No Change in Stock Market: నిన్నటిలాగే.. నిండా మునిగే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
No Change in Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లో ఈరోజు శుక్రవారం కూడా దాదాపు నిన్నటి సీనే రిపీటైంది. ఇవాళ మొత్తం దాదాపుగా నష్టాల బాటలోనే సాగింది. ఎర్లీ ట్రేడింగ్లో కొద్దిసేపు లాభాల్లోకి వచ్చినా ఆ ఆనందం ఆదిలోనే ఆవిరైంది. అంతర్జాతీయ పరిస్థితులు ప్రతికూల ప్రభావం చూపాయి. అమెరికా మాదిరిగానే ఐరోపా కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచటం వల్ల విదేశాల నుంచి నిధుల ప్రవాహం తగ్గుముఖం పట్టడం బాగా మైనస్ అయింది.
ఉక్రెయిన్పై రష్యా మరో క్షిపణి దాడి చేయటంతో పరిస్థితి మరింత దిగజారింది. అమ్మకాల ఒత్తిళ్లు సూచీలకు షాక్ ఇచ్చాయి. సెన్సెక్స్ 461 పాయింట్లు కోల్పోయి 61 వేల 337 వద్ద ముగిసింది. నిఫ్టీ 144 పాయింట్లు నష్టపోయి 18 వేల 270 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. సెన్సెక్స్లో కేవలం మూడు కంపెనీలు మాత్రమే లాభపడ్డాయి. వాటిలో హెచ్యూఎల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టాటా సంస్థలు ఉన్నాయి. సెన్సెక్స్లో పీఎన్బీ హౌజింగ్, యూనియన్ బ్యాంక్ తీవ్రంగా కుదేలైన కంపెనీల్లో టాప్లో నిలిచాయి.
Also Read
- Stock Market: TCS దూకుడు మామూలుగా లేదుగా.. ఒక్క వారంలోనే రూ.72,000 కోట్ల లాభం!
- Upcoming IPO 2026: వచ్చే వారం 7 ఐపీఓలు ప్రారంభం.. ఏ కంపెనీ IPOలో పెట్టుబడి అవకాశాలు ఎక్కువ?
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
read also: Cement Rate Hike: బరువు మారదు.. బస్తా లేవదు..
నిఫ్టీ మిడ్క్యాప్ హండ్రెడ్, నిఫ్టీ స్మాల్ క్యాప్ హండ్రెడ్ అర శాతం పడిపోయాయి. సెక్టార్ల వారీగా చూస్తే.. అన్ని రంగాల స్టాక్స్ ముగిపోయాయి. ఐటీ ఇండెక్స్ ఒక శాతానికి పైగా తగ్గిపోయింది. వ్యక్తిగత స్టాక్స్ విషయానికొస్తే.. జీఎంఎం పిఫాడ్లర్ కంపెనీ షేర్లు 18 శాతం పతనమయ్యాయి. ఈ సంస్థలోని 11 మిలియన్లకు పైగా ఈక్విటీ షేర్లు బ్లాక్ డీల్స్ ద్వారా చేతులు మారటం దెబ్బతీసింది. ఐటీసీ కంపెనీ షేర్ విలువ 2 శాతం నష్టపోయి 2 నెలల కనిష్టానికి.. అంటే.. 332 రూపాయలకు చేరింది.
మార్కెట్ ఇంత బలహీనంగా ఉన్నప్పటికీ మహింద్రా సీఐఈ కంపెనీ స్టాక్స్ రెండు రోజుల్లోనే 16 శాతం పెరిగి 52 వారాల గరిష్టాన్ని అందుకోవటం విశేషం. 10 గ్రాముల బంగారం అతిస్వల్పంగా 23 రూపాయలు పెరిగి గరిష్టంగా 54 వేల 130 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. కిలో వెండి రేటు 239 రూపాయలు తగ్గి 67 వేల 579 రూపాయల వద్ద క్లోజ్ అయింది. రూపాయి విలువ 9 పైసలు పెరిగింది. డాలరుతో పోల్చితే మారకం విలువ 82 రూపాయల 52 పైసల వద్ద ఉంది.
తాజావార్తలు
-
IMD Big Alert: దేశాన్ని కమ్ముకున్న మేఘాలు.. భారీ వర్షాలకు హెచ్చరిక.. ఇస్రో చిత్రాలు విడుదల
-
Fauji vs King: బాక్సాఫీస్ వార్.. ప్రభాస్ ‘ఫౌజీ’ vs షారుఖ్ ‘కింగ్’.. వెయ్యి కోట్ల వేటలో విజేత ఎవరు?
-
KVN : విజయ్ లెగసీకి అదిరిపోయే ట్రిబ్యూట్.. ‘జన నాయకుడు’
-
CJP Protest: ‘మోడీ ప్రభుత్వానికి ఇదే చివరి రోజు’.. ప్రాణత్యాగాలకు సిద్ధంకండి.. సీక్రెట్ యాప్పై దర్యాప్తు
-
Murali Kishor: ‘లెనిన్’ డైరెక్టర్కు బిగ్ ఛాన్స్.. సితారలోనే నెక్స్ట్ మూవీ! ఆ స్టార్ హీరో సినిమా?
ట్రెండింగ్
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!
-
స్క్రీన్ లేకుండానే పనిచేసే Google Fitbit Air త్వరలో భారత్లో లాంచ్.. ఫీచర్స్ ఇవే.!