Record Level Cars Sales: కొత్తల్లుడికి అత్తింటివారి కానుక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Record Level Cars Sales: రోజులు మారాయి. పెళ్లిళ్ల రేంజ్ కూడా పెరిగింది. అత్తింటివారు కొత్తల్లుడికి కట్నం కింద కార్లు ఇస్తున్నారు. ఒకప్పుడు మ్యారేజ్కి గిఫ్ట్ రూపంలో ఎక్కువగా లేటెస్ట్ మోడల్ బైక్లు ఇచ్చేవారు. ఇప్పుడు ఆ ట్రెండ్ ఛేంజ్ అయింది. నూతన వధూవరులకి కాస్ట్లీ కానుకలుగా కార్లు బహూకరించేవారి సంఖ్య ప్రతి సంవత్సరంగా భారీగా వృద్ధి చెందుతోంది. దీంతో కార్ల విక్రయాలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. గతేడాది నవంబర్తో పోల్చితే ఈ సంవత్సరం నవంబర్లో కార్ల కొనుగోళ్లలో 26 శాతం గ్రోత్ నెలకొంది.
ఒక వైపు.. ప్రపంచవ్యా్ప్తంగా చిప్ కొరత వేధిస్తోంది. మరో వైపు.. ఆర్థిక మందగమ భయాలు నెలకొన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా వాహన రంగంలో కార్లతోపాటు అన్ని విభాగాల్లో సేల్స్ పెరగటం పట్ల ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోయేషన్స్ హర్షం వ్యక్తం చేసింది. ఇండియన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ చరిత్ర మొత్తమ్మీద ఈ సంవత్సరం నవంబర్లో అత్యధిక రిటైల్ అమ్మకాలు జరిగినట్లు పేర్కొంది. అయితే.. దీనికి 2020 మార్చిలో జరిగిన సేల్స్ని మినహాయించాలి.
Also Read
- Upendra Dwivedi: పాక్కు గట్టి హెచ్చరిక! ‘ఆపరేషన్ సిందూర్’ ఇంకా కొనసాగుతోంది.!
- Sankranti Effect: సంక్రాంతికి దారులన్నీ ఆంధ్రా వైపే! ఖాళీ అయిన హైదరాబాద్.!
- Telangana: పిల్లల ఆరోగ్యంపై ప్రభావం? అల్మాంట్-కిడ్ సిరప్ను నిషేధించిన తెలంగాణ ప్రభుత్వం !
- YS Jagan: చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలు.. చేసేవన్నీ దొంగ పనులు.!
ఆ సంవత్సరం ఏప్రిల్ నుంచి వాహనాల్లో భారత్ స్టేజ్ 6 అంటే.. బీఎస్6.. ఇంజన్లను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రిటైల్ సేల్స్ పెరిగాయి. ఇదిలాఉండగా.. ఏటా.. సెప్టెంబర్-నవంబర్ మధ్య కాలంలో పండగ సీజన్లో కొత్త వెహికిల్ కొంటే మంచిదనే సెంటిమెంట్ ప్రజల్లో్ నెలకొనటం వల్ల కూడా వాహనాల కొనుగోళ్లు దూసుకుపోతున్నాయని నిపుణులు తెలిపారు. ఈ సంవత్సరం నవంబర్ 14 నుంచి డిసెంబర్ 14 వరకు పెళ్లిళ్ల సీజన్ అని, ఈ నెల రోజుల్లోనే 30 లక్షలకు పైగా వివాహాలు ఉన్నాయని పేర్కొన్నారు.
దీంతో టూవీలర్ మరియు ఫోర్ వీలర్ల విక్రయాలు బూస్ట్ అయ్యాయని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ అసోసియేట్ డైరెక్టర్ శ్రుతి సబూ చెప్పారు. ఆర్బీఐ ఇటీవల రెపో రేటు పెంచటం వల్ల వెహికిల్ లోన్ కస్టమర్లపై అదనపు భారం పడుతుందని, అయినప్పటికీ మార్కెట్లో కొత్త మోడల్ వెహికిల్స్ లాంఛ్ అవుతుండటంతో అమ్మకాలు తగ్గకపోవచ్చని యాడ్కౌంట్ మీడియా అనే మార్కెటింగ్ సంస్థ గ్లోబల్ మొబైల్ బిజినెస్ హెడ్ కుమార్ సౌరవ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!