Cyber Crime: ట్రెండ్ ఫాలోఅవుతోన్న సైబర్ నేరగాళ్లు.. 5జీ పేరుతో దోచేస్తున్నారు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సైబర్ నేరగాళ్లు ఏ అవకాశాన్ని కూడా వదలడం లేదు.. ఇప్పుడు ప్రజల దృష్టిని ఎక్కువ ఏది ఆకర్షిస్తుంది.. వాళ్లను ఈజీగా ఎలా బురిడి కొట్టించవచ్చు అనే విషయాలు వాళ్లకు తెలిసినట్టు మరెవరికీ తెలియదేమో.. ఎందుకంటే.. దేనిపై చర్చ సాగుతోంది.. ప్రజలను ఎలా బుట్టలో వేయవచ్చు అనే విషయాల్లో ఎప్పటికప్పుడు కొత్త తరహాలో ముందుకు సాగుతున్నారు. భారత్లో 5జీ సేవలను ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోడీ.. మొదట మెట్రో సిటీల్లో, పెద్ద నగరాల్లో.. ఆ తర్వాత పట్టణాల్లో ఇలా వచ్చే ఏడాది చివరి నాటికి పూర్తిస్థాయిలో 5జీ సేవలను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాల్లో టెలికం సంస్థలు ఉన్నాయి.. అయితే, 5జీ టెలికం సేవలను అదనుగా భావించిన సైబర్ కేటుగాళ్లు.. సరికొత్త మోసాలకు తెరలేపుతున్నారు. 5జీ టెక్నాలజీకి అప్గ్రేడ్ కావాలంటూ వల విసురుతున్నారు.
Read Also: Russia-Ukraine war: పుతిన్ పిలుపుతో సైన్యంలో చేరిన రష్యా పౌరులు
Also Read
- Bengaluru: కన్నడ నటి ఇంట్లో వ్యాపారవేత్త మృతి.. మిస్టరీగా మారిన కేసు
- Ketan Agarwal Case: సియా-చేతన్ను కలిపిన ‘దీపావళి’.. ఆరోజు ఏం జరిగిందంటే..!
- Ketan Agarwal Case: కేఫ్లో గంటపాటు ప్రియుడితో కలిసి హత్యకు కుట్ర.. వెలుగులోకి వీడియోలు
- Ketan Agarwal Case: ‘సియా’ది ఇంత క్రిమినల్ మైండా? ప్రియుడి మైండ్ బ్లోయింగ్ స్టేట్మెంట్
5జీ పేరుతో మొబైల్ ఫోన్ల వినియోగదారులకు వివిధ రకాల లింకులతో కూడిన ఎస్ఎంఎస్లు, ఈ-మెయిళ్లు పంపుతున్నారు సైబర్ నేరగాళ్లు.. ఆ లింకులను క్లిక్ చేయండి.. ఆ తర్వాత వచ్చే ఓటీపీ వివరాలను తమకు చెప్పండి.. వెంటనే మీ సిమ్కార్డును అప్గ్రేడ్ చేస్తామంటూ నమ్మబలుకుతూ మెసేజ్లు పంపుతున్నారు.. ఇక, అసలే 5జీ తొందరలో ఉన్న కొందరు ఆ లింక్లను క్లిక్ చేసి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడిపోతున్నారట.. దీనిసై ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు.. 5జీ పేరుతో వచ్చే అడ్డమైన లింక్లు, మెసేజ్లను నమ్మవద్దు.. ఆ కేటుగాళ్లు చెప్పినట్టు చేయొద్దు.. వారి ఉచ్చులో పడొద్దు.. మీ బ్యాంకు ఖాతాలు లూటీ చేసుకోవద్దు అంటూ హెచ్చరిస్తున్నారు సైబర్ క్రైం పోలీసులు,
అంతే కాదు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా ఉండేందుకు కొన్ని సలహాలు కూడా ఇచ్చారు సైబర్ పోలీసులు.. 5జీ సేవల పేరుతో వచ్చే ఎస్ఎంఎస్లలోని లింకులను క్లిక్ చేయవద్దు అని విజ్ఞప్తి చేశారు.. 5జీ అప్గ్రేడేషన్ పేరిట ఎవరైనా మన ఫోన్కు ఓటీపీలు పంపి ఆ వివరాలను చెప్పమంటే దానిని సైబర్నేరగాళ్ల పనిగా గుర్తించాలని సూచించారు.. 5జీ సేవలను పొందాలనుకొనేవారు నేరుగా తమ సర్వీస్ ప్రొవైడర్ స్టోర్ను సంప్రదించాలి.. కానీ, అప్గ్రేడ్ పేరిట వచ్చే ఎలాంటి మెసేజ్లను నమ్మవద్దు అంటున్నారు. కాగా, గతంలో 4జీకి మారినప్పుడు.. సంబంధిత సర్వీస్ ప్రొవైడర్లను సంప్రదించి.. కొత్త సిమ్లు తీసుకోవడం.. దీంతో, 4జీకి అప్గ్రేడ్ అయ్యాం.. దీంతో, గుర్తించుకోవాల్సిన అవసరం ఏంటంటే.. 5జీ డైరక్ట్ అప్గ్రేడ్కు అవకాశం ఉండదు.. అదే నంబర్పై మరో సిమ్ తీసుకోవాల్సి ఉంటుందనే విషయాన్ని మరవొద్దని చెబుతున్నారు.
మరోవైపు, సైబర్ మోసాలకు సంబంధించిన కేసులో దేశవ్యాప్తంగా 105 ప్రదేశాల్లో సోదాలు చేశారు సీబీఐ అధికారులు.. ఇంటర్ పోల్ నుంచి వచ్చిన సమాచారంతో… పలు రాష్ట్రాల పోలీసులతో కలిసి సంయుక్త ఆపరేషన్ చేపట్టారు.. పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, కర్ణాటక, అస్సాంలో సోదాలు నిర్వహించారు.. రాజస్థాన్లోని రాజ్సమంద్ ప్రాంతంలో సైబర్ ఫ్రాడ్ కాల్ సెంటర్ బహిర్గతమైందని చెబుతున్నారు.. కాల్ సెంటర్లో సుమారు 1.5 కోట్ల నగదు, కిలోన్నర బంగారం స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు సీబీఐ అధికారులు.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!