Falcon Scam Case: రూ.1700 కోట్ల మోసం.. ఫాల్కన్ కేసు ఈడీకి అప్పగింత!
- పెట్టుబడుల పేరుతో భారీగా వసూళ్లు
- అమర్దీప్కుమార్పై లుకౌట్ నోటీసులు
- దుబాయ్లో అమర్దీప్కుమార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సైబరాబాద్ పోలీసులు ఫాల్కన్ స్కాం కేసును ఈడీకి రిఫర్ చేశారు. పెట్టుబడుల పేరుతో భారీగా వసూళ్లు చేసిన అమర్దీప్కుమార్పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. దేశవ్యాప్తంగా రూ.1700 కోట్లు వసూలు చేసినట్లు తేలింది. చిన్న పెట్టుబడులను పెద్ద కంపెనీల్లో పెట్టి అధిక లాభాలంటూ మోసం చేశారు. ఫాల్కన్ ఎండీ, సీఈవో, సీఓలు ఇప్పటికే దుబాయ్ చెక్కేశారు. వారికి సైతం లుకౌట్ నోటీసులు జారీ చేశారు. జల్సాల కోసం అమర్దీప్కుమార్ చార్టెడ్ ఫ్లైట్ కొని విదేశాల్లో తిరిగాడు. కేసు నమోదు కాగానే దుబాయ్కి పారిపోయాడు.
READ MORE: Kishan Reddy: బీఆర్ఎస్, కాంగ్రెస్ వల్ల తెలంగాణ ఆర్థిక పరిస్థితి దివాలా తీసింది..
Also Read
- KTR: కచ్చితంగా తెలంగాణ భూమిపుత్రుల జాగీరే.. పవన్ కళ్యాణ్ మాకు నేర్పాల్సిన అవసరం లేదు!
- Delhi: ఘోర అగ్నిప్రమాదం.. రెస్టారెంట్లో మంటలు.! 21 మంది మృతి, పలువురికి గాయాలు.!
- Pawan Kalyan: "రాజకీయాల కోసం కాదు.. ప్రజల ఆకాంక్షల కోసం మద్దతిచ్చా".. తెలంగాణపై మరోసారి స్పందన.!
- KTR: "తెలంగాణ కంటే అభివృద్ధి చెందిన రాష్ట్రం చూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా".. కాంగ్రెస్, బీజేపీకి సవాల్.!
ఫాల్కన్ కేసు విషయంపై ఇటీవల ఈఓడబ్ల్యూ డీసీపి ప్రసాద్ మాట్లాడారు. 2021 నుంచి డిపాజిట్లు వసూలు చేస్తున్నారని, ఫాల్కన్ ఇన్ వాయిస్ డిస్కౌంట్ ప్లాట్ ఫాం పేరుతో డిపాజిట్లు తీసుకున్నారని ఆయన అన్నారు. ఈ కేసులో కావ్య, పవన్ లను అరెస్టు చేశామని, ప్రధాన నిందితుడు అమీర్ దీప్ తో పాటు సురేందర్ మరికొంత మంది పరారీలో ఉన్నట్లు ఆయన తెలిపారు. నిందితులపై లుక్ ఔట్ నోటీసులు జారీ చేశామని, విదేశాలకు పారిపోయారన్న సమాచారంతో అవసరమైన చర్యలు తీసుకుంటుమని అయన అన్నారు. ట్రావెల్ డీటేయిల్స్ ను ఇమ్మిగ్రేషన్ అధికారులకు లేఖలు రాశామని, ఇందుకు సంబంధించి మొత్తం 22 అకౌంట్లు అధికారులు గుర్తించారని తెలిపారు.
READ MORE: Top Headlines @1PM: టాప్ న్యూస్!
ఈ మొత్తాన్ని వెబైసైట్, యాప్ లో ద్వారా ఈ డిపాజిట్లు వసూలు చేశారని, ఆన్ లైన్ లోనే డిపాజిట్దారులకు డిపాజిట్ కు సంబంధించిన డాక్యుమెంట్లను పంపించే వారని తెలిపారు. ఇలాంటి వాటిని నమ్మొద్దని, ఎక్కడ అత్యధిక లాభాలు తక్కువ సమయంలో వస్తాయంటే వాటిని అసలు నమ్మొద్దని సూచించారు. అమీర్ దీప్ బీహార్ కు చెందిన వ్యక్తని, ఇతని తండ్రి ఓ మాజీ ఆర్మీ అధికారని ఆయన తెలిపారు. విదేశీ కంపెనీలు ఉన్నట్లుగా క్రియేట్ చేసారని, ఆ కంపెనీలన్ని నకిలీవేనని భావిస్తున్నట్లు తెలిపారు. మొత్తంగా 850 కోట్ల రూపాయలు కొంతమంది డిపాజిట్ దారులకు రిటర్న్ చేశారని, ఇంకా 850 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉందని ఆయన అన్నారు. మొత్తానికి నిందితులను పట్టుకోవడానికి మొత్తం మూడు టీమ్ లను ఏర్పాటు చేశామని ఈఓడబ్ల్యూ డీసీపి ప్రసాద్ అన్నారు.
తాజావార్తలు
-
Crime Thriller OTT : ఓటీటీలోకి మైండ్ బ్లాక్ చేసే మలయాళ ఇన్వెస్టగేషన్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
-
Vaibhav Sooryavanshi-Kohli: సెల్ఫిష్ అంటూ విరాట్ కోహ్లీని తిట్టిన వైభవ్ సూర్యవంశీ.. అసలు విషయం ఏంటంటే?
-
Job Crisis Explained: ఇంజినీర్లు, డాక్టర్లు ఉన్నారు కానీ ప్లంబర్లు లేరు..ఇండియాలో ఈ సైలెంట్ సంక్షోభానికి కారణమేంటి?
-
Viral News: 3 రోజుల్లో ఒంటరిగా 6000కిలోమీటర్ల ప్రయాణం.. RCB కోసం మహిళా ఫ్యాన్ ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు!
-
KTR: కచ్చితంగా తెలంగాణ భూమిపుత్రుల జాగీరే.. పవన్ కళ్యాణ్ మాకు నేర్పాల్సిన అవసరం లేదు!
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!