Record Level Cars Sales: కొత్తల్లుడికి అత్తింటివారి కానుక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Record Level Cars Sales: రోజులు మారాయి. పెళ్లిళ్ల రేంజ్ కూడా పెరిగింది. అత్తింటివారు కొత్తల్లుడికి కట్నం కింద కార్లు ఇస్తున్నారు. ఒకప్పుడు మ్యారేజ్కి గిఫ్ట్ రూపంలో ఎక్కువగా లేటెస్ట్ మోడల్ బైక్లు ఇచ్చేవారు. ఇప్పుడు ఆ ట్రెండ్ ఛేంజ్ అయింది. నూతన వధూవరులకి కాస్ట్లీ కానుకలుగా కార్లు బహూకరించేవారి సంఖ్య ప్రతి సంవత్సరంగా భారీగా వృద్ధి చెందుతోంది. దీంతో కార్ల విక్రయాలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. గతేడాది నవంబర్తో పోల్చితే ఈ సంవత్సరం నవంబర్లో కార్ల కొనుగోళ్లలో 26 శాతం గ్రోత్ నెలకొంది.
ఒక వైపు.. ప్రపంచవ్యా్ప్తంగా చిప్ కొరత వేధిస్తోంది. మరో వైపు.. ఆర్థిక మందగమ భయాలు నెలకొన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా వాహన రంగంలో కార్లతోపాటు అన్ని విభాగాల్లో సేల్స్ పెరగటం పట్ల ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోయేషన్స్ హర్షం వ్యక్తం చేసింది. ఇండియన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ చరిత్ర మొత్తమ్మీద ఈ సంవత్సరం నవంబర్లో అత్యధిక రిటైల్ అమ్మకాలు జరిగినట్లు పేర్కొంది. అయితే.. దీనికి 2020 మార్చిలో జరిగిన సేల్స్ని మినహాయించాలి.
Also Read
- Upendra Dwivedi: పాక్కు గట్టి హెచ్చరిక! ‘ఆపరేషన్ సిందూర్’ ఇంకా కొనసాగుతోంది.!
- Sankranti Effect: సంక్రాంతికి దారులన్నీ ఆంధ్రా వైపే! ఖాళీ అయిన హైదరాబాద్.!
- Telangana: పిల్లల ఆరోగ్యంపై ప్రభావం? అల్మాంట్-కిడ్ సిరప్ను నిషేధించిన తెలంగాణ ప్రభుత్వం !
- YS Jagan: చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలు.. చేసేవన్నీ దొంగ పనులు.!
ఆ సంవత్సరం ఏప్రిల్ నుంచి వాహనాల్లో భారత్ స్టేజ్ 6 అంటే.. బీఎస్6.. ఇంజన్లను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రిటైల్ సేల్స్ పెరిగాయి. ఇదిలాఉండగా.. ఏటా.. సెప్టెంబర్-నవంబర్ మధ్య కాలంలో పండగ సీజన్లో కొత్త వెహికిల్ కొంటే మంచిదనే సెంటిమెంట్ ప్రజల్లో్ నెలకొనటం వల్ల కూడా వాహనాల కొనుగోళ్లు దూసుకుపోతున్నాయని నిపుణులు తెలిపారు. ఈ సంవత్సరం నవంబర్ 14 నుంచి డిసెంబర్ 14 వరకు పెళ్లిళ్ల సీజన్ అని, ఈ నెల రోజుల్లోనే 30 లక్షలకు పైగా వివాహాలు ఉన్నాయని పేర్కొన్నారు.
దీంతో టూవీలర్ మరియు ఫోర్ వీలర్ల విక్రయాలు బూస్ట్ అయ్యాయని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ అసోసియేట్ డైరెక్టర్ శ్రుతి సబూ చెప్పారు. ఆర్బీఐ ఇటీవల రెపో రేటు పెంచటం వల్ల వెహికిల్ లోన్ కస్టమర్లపై అదనపు భారం పడుతుందని, అయినప్పటికీ మార్కెట్లో కొత్త మోడల్ వెహికిల్స్ లాంఛ్ అవుతుండటంతో అమ్మకాలు తగ్గకపోవచ్చని యాడ్కౌంట్ మీడియా అనే మార్కెటింగ్ సంస్థ గ్లోబల్ మొబైల్ బిజినెస్ హెడ్ కుమార్ సౌరవ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Swara Bhasker: ‘‘రామ మందిర తీర్పుతో బాధపడ్డా.. షారుఖ్, సల్మాన్లకు క్షమాపణలు’’.. స్వరా భాస్కర్ మరో వివాదం..
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ పాదయాత్రపై కోమటిరెడ్డి సెటైర్లు..
-
NTA Exam Schedule: పరీక్షల క్యాలెండర్ విడుదల చేసిన NTA.. యూజీసీ నెట్ తేదీలివే..
-
Pakistan: పాక్ ఆర్మీకి అమెరికా డ్రోన్లు.. ట్రంప్ కుమారులతో లింక్.!
-
Trump-Houthi: సౌదీకి ట్రంప్ షాక్! హౌతీలతో రహస్య భేటీ.. అమెరికా సైడ్ అయినట్టేనా?
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!