VC Sajjanar : దేశ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను సైబర్ నేరగాళ్లు తమ దందాను పెంచుకోవడానికి అవకాశంగా మలుచుకుంటున్నారు. ఆర్మీ అధికారులమని చెప్పుకుంటూ అమాయక ప్రజలకు సందేశాలు పంపుతూ, విరాళాల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇలాంటి నకిలీ ఆర్మీ అధికారుల పట్ల అప్రమత్తంగా ఉండాలని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ప్రజలను హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ చేశారు. అందులో ఆయన.. కొందరు మోసగాళ్లు ఆర్మీ అధికారులమని నమ్మబలుకుతూ…
Miss World 2025: ఈనెల 10 నుండి 31 వరకు మిస్ వరల్డ్ ఈవెంట్ హైదరాబాద్ వేదికగా జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మిస్ వరల్డ్ ఈవెంట్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సైబరాబాద్ పోలీసులు తెలిపారు. ఇక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 10 నుండి 31 వరకు ఈవెంట్ కొనసాగుతుందని, మెయిన్ ఈవెంట్ ఈనెల 10, 31 వరకు ఉండబోతుందని తెలిపారు. అలాగే వివిధ దేశాల నుండి వచ్చే అతిధులకు…
Miss World 2025 : ప్రతిష్ఠాత్మక మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్న క్రమంలో.. అలాగే దేశవ్యాప్తంగా ‘ఆపరేషన్ సింధూర్’ నేపథ్యంలో హైదరాబాద్లోని మాదాపూర్లో ఉన్న ట్రైడెంట్ హోటల్లో భద్రతను అత్యంత కట్టుదిట్టం చేశారు. ఈ హోటల్లోనే మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొంటున్న అందమైన కంటెస్టెంట్లు బస చేస్తున్నారు. ట్రైడెంట్ హోటల్ భద్రతా బాధ్యతలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. హోటల్లో ఆక్టోపస్ టీమ్తో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. సైబరాబాద్ పోలీసులు హోటల్లో పకడ్బందీగా భద్రతను ఏర్పాటు…
Well Vision Scam: కూకట్పల్లి ప్రాంతంలో వెల్ విజన్ అనే కంపెనీ అధిక వడ్డీ ఆశ చూపి భారీగా మోసం చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. ప్రజల వద్ద నుండి సుమారు రూ. 14 కోట్ల మేరకు డబ్బు వసూలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. వెల్ విజన్ కంపెనీ వారు ప్రజలకు అధిక వడ్డీ ఇప్పిస్తామంటూ పెట్టుబడులు పెట్టాలని ఆకర్షించారు. కేవలం వడ్డీ మాత్రమే కాకుండా.. పెట్టుబడికి బోనస్గా గిఫ్ట్లు అందిస్తామని కూడా చెప్పి మోసం చేశారు.…
సైబరాబాద్ పోలీసులు ఫాల్కన్ స్కాం కేసును ఈడీకి రిఫర్ చేశారు. పెట్టుబడుల పేరుతో భారీగా వసూళ్లు చేసిన అమర్దీప్కుమార్పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. దేశవ్యాప్తంగా రూ.1700 కోట్లు వసూలు చేసినట్లు తేలింది. చిన్న పెట్టుబడులను పెద్ద కంపెనీల్లో పెట్టి అధిక లాభాలంటూ మోసం చేశారు. ఫాల్కన్ ఎండీ, సీఈవో, సీఓలు ఇప్పటికే దుబాయ్ చెక్కేశారు. వారికి సైతం లుకౌట్ నోటీసులు జారీ చేశారు. జల్సాల కోసం అమర్దీప్కుమార్ చార్టెడ్ ఫ్లైట్ కొని విదేశాల్లో తిరిగాడు. కేసు…
DCP Vineeth : అంతరాష్ట్ర మహిళ డ్రగ్ పెడ్లర్ ను TGANB, సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూర్ కు చెందిన శతాబ్ది మన్నా ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితురాలి వద్ద 6 లక్షల రూపాయల విలువ చేసే 60 గ్రాముల MDMA డ్రగ్స్, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ప్రధాన నిందితుడు ఆఫ్రికా కు చెందిన వారెన్ కొకరంగో పరారీ ఉన్నాడు. ఈ సందర్భంగా మాదాపూర్ డీసీపీ వినీత్ మీడియాతో మాట్లాడుతూ.. నిన్న…
Falcon : హైదరాబాద్ నగరాన్ని కుదిపేసే విధంగా మరో భారీ స్కామ్ వెలుగుచూసింది. ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ పేరిట కోట్లాది రూపాయలు మోసానికి పాల్పడిన ఫాల్కన్ క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డైరెక్టర్ కావ్య నల్లూరి, ఫాల్కన్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ పవన్ కుమార్ ఓదెలును సైబరాబాద్ ఆర్థిక నేర విభాగం పోలీసులు అరెస్టు చేశారు. ఫాల్కన్ సంస్థ చిన్న తరహా పెట్టుబడుల పేరుతో నిరుద్యోగులు, వ్యాపారులు, ఉద్యోగస్తులను ఆకర్షించి దేశవ్యాప్తంగా వేలాదిమందిని మోసం చేసింది. ప్రముఖ సంస్థలు…
Cyberabad Police: సంక్రాంతి పండుగ సందర్భంగా చాలా మంది ఊళ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. కానీ. ఈ సమయంలో అదనుగా దొంగలు చేతివాటం ప్రదర్శించడానికి అనువైన సమయం. అందుకే, సైబరాబాద్ పోలీసులు ప్రజలను అప్రమత్తం చేస్తూ కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. సంక్రాంతికి ఊరికి వెళ్లే వారికి పోలీసులు ఇచ్చిన సూచనలు ఇవే.. Also Read: Software Engineer Suicide: పెళ్లయి నెల రోజులు కాకముందే సాఫ్ట్వేర్ ఉద్యోగి సూసైడ్.. * దూర ప్రాంతాలకు వెళ్ళే వారు తమ…
CP Avinash Mohanty : సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ అనువల్ రిపోర్ట్ – 2024ను సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి వెల్లడించారు. ఈ సందర్భంగా సీపీ అవినాష్ మహంతి మాట్లాడుతూ.. 37689 కేసులను ఈ ఏడాది రిజిస్టర్ చేశామని తెలిపారు. మొత్తం రిజిస్టర్ అయిన కేసుల్లో 32 శాతం సైబర్ క్రైమ్ కేసులు నమోదయ్యాయని ఆయన పేర్కొన్నారు. 70 కోట్ల రూపాయలు సైబర్ నేరగాళ్ల నుంచి బాధితులకు రిఫండ్ చేసి ఇచ్చామని సీపీ మహంతి అన్నారు. ఎకనామిక్…
నిత్య పెళ్లికొడుకుల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. నిత్యం ఎక్కడో ఒక చోట ఇలాంటి ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్లోని గచ్చిబౌలిలో మోసాలకు పాల్పడుతున్న నిత్యపెళ్లికొడుకు కోసం పోలీసులు గాలిస్తున్నారు. విగ్గులు పెట్టుకుని వేషాలు మారుస్తూ మోసాలకు పాల్పడుతున్నాడు వంశీకృష్ణ అనే నిత్య పెళ్లికొడుకు.