Off The Record: కడియం, దానంలపై వేటు తప్పదా?.. అందుకే ఆచితూచి వ్యవహారమా?
- దానం, కడియం మినహా మిగతా ఎమ్మెల్యేల విచారణ పూర్తి
- మరింత సమయం కోరిన కడియం శ్రీహరి
- ఢిల్లీ పెద్దలతో దానం నాగేందర్ చర్చలు
- కడియం, దానంలపై వేటు తప్పదా?
- అందుకే ఆచితూచి వ్యవహారమా?
- కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా సికింద్రాబాద్ నుంచి దానం పోటీ
- కావ్యకు మద్దతుగా కాంగ్రెస్ తరపున కడియం ప్రచారం
- కడియం, దానంలపై పక్కా సాక్ష్యాధారాలు ఉన్నాయా?
- ఢిల్లీ పెద్దల నిర్ణయంతోనే దానంపై క్లారిటీ వస్తుందా?
- దానం కూడా గడువు కోరుతారా..రాజీనామా చేస్తారా?
- కడియం, దానంలపై ఏం జరగబోతోంది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై ఎనిమిది మంది ఎమ్మెల్యేల విచారణను స్పీకర్ పూర్తి చేశారు. ఇక మిగిలింది ఇద్దరే ఇద్దరు. కడియం శ్రీహరి, దానం నాగేందర్ల విచారణ పూర్తి చేస్తే ఇక ఖేల్ ఖతం. ఈ ఇద్దరి విచారణపై ఉత్కంఠ కొనసాగుతోంది. 8మంది ఎమ్మెల్యేలపై విచారణ చేసి…తీర్పు రిజర్వ్ చేసిన స్పీకర్….మరి కడియం, దానంలపై ఎలా వ్యవహరించబోతున్నారు..? ఇదే ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.
బీఆర్ఎస్ అభ్యర్దులుగా గెలిచి కాంగ్రెస్లో చేరినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బండ్ల కృష్ణమోహన్రెడ్డి, గూడెం మహిపాల్రెడ్డి, కాలె యాదయ్య, తెల్లం వెంకట్రావు, సంజయ్, ప్రకాశ్ గౌడ్, అరికపూడి గాంధీ, పోచారం శ్రీనివాస్రెడ్డి, కడియం శ్రీహరి, దానం నాగేందర్లపై అనర్హత వేటు వేయాలని సుప్రీం మెట్లు ఎక్కింది బీఆర్ఎస్. ఎట్టకేలకు సుప్రీం కోర్డు ఆదేశాలతో ఇప్పటికే దానం, కడియం మినాహా మిగతా 8మంది ఎమ్మెల్యేల విచారణ పూర్తి చేసిన స్పీకర్ తీర్పును రిజర్వ్ చేశారు. విచారణకు హాజరై వివరణ ఇవ్వడానికి గతంలో గడువు కోరిన కడియం, దానంలకు స్పీకర్ కొంత గడువు ఇచ్చినప్పటికీ తాజాగా సుప్రీ కోర్డు ఆదేశాలతో ఈనెల 23లోగా తన ముందు హాజరుకావాలని నోటీసులు జారీ చేశారు స్సీకర్ ప్రసాద్ కుమార్. కడియం, దానంలపై వేటు తప్పదని, ఈ ఇద్దరిపై కాంక్రీట్ ఎవిడెన్స్ ఉండటంతో ఆచితూచి వ్యవహరిస్తున్నారు.
Also Read
దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి ఆ వెంటనే వచ్చిన లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్దిగా పోటీచేశారు. ఇది తిరుగులేని సాక్ష్యం. ఇక కడియం శ్రీహరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్దిగా పోటీచేసిన తన కూతురు కడియం కావ్యకు మద్దతుగా కాంగ్రెస్కు ఓటు వేయాలని అనేక సభల్లో ప్రసగించారు. ఇది కూడా తిరుగులేని సాక్ష్యం. ఈ సాక్ష్యాలతో బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. మొత్తం ఈ ఇద్దరిపై వేటు తప్పదని భావిస్తున్న పరిస్థితుల్లో నోటీసులు జారీ కావడంతో ఈ ఇద్దరు ఏం చేయబోతున్నారనే ఉత్కంఠ నెలకొంది. ఇదే టైంలో కడియం శ్రీహరి ఈరోజు స్పీకర్ను కలిసి మరి కొంత సమయం కావాలని, గడువు ఇస్తే వివరణ ఇస్తానని లేఖ ఇచ్చారు. దీంతో స్పీకర్ కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.
ఇక దానం నాగేందర్ ఢిల్లీ బాట పట్టారు. కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలతో తాను ఏంచేయాలనే విషయంలో క్లారిటి తీసుకుని రేపో ఎల్లుండో స్పీకర్ను కలవాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే నోటీసులు అందుకున్న దానం ఈనెల 23న అనివార్యంగా స్పీకర్ ముందు హాజరుకావలసి ఉంటుంది. అయితే కడియం మాదిరిగానే గడువు కోరుతారా? లేదా రాజీనామా చేస్తారా? అన్న దానికిపై ఉత్కంఠ కొనసాగుతోంది. దానం రాజీనామాకు కూడా వెనుకాడబోనని సన్నిహితులతో చెప్పినట్లు తెలుస్తోంది. అమీతుమీ తేల్చుకోవడానికి దానం సిద్దపడ్డారని సమాచారం. మొత్తం మీద దానం, కడియం ఏం చేయబోతున్నారనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంటే ఆ 8మంది ఎమ్మెల్యేలపై విచారణ పూర్తి చేసి తీర్పు రిజర్వ్ చేసిన స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకబోతున్నారో చూడాలి.
తాజావార్తలు
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
Marco Rubio: భారత్ టూర్కు మార్కో రూబియో.. వెనిజులా ట్విస్ట్తో పర్యటనపై సర్వత్రా ఆసక్తి
-
New IPL Team: ఐపీఎల్ అభిమానులకు శుభవార్త.. కొత్తగా ఆ రాష్ట్రం పేరుతో మరో ఐపీఎల్ టీం..
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!
-
Supreme Court: ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ 8వ తరగతి పాఠంపై సుప్రీంకోర్టు యూటర్న్.. తాజా ఆదేశాలివే!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!