకంటే యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్లో అతడు రాణించలేదు. దీంతో సన్రైజర్స్ ఏకంగా జట్టు నుంచే వార్నర్ను తప్పించింది. ఈ పేలవ ప్రదర్శన…