Falcon Scam Case: రూ.1700 కోట్ల మోసం.. ఫాల్కన్ కేసు ఈడీకి అప్పగింత!
- పెట్టుబడుల పేరుతో భారీగా వసూళ్లు
- అమర్దీప్కుమార్పై లుకౌట్ నోటీసులు
- దుబాయ్లో అమర్దీప్కుమార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సైబరాబాద్ పోలీసులు ఫాల్కన్ స్కాం కేసును ఈడీకి రిఫర్ చేశారు. పెట్టుబడుల పేరుతో భారీగా వసూళ్లు చేసిన అమర్దీప్కుమార్పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. దేశవ్యాప్తంగా రూ.1700 కోట్లు వసూలు చేసినట్లు తేలింది. చిన్న పెట్టుబడులను పెద్ద కంపెనీల్లో పెట్టి అధిక లాభాలంటూ మోసం చేశారు. ఫాల్కన్ ఎండీ, సీఈవో, సీఓలు ఇప్పటికే దుబాయ్ చెక్కేశారు. వారికి సైతం లుకౌట్ నోటీసులు జారీ చేశారు. జల్సాల కోసం అమర్దీప్కుమార్ చార్టెడ్ ఫ్లైట్ కొని విదేశాల్లో తిరిగాడు. కేసు నమోదు కాగానే దుబాయ్కి పారిపోయాడు.
READ MORE: Kishan Reddy: బీఆర్ఎస్, కాంగ్రెస్ వల్ల తెలంగాణ ఆర్థిక పరిస్థితి దివాలా తీసింది..
Also Read
- CM Chandrababu Naidu: వర్క్ ఫ్రం హోంపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- Keralam: కేరళం సీఎం ఎంపికపై తర్జనభర్జన.. నిర్ణయం రేపటికి వాయిదా
- AIADMK: ముదిరిన అన్నాడీఎంకే సంక్షోభం.. విజయ్కు మద్దతు ఇచ్చిన నేతలపై వేటు..
- Karnataka: కర్ణాటక సర్కార్ కీలక నిర్ణయం.. పాఠశాలల్లో హిజాబ్, జంధ్యాలు ధరించేందుకు అనుమతి
ఫాల్కన్ కేసు విషయంపై ఇటీవల ఈఓడబ్ల్యూ డీసీపి ప్రసాద్ మాట్లాడారు. 2021 నుంచి డిపాజిట్లు వసూలు చేస్తున్నారని, ఫాల్కన్ ఇన్ వాయిస్ డిస్కౌంట్ ప్లాట్ ఫాం పేరుతో డిపాజిట్లు తీసుకున్నారని ఆయన అన్నారు. ఈ కేసులో కావ్య, పవన్ లను అరెస్టు చేశామని, ప్రధాన నిందితుడు అమీర్ దీప్ తో పాటు సురేందర్ మరికొంత మంది పరారీలో ఉన్నట్లు ఆయన తెలిపారు. నిందితులపై లుక్ ఔట్ నోటీసులు జారీ చేశామని, విదేశాలకు పారిపోయారన్న సమాచారంతో అవసరమైన చర్యలు తీసుకుంటుమని అయన అన్నారు. ట్రావెల్ డీటేయిల్స్ ను ఇమ్మిగ్రేషన్ అధికారులకు లేఖలు రాశామని, ఇందుకు సంబంధించి మొత్తం 22 అకౌంట్లు అధికారులు గుర్తించారని తెలిపారు.
READ MORE: Top Headlines @1PM: టాప్ న్యూస్!
ఈ మొత్తాన్ని వెబైసైట్, యాప్ లో ద్వారా ఈ డిపాజిట్లు వసూలు చేశారని, ఆన్ లైన్ లోనే డిపాజిట్దారులకు డిపాజిట్ కు సంబంధించిన డాక్యుమెంట్లను పంపించే వారని తెలిపారు. ఇలాంటి వాటిని నమ్మొద్దని, ఎక్కడ అత్యధిక లాభాలు తక్కువ సమయంలో వస్తాయంటే వాటిని అసలు నమ్మొద్దని సూచించారు. అమీర్ దీప్ బీహార్ కు చెందిన వ్యక్తని, ఇతని తండ్రి ఓ మాజీ ఆర్మీ అధికారని ఆయన తెలిపారు. విదేశీ కంపెనీలు ఉన్నట్లుగా క్రియేట్ చేసారని, ఆ కంపెనీలన్ని నకిలీవేనని భావిస్తున్నట్లు తెలిపారు. మొత్తంగా 850 కోట్ల రూపాయలు కొంతమంది డిపాజిట్ దారులకు రిటర్న్ చేశారని, ఇంకా 850 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉందని ఆయన అన్నారు. మొత్తానికి నిందితులను పట్టుకోవడానికి మొత్తం మూడు టీమ్ లను ఏర్పాటు చేశామని ఈఓడబ్ల్యూ డీసీపి ప్రసాద్ అన్నారు.
తాజావార్తలు
-
CM Chandrababu Naidu: వర్క్ ఫ్రం హోంపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Amul milk: సామాన్యుడి జేబుకు ‘అముల్’ చిల్లు.. రేపటి నుంచే పాలకు కొత్త రేట్లు! ఎంత ధర పెరిగాయంటే..
-
Mythri Ravi: ముగ్గురిదీ ఒకే సమస్య: మైత్రీ రవి
-
Keralam: కేరళం సీఎం ఎంపికపై తర్జనభర్జన.. నిర్ణయం రేపటికి వాయిదా
-
AIADMK: ముదిరిన అన్నాడీఎంకే సంక్షోభం.. విజయ్కు మద్దతు ఇచ్చిన నేతలపై వేటు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!