Off The Record: అనర్హత పిటిషన్స్ పై త్వరలోనే నిర్ణయం..ఆ ఇద్దరి మీద చర్యలు ఉంటాయా ?
- అనర్హత పిటిషన్స్పై త్వరలోనే నిర్ణయం..
- ఇప్పటికే నలుగురి విచారణ పూర్తి, స్పీకర్ తీర్పు రిజర్వ్..
- బుధవారం భద్రాచలం, జగిత్యాల ఎమ్మెల్యేల క్రాస్ ఎగ్జామినేషన్..
- 20న పోచారం, గాంధీ క్రాస్ ఎగ్జామినేషన్..
- నోటీసులకు ఇంకా రిప్లయ్ ఇవ్వని కడియం, దానం..
- ఈనెల 23 తర్వాత స్పీకర్ తీర్పుపై స్పష్టత..
- ఆ ఇద్దరి మీద చర్యలు ఉంటాయా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్స్ విచారణ కొలిక్కి వచ్చిందా..? ఇక నాన్చొద్దు… వాళ్ళ సంగతి తేల్చేయాల్సిందేనని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గట్టిగా డిసైడ్ అయ్యారా..? వేటుపడేది ఎవరి మీద? సేఫ్జోన్లో వెసులుబాట్లు ఎవరికి? నోటీసులకు ఇప్పటిదాకా సమాధానం ఇవ్వని ఆ ఇద్దరి సంగతేంటి? ఆ పంచాయితీకి ముగింపు ఏంటి?
Read Also: Maanya Anand: కమిట్మెంట్ ఇవ్వమని వెంటపడ్డాడు.. హీరో ధనుష్ మేనేజర్పై నటి షాకింగ్ కామెంట్స్!
Also Read
తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల మీద అనర్హత పిటిషన్స్ విషయంలో అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకునే సమయం ఆసన్నమైంది. మొదటి విడత నలుగురిపై విచారణ ముగిసింది. చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, పఠాన్చెరు శాసనసభ్యుడు గూడెం మహిపాల్ రెడ్డి, గద్వాల బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, రాజేంద్రనగర్ ప్రకాష్ గౌడ్ల విచారణ ముగిసింది. తీర్పు రిజర్వు చేసి పెట్టారు స్పీకర్ గడ్డం ప్రసాద్. ఇక రెండో విడతలో పోచారం శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ సంజయ్, అరికపూడి గాంధీ, తెల్లం వెంకట్రావ్ మీద వేసిన పిటిషన్స్ విచారణ జరుగుతోంంది. ఇప్పటికే రెండు దఫాలుగా ఎమ్మెల్యేల్ని పిలిచి ప్రశ్నించారు స్పీకర్. ఫైనల్గా రెండు పక్షాలకు క్రాస్ ఎగ్జామిన్కు అవకాశం ఇచ్చారాయన. బుధవారం నాడు భద్రాచలం MLA తెల్లం వెంకట్రావ్.. జగిత్యాల MLA సంజయ్ల క్రాస్ ఎగ్జామ్ నేషన్ ఉంటుంది.
Read Also: Maoists Arrest: ఏలూరు గ్రీన్ సిటీలో 15 మంది మావోయిస్టులు.. ఏపీవ్యాప్తంగా పోలీసుల తనిఖీలు!
ఈ నెల 20న పోచారం శ్రీనివాస్ రెడ్డి.. అరికపూడి గాంధీ విచారణలో భాగంగా ఇరు పక్షాల అడ్వకేట్స్ క్రాస్ ఎగ్జామినేషన్ జరగనుంది. ఆ తర్వాత…స్పీకర్ గడ్డం ప్రసాద్ తీర్పు ప్రకటించనున్నారు. ఐతే.. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి…దానం నాగేందర్ విషయంలో మాత్రం ఈ ప్రక్రియ ఇంకా మొదలవలేదు. స్పీకర్ ఇప్పటికే వాళ్ళిద్దరికీ నోటీసులు ఇచ్చారు. వాటికి త్వరలోనే రిప్లై ఇవ్వాలని ఇద్దరు శాసనసభ్యులు భావిస్తున్నట్టు సమాచారం. ఆ ఇద్దరి వివరణ అందిన వెంటనే స్పీకర్ తన నిర్ణయాన్నిప్రకటించే అవకాశం ఉంది.
Read Also: Tej Pratap Yadav: లాలూ, రబ్రీలను వేధిస్తున్నారు.. దర్యాప్తుకు కుమారుడి డిమాండ్..
అయితే, సుప్రీం కోర్టు కూడా నాలుగు వారాల గడువు ఇచ్చినందున ఆ లోపు తుది తీర్పు ఇవ్వాలని భావిస్తున్నారట స్పీకర్. ఓవరాల్గా ఈ నెల 23 తర్వాత తీర్పు పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి అనర్హత పిటిషన్స్పై విచారణ ముగిసింది. తీర్పు కూడా త్వలోనే ఉంటుంది. ఐతే ఆ జడ్జిమెంట్ ఎలా ఉండబోతోందన్న సస్పెన్స్ పెరుగుతోంది. స్పీకర్ నోటీసులకు ఇప్పటి వరకు వివరణ ఇవ్వని ఇద్దరు ఎమ్మెల్యేల మీద చర్యలు ఉంటాయా..? లేదా అని కూడా ఆసక్తిగా గమనిస్తున్నాయి రాజకీయవర్గాలు.
తాజావార్తలు
-
IPL 2026 Final: “ఈ సారి ఐపీఎల్ కప్పు గుజరాత్దే”.. బలమైన కారణాలను వివరించిన వరల్డ్ కప్ విన్నర్..
-
Mantralayam Tragedy: మంత్రాలయంలో విషాదం.. తుంగభద్ర నదిలో ఐదుగురు గల్లంతు.. నాలుగు మృతదేహాలు లభ్యం!
-
IPL 2026 Final: “గెలిచినా.. ఓడినా జాగ్రత్త”.. ఐపీఎల్ ఫైనల్కు ముందు ఆర్సీబీ ఫ్యాన్స్కు బిగ్ వార్నింగ్..
-
IRCTC Jyotirlinga Darshan Yatra: శివభక్తులకు ఐఆర్సీటీసీ గుడ్ న్యూస్.. ఒకే టూర్లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. పూర్తి వివరాలు ఇవే!
-
Siddipet District: వివాహేతర సంబంధం.. యువకుడికి కొట్టి చంపిన మహిళ కుటుంబీకులు..
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..