Today (14-01-23) Business Headlines: ఫారెక్స్ తగ్గింది.. పసిడి పెరిగింది: ఇండియాలోని విదేశీ మారక నిల్వలు మరోసారి తగ్గాయి. తాజాగా 126 కోట్ల డాలర్లకు పైగా క్షీణించాయి. ఫలితంగా 56 వేల 158 కోట్ల డాలర్లకు చేరాయి. రూపాయి విలువను రక్షించేందకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫారెక్స్ రిజర్వులను వెచ్చిస్తుండటంతో అవి నేల చూపులు చూస్తున్నాయి. ఇది ఈ నెల 6వ తేదీ వరకు అందుబాటులో ఉన్న సమాచారం.
Today (29-12-22) Business Headlines: ఐఓసీ విస్తరణ ప్రణాళిక: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ 2 తెలుగు రాష్ట్రాల్లో అమలుచేస్తున్న మరియు అమలుచేయనున్న విస్తరణ ప్రణాళికలను వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరులో ఏర్పాటుచేస్తున్న ఎల్పీజీ బాట్లింగ్ యూనిట్ మరో 3 నెలల్లో అందుబాటులోకి రానుంది. తెలంగాణలోని హైదరాబాద్కు దగ్గరలో మల్కాపూర్ వద్ద టెర్మినల్ నిర్మాణం 87 శాతం పూర్తయింది.
Today (27-12-22) Business Headlines: ‘‘పవర్ మెక్’’కి ఖాజీపేట: హైదరాబాద్కు చెందిన పవర్ మెక్ ప్రాజెక్ట్స్ అనే సంస్థ కొత్తగా వెయ్యి కోట్ల రూపాయలకు పైగా విలువైన లోకల్, నేషనల్, ఇంటర్నేషనల్ ఆర్డర్లను దక్కించుకుంది. లోకల్ కేటగిరీలో తెలంగాణలోని ఖాజీపేటలో 306 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్తో వ్యాగన్ రిపేర్ వర్క్షాపు నిర్మించనుంది. నేషనల్ లెవల్లో అదానీ గ్రూపు నుంచి 608 కోట్ల రూపాయల ఆర్డర్ పొందింది. ఇందులో భాగంగా మధ్యప్రదేశ్ మరియు ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోని ఆ…
Today(21-12-22) Business Headlines: దావోస్కు మంత్రి కేటీఆర్: తెలంగాణ ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్.. వచ్చే నెలలో స్విట్జర్లాండ్లోని దావోస్కి వెళ్లనున్నారు. జనవరి 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు అక్కడ జరగనున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొననున్నారు. ఇండియా నుంచి దాదాపు వంద మందికి పైగా హాజరుకానున్న ఈ సదస్సుకు తెలంగాణ నుంచి ప్రస్తుతానికి కేటీఆర్ పేరు ఒక్కటే తెర మీదికి వచ్చింది.
Today (20-12-22) Business Headlines: ‘ఏపీ బ్యాంక్’కి జరిమానా: ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోపరేటివ్ బ్యాంక్కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 26 లక్షల రూపాయలకు పైగా జరిమానా విధించింది. విజయవాడ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే ఈ బ్యాంకు.. రూల్స్ పాటించకపోవటంతో ఆర్బీఐ క్రమశిక్షణ చర్యలు చేపట్టింది. మరో 19 కోపరేటివ్ బ్యాంకుల పట్ల కూడా ఇదే నిర్ణయం తీసుకుంది. ఇందులో 17 బ్యాంకులు ఒక్క గుజరాత్కే చెందినవి కావటం గమనించాల్సిన విషయం.
ఆస్తులు అమ్ముతున్న రెడ్డీస్: హైదరాబాద్కు చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ నెదర్లాండ్స్లోని కొన్ని ఆస్తులను మరియు అప్పులను విక్రయించబోతోంది. ఈ మేరకు ఫ్రాన్స్కు చెందిన డెల్ఫార్మా గ్రూపుతో ఒపందం చేసుకుంది. ఈ సంస్థకు నెదర్లాండ్స్లో డాక్టర్ రెడ్డీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ బీవీ పేరుతో అనుబంధ సంస్థ ఉంది. దీనికి సంబంధించిన ఆస్తులను, రుణాలను అమ్మటంతోపాటు ఉద్యోగులను ట్రాన్స్ఫర్ చేస్తుంది.
Record Level Cars Sales: రోజులు మారాయి. పెళ్లిళ్ల రేంజ్ కూడా పెరిగింది. అత్తింటివారు కొత్తల్లుడికి కట్నం కింద కార్లు ఇస్తున్నారు. ఒకప్పుడు మ్యారేజ్కి గిఫ్ట్ రూపంలో ఎక్కువగా లేటెస్ట్ మోడల్ బైక్లు ఇచ్చేవారు. ఇప్పుడు ఆ ట్రెండ్ ఛేంజ్ అయింది. నూతన వధూవరులకి కాస్ట్లీ కానుకలుగా కార్లు బహూకరించేవారి సంఖ్య ప్రతి సంవత్సరంగా భారీగా వృద్ధి చెందుతోంది. దీంతో కార్ల విక్రయాలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. గతేడాది నవంబర్తో పోల్చితే ఈ సంవత్సరం నవంబర్లో కార్ల…
No Change in Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లో ఈరోజు శుక్రవారం కూడా దాదాపు నిన్నటి సీనే రిపీటైంది. ఇవాళ మొత్తం దాదాపుగా నష్టాల బాటలోనే సాగింది. ఎర్లీ ట్రేడింగ్లో కొద్దిసేపు లాభాల్లోకి వచ్చినా ఆ ఆనందం ఆదిలోనే ఆవిరైంది. అంతర్జాతీయ పరిస్థితులు ప్రతికూల ప్రభావం చూపాయి. అమెరికా మాదిరిగానే ఐరోపా కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచటం వల్ల విదేశాల నుంచి నిధుల ప్రవాహం తగ్గుముఖం పట్టడం బాగా మైనస్ అయింది.
Cement Rate Hike: దేశవ్యాప్తంగా సిమెంట్ బస్తా ధర రాన్రాను మరింత భారమవుతోంది. ఈ నెలలో 10 రూపాయల నుంచి 15 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉంది. ఈ మేరకు తయారీ సంస్థలు ప్రణాళిక రూపొందిస్తున్నాయి. ఈ ఏడాది ఆగస్టు-సెప్టెంబర్ మధ్య కాలంలో సిమెంట్ బస్తా రేటు 16 రూపాయలు పెరిగింది. నవంబర్లో మరో ఆరేడు రూపాయలు పెంచారు. ఇప్పుడు మళ్లీ పెంచేందుకు రంగం సిద్ధమవుతోంది.